Tag Archives: rajinikanth

రజినీకాంత్ ముఖంపై లిప్ స్టిక్ మరకలు.. అసలు ఈ ఫోటో బయటకు ఎందుకు వచ్చింది?

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అతని సినిమాలు ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతాయ అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రజినీకాంత్ సినిమాలలో తన నటనతో, లక్షలాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నారు. సినిమాలలో విలన్ లను ఒక ఆట ఆడించే ఇతను తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా నెమ్మదస్తుడట.

రజనీకాంత్, లత ల పెళ్లి ఫిబ్రవరి 26,1981 తిరుపతి లో జరిగింది. ఈ దంపతులకు ఐశ్వర్య,సౌందర్య అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.రజినీకాంత్ ఎక్కడికి వెళ్ళినా కూడా అతని వెంట భార్య కానీ కుమార్తెలు కానీ తప్పకుండా ఉంటారు. 1980 లో షూటింగ్ లో సెట్ పై రజిని ఉన్నప్పుడు తన కాలేజీ మాగజైన్ కోసం ఇంటర్వ్యూ నిమిత్తం ఆయనను తొలిసారి కలిశారు లత . ఆ ఇంటర్వ్యూలో వారిద్దరి అభిరుచులు ఒకటే అని వారు గ్రహించారు.

ఆ ఇంటర్వ్యూ అయిపోయాక పెళ్లి ప్రపోజల్ చేశారు రజినీకాంత్. మొదట ఊహించని ప్రపోజల్ కు షాక్ అయిన లత, ఆ తర్వాత ఆనందపడి తన తల్లిదండ్రులతో మాట్లాడాలి అని చెప్పిందట. ఇండస్ట్రీలో పలువురు ప్రముఖుల చేత తల్లిదండ్రులతో మాట్లాడిచ్చారు రజనీకాంత్. లత తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు తిరుపతిలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.

ఇక రజిని,లత పెళ్లి రోజు సందర్భంగా ఒకసారి వారి పెద్ద కుమార్తె ఐశ్వర్య తన తల్లిదండ్రులకు సంబంధించిన ఒక స్వీట్ మెమోరీ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆ ఫోటోలో రజనీకాంత్ ముఖంపై తో రెడ్ కలర్ లిప్ స్టిక్ తో లత పెయింటింగ్ వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోని చూస్తే రజనీకాంత్, లత ఎంత అన్యోన్యంగా ఉన్నారో అర్థం అయిపోతుంది .

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సూపర్ స్టార్ రజినీ..!

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రజినీకాంత్ ఇటీవలె అనారోగ్యం కారణంగా చెన్నై లోని కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం మన అందరికి తెలిసిందే.రజనీకాంత్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు.ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యంపై చెన్నైలోని కావేరి హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

రజనీకాంత్‌కు వంట్లో నలతగా ఉండటంతో ఆయన అసౌకర్యానికి గురయ్యారని అందుకే చెన్నై ఆళ్వారుపేటలోని కావేరీ ఆసుపత్రిలో గురువారం చేరారని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో వివరించారు.
అయితే తాజాగా రజినీకాంత్ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.తాను ఇంటికి చేరుకున్న విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశారు. చికిత్స పూర్తి అయింది. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థ‌న‌లు చేసిన నా మిత్రులకు , శ్రేయోభిలాషులకు, అభిమానుల‌కు హృద‌య పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌త‌లను తెలియ‌జేస్తున్నానని ర‌జ‌నీకాంత్ తెలిపారు.

ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తరువాత ర‌జ‌నీకాంత్‌కి కాస్త న‌ల‌త‌గా అనిపించ‌డంతో ఆయ‌న కావేరి ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్యులు ఆయ‌న్ని ప‌రిశీలించి మెద‌డులోని న‌రాల్లో ఏవో బ్లాక్స్ ఉన్నాయ‌ని గుర్తించి చికిత్స అందించారు. క‌రోటిడ్ ఆర్ట‌రీ రివాస్కుల‌రైజేష‌న్ శ‌స్త్ర చికిత్స చేయించుకోవాల‌ని వైద్యులు ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సూచించారు.

దీంతో ర‌జనీకాంత్ శ‌స్త్ర చికిత్స‌కు ఓకే చెప్ప‌డంతో క‌రోటిడ్ ఆర్ట‌రీ రివాస్కులైజేష‌న్ శ‌స్త్ర చికిత్స విజ‌యవంతంగా పూర్తి చేశారు. రెండు రోజుల పాటు హాస్పిట‌ల్‌లోనే రెస్ట్ తీసుకున్న ర‌జినీకాంత్ తాజాగా ఇంటికి చేరుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే త‌లైవా న‌టించిన అన్నాత్తె చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. తెలుగులో పెద్ద‌న్న పేరుతో రిలీజ్ కానుంది.తమ అభిమాని హీరో కోలుకొని ఇంటికీ రావడంతో రజినీకాంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చెల్లెలి పాత్రకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నటి.. ఆందోళనలో అభిమానులు!

కీర్తి సురేష్ ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మహానటి సినిమాతో కేవలం తెలుగు తెలుగు ప్రేక్షకులకే కాదు తమిళం, హిందీ ఇండస్ట్రీ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ అందాల ఆరబోతకు దూరంగా ఉండి స్టార్ డమ్ తెచ్చుకుంటుంది కీర్తి. వరస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడూ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటుంది.

మలయాళం లో సూపర్ హిట్ ప్రేమమ్ సినిమాతో నీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అ..ఆ నీ మాతో తో తెలుగు సినిమాలోకి తెరంగ్రేటం చేసింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది.ఈ మలయాళీ బామకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అతి కొద్దీ కాలంలోనే యూత్ లో భారీ క్రేజ్ ని సంపాదించుకుంది.సోషల్ మీడియా ఫేస్ బుక్ లో , ఇంస్టాగ్రామ్ లలో మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది బ్యూటీ.

ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ ఒకవైపు తమిళ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ తో.. మరొకవైపు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో ఛాన్సులు కొట్టేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఒకేసారి ఇద్దరు లెజెండ్స్ తో స్క్రీన్ చేసుకునే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అంతేకాకుండా ఈ బ్యూటీ ఇద్దరు బిగ్ స్టార్స్ కు చెల్లెలి పాత్రలో నటించడం మరొక ఇంట్రెస్టింగ్ విషయం. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తే ఈ సినిమాలో రజనీకాంత్ కి చెల్లెలు గా నటిస్తోంది.

చిరంజీవి హీరోగా నటిస్తున్న బోళా శంకర్ సినిమాలో చిరుకి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. సురేష్ చెల్లెలు క్యారెక్టర్ కే పరిమితం అయ్యింది. దీంతో ఆమె అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకూ మంచి మంచి పాత్రలో డిఫరెంట్ రోల్స్ చేస్తూ వెళ్ళిన కీర్తి సురేష్ ఒకే టైపు రోల్స్ చేయడాన్ని వారు అంతగా జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ విషయంపై కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కీర్తి చెల్లెకు కేరాఫ్ గా మారి పోతున్నావ్ ఏంటి? అంటూ నేమ్స్ అండ్ కామెంట్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.

రజనీకాంత్ సినిమాలో నటించిన ఈ కుర్రాడు బాలీవుడ్ హీరో.. ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా?

సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి సంఘటన ఒక మధుర జ్ఞాపకమే. ఇక ఏ వ్యక్తికైనా వారి బాల్యం ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఈ తరుణంలోనే చిన్నప్పటి జరిగిన సన్నివేశాలను ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలను చూసుకుంటూ అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తారు.ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది బాలనటులుగా అడుగు పెట్టారు.

ఈ విధంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వారు అతి కొంత సమయంలోనే హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన వారే. ఈ క్రమంలోనే అలాంటి ఫోటోలు కనిపించగానే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులు ఈ ఫోటోలో ఉన్న హీరో హీరోయిన్లు ఎవరో గుర్తుపట్టారా అంటూ.. వారి మెదడుకు పదును పెడుతున్నారు.

తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరో చెప్పండి అంటూ పెద్దఎత్తున ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్థానం ఏంటో అందరికీ తెలిసిందే. ఒక సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో ఆదరాభిమానాలను సంపాదించుకొని గొప్ప స్థాయిలో ఉన్నారు.

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కేవలం తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా అన్ని భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు.1986 రజనీకాంత్ హిందీలో నటించినటువంటి చిత్రం “భగవాన్ దాదా”. ఈ చిత్రాన్ని రాకేష్ రోషన్ నిర్మించారు. ఇకపోతే ఈ చిత్రంలో రజనీకాంత్ దత్తపుత్రుడిగా 12 సంవత్సరాల కుర్రోడు సందడి చేశాడు. అయితే ఆ కుర్రాడు ఎవరు అనే విషయానికి వస్తే రజనీకాంత్ భగవాన్ దాదా సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన టువంటి రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్ రోషన్. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హృతిక్ రోషన్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.

రజనీకాంత్ అంకుల్ తో హీరోయిన్ గా చేయడానికి అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా: నటి మీనా

అందం అభినయం,నటనా నైపుణ్యంతో అచ్చ తెలుగు అమ్మాయిగా ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న హీరోయిన్లలో అలనాటి నటి మీనా ఒకరు. 90లలో ఈమె తమిళ, తెలుగు రాష్ట్రాలలో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు. ఎన్నో కుటుంబ కథాచిత్రాలలో ఎంతో అద్భుతంగా నటించిన మీనా నిజానికి తమిళమ్మాయి అయినప్పటికీ ఈమె మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు.

నటనపై ఆసక్తి ఉండడం చేత మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనా ఆ తర్వాత హీరోయిన్ గా సినిమా అవకాశాలు దక్కించుకొని ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ తో జతకట్టి నటించిన “ముత్తు”సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని  “థిల్లానా థిల్లానా” పాట అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

నిజానికి మీనా రజనీకాంత్ సరసన నటించిన మొట్ట మొదటి చిత్రం  ‘యజమాన్‌’. ఈ సినిమాను తెలుగులో “రౌడీ జమిందార్” గా డబ్ చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో రజినీకాంత్ గారితో నటించడానికి తను చాలా ఇబ్బంది పడ్డానని, మీనా ఓ సందర్భంలో తెలియజేశారు. అలా ఇబ్బంది పడటానికి కారణం ఏంటనే విషయానికి వస్తే… మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా రజనీకాంత్ నటించిన “అన్బుళ్ల రజనీకాంత్” అనే సినిమాలో రజినీకాంత్ గారిని అంకుల్.. అంకుల్ అంటూ పిలుస్తూ తిరిగేదాన్ని. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం రజనీకాంత్ ఇంట్లోనే జరిగింది.

అలా రజనీకాంత్ గారిని అంకుల్ అని పిలుస్తూ ఇప్పుడు హీరోయిన్ గా తన పక్కన రొమాన్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పడ్డానని, అయితే తన కెరీర్ మొదట్లోనే అలాంటి సూపర్ స్టార్ తో నటించే అవకాశం వచ్చిందని మరొకవైపు ఆనందం పొంగుకొస్తున్నా, మరోవైపు భయం వేసేదని తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ లో భాగంగా మీనా పువ్వులు కోయటానికి వెళుతూ కిందపడే దృశ్యాన్ని చిత్రీకరించారు.ఈ షాట్ ఓకే అయిన తర్వాత రజనీ కాంత్ గారు తనకు కంగ్రాట్స్ చెప్పి ప్రోత్సహించినప్పటికీ తనలో ఓ విధమైనటువంటి భయం ఉండేదని ఓ సందర్భంలో మీనా తెలియజేశారు.

సీన్ సరిగ్గా చేయలేదని రజనీకాంత్ ను.. కొట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కించేటప్పుడు నటీనటులు ఎక్కువ టేక్ లు తీసుకుంటే డైరెక్టర్లు వారిపై కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నటీనటులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఒక సీన్ ఎక్కువ టేకులు తీయకుండా వీలైనంత తొందరగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్ గా యావత్ దేశం మొత్తం అభిమానించే హీరోగా, నటనలో తనకు ఎవరూ సాటి లేరన్న పేరు సంపాదించుకున్న నటుడు రజనీకాంత్ ఓ టెకులో సరిగా నటించకపోవడంతో ఏకంగా డైరెక్టర్ అతనిపై చేయి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ఆ సంగతులు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం..

తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న రజినీకాంత్ మొట్టమొదటిసారిగా కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన “అపూర్వ రాగంగళ్” సినిమాతో నటునిగా వెండితెర పై అడుగు పెట్టాడు. రజినీకాంత్ బాలచందర్ దర్శకత్వంలో చేసిన సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ శ్రీదేవి జంటగా మొట్టమొదటిసారి బాలచందర్ దర్శకత్వంల ‘మూండ్రు ముడిచ్చు’ అనే సినిమాలో నటించారు. అప్పటికి శ్రీదేవి వయసు 13 సంవత్సరాలు.

బాలచందర్ దర్శకత్వంలో నటించే నటీనటులు ఎంతో జాగ్రత్తగా నటిస్తారు. ఎందుకంటే నటీనటులు ఒక సన్నివేశం కోసం ఎక్కువ టేకులు తీసుకుంటే అతనికి నచ్చదు. అయితే నటీనటులు అద్భుతంగా నటిస్తే మాత్రం వారిని “వెరీగుడ్” అంటూ ప్రశంసించే వారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో శ్రీదేవి రజనీకాంత్ ఇద్దరు పోటీ పెట్టుకొని మరి నటించారు.

ఈ సినిమాలో ఒక సన్నివేశం తీసే సమయంలో రజినీకాంత్ అధిక టేకులు తీసుకొని సరిగా నటించకపోవడంతో బాలచందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రజిని పై చేయి చేసుకున్నట్లు అప్పట్లో ఓ ఇంటర్వ్యూ ద్వారా శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రీదేవి కూడా ఒక సన్నివేశం కోసం ఏకంగా 13 టేకులు తీసుకున్నారని 14వ టేక్ కి దర్శకుడు ఓకే చెప్పినట్లు తెలిపారు. మరొక విషయం ఏమిటంటే ఈ సినిమాలో రజనీకాంత్ కన్నా శ్రీదేవికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం గమనార్హం.

ఖుష్‌బూ అప్పటికే పెళ్ళైన హీరోతో ప్రేమలో పడ్డ విషయం తెలుసా.. అసలు ఏం జరిగిందంటే..

ఖుష్‌బూ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. 1991 సంవత్సరం ఆమె కెరీర్ ను అనూహ్యంగా మలుపుతిప్పిన సంవత్సరంగా పేర్కొనాలి. తమిళంలో ఆమె నటించిన చిత్రం చిన్నతంబి అప్పట్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఈ సినిమా తమిళ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది. ప్రతి జిల్లాలో సినిమా విజయవంతం అయినందుకు వేడుకలు కూడా జరుపుకున్నారు.

అప్పట్లో ఆమెకు దేవాలయాలు కూడా కట్టారు. కొందరు అభిమానులు అయితే ఆమెకు రక్తంతో కూడా ఉత్తరాలు రాశారు. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ వంటి స్టార్ హీరోలతో ఆమె నటించే అవకాశాలు దక్కాయి. ఇలా సినిమాలో ఆమె జీవితం ఎంతో విజయవంతగా సాగినా నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. పెళ్లైన ఓ స్టార్ హీరోతో ఆమె ప్రేమలో పడ్డారు. ఆమె ప్రభుతో సంబంధం గురించి అప్పట్లో గుసగుసలు బాగా వినిపించేవి.

ఆమెకు హీరోయిన్ గా మంచి పేరు రాకముందే ఆమె 1989లో ప్రభుతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 1993 సమయంలో ఒక పాపుల‌ర్ త‌మిళ డైలీలో ఈ వార్త‌ను ఫ్రంట్ పేజీలో ప్రచురించడంతో.. ఆమెను ప్రతీ ఒక్కరు తిట్టుకున్నారు. ఒక సంసార జీవితంలో నిప్పులు పోస్తావా అంటూ ప్రతి ఒక్కరూ తిట్టారు. ఆ క్ర‌మంలో ఆమెను ఏకంగా ఐదు సినిమాల నుంచి తొల‌గించారు. ఆ కారణంగానే ప్రభుతో ఆమె అనుబంధాన్ని తెంచేసుకుంది.

ఆ తర్వాత సినిమాలు చేయడం చాలా రోజుల వరకు మానేసింది. డైరెక్ట‌ర్ సి. సుంద‌ర్‌ను 2000 సంవ‌త్స‌రంలో పెళ్లి చేసుకున్నారు ఖుష్‌బూ. తర్వాత ఎలాంటి గొడవలు లేకుండా.. ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గ‌డుపుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఖుష్‌బూ భర్త సుందర్ దర్శకత్వంలో ప్రభు ఓ సినిమాలో నటించారు.