సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కించేటప్పుడు నటీనటులు ఎక్కువ టేక్ లు తీసుకుంటే డైరెక్టర్లు వారిపై కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నటీనటులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఒక సీన్ ఎక్కువ టేకులు తీయకుండా వీలైనంత తొందరగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్ గా యావత్ దేశం మొత్తం అభిమానించే హీరోగా, నటనలో తనకు ఎవరూ సాటి లేరన్న పేరు సంపాదించుకున్న నటుడు రజనీకాంత్ ఓ టెకులో సరిగా నటించకపోవడంతో ఏకంగా డైరెక్టర్ అతనిపై చేయి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ఆ సంగతులు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం..
తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న రజినీకాంత్ మొట్టమొదటిసారిగా కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన “అపూర్వ రాగంగళ్” సినిమాతో నటునిగా వెండితెర పై అడుగు పెట్టాడు. రజినీకాంత్ బాలచందర్ దర్శకత్వంలో చేసిన సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ శ్రీదేవి జంటగా మొట్టమొదటిసారి బాలచందర్ దర్శకత్వంల ‘మూండ్రు ముడిచ్చు’ అనే సినిమాలో నటించారు. అప్పటికి శ్రీదేవి వయసు 13 సంవత్సరాలు.
బాలచందర్ దర్శకత్వంలో నటించే నటీనటులు ఎంతో జాగ్రత్తగా నటిస్తారు. ఎందుకంటే నటీనటులు ఒక సన్నివేశం కోసం ఎక్కువ టేకులు తీసుకుంటే అతనికి నచ్చదు. అయితే నటీనటులు అద్భుతంగా నటిస్తే మాత్రం వారిని “వెరీగుడ్” అంటూ ప్రశంసించే వారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో శ్రీదేవి రజనీకాంత్ ఇద్దరు పోటీ పెట్టుకొని మరి నటించారు.
ఈ సినిమాలో ఒక సన్నివేశం తీసే సమయంలో రజినీకాంత్ అధిక టేకులు తీసుకొని సరిగా నటించకపోవడంతో బాలచందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రజిని పై చేయి చేసుకున్నట్లు అప్పట్లో ఓ ఇంటర్వ్యూ ద్వారా శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రీదేవి కూడా ఒక సన్నివేశం కోసం ఏకంగా 13 టేకులు తీసుకున్నారని 14వ టేక్ కి దర్శకుడు ఓకే చెప్పినట్లు తెలిపారు. మరొక విషయం ఏమిటంటే ఈ సినిమాలో రజనీకాంత్ కన్నా శ్రీదేవికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం గమనార్హం.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…