Tag Archives: rapists

Rashmi Gautam: వాడు రేపిస్ట్… కాపాడండి అంటూ సంచలన ట్వీట్ చేసిన రష్మీ…. వైరల్ అవుతున్న ట్వీట్!

Rashmi Gautam: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ రష్మి గౌతమ్ ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా పలు సినిమాలలో కూడా నటిస్తూ సినిమాల పరంగా కూడా బిజీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడిపే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

రష్మీ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కొన్నిసార్లు పలు విమర్శలకు కూడా కారణం అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఈమె వాడు రేపిస్ట్ చాలా క్రూరంగా ఉన్నారు కాపాడండి అంటూ ఒక ఆందోళన కరమైన పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. అసలు రష్మీ ఇలాంటి పోస్ట్ చేయడానికి కారణం ఏంటి అని విషయానికి వస్తే…

రష్మీ పెట్ లవర్ అనే విషయం మనకు తెలిసిందే. ఎక్కడైనా మూగ జీవాలను హింసిస్తే వెంటనే రష్మీ రెస్పాండ్ అవుతూ వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి కుక్కపిల్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి వీడియో ఈమె కంటపడింది దీంతో సోషల్ మీడియా వేదికగా రష్మీ స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Rashmi Gautam: లైంగికంగా వేధించేవాడు…


ఆ కుక్క పిల్లను కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంది. ఢిల్లీ పోలీసులు, పెటా సంస్థ, ఎంపీ మేనకా సంజయ్ గాంధీలను సదరు ట్వీట్ లో ట్యాగ్ చేసింది. అతడు చాలా క్రూయల్ గా ఉన్నాడు. అతని వలన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ప్రమాదమే. పిల్లలను లైంగికంగా వేధించేవాడు, రేపిస్ట్ కూడా కావచ్చు. అంటూ తీవ్ర పదజాలంతో ఆవేదన వ్యక్తం చేస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు రష్మికి మద్దతు తెలుపగా.. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు.

Singer Chinmayi: ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది..! సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్..!

Singer Chinmayi: గాయని చిన్మయి గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆమె సింగింగ్ తో పాటు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేస్తుంది. అయితే ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటుంన్నారు. మొన్న హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను ఈమె తప్పుపడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సంగతి తెలిసిందే.

Singer Chinmayi: ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది..! సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్..!

ఇలా ఆమె స్త్రీల సమస్యలపై ఎప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూ.. అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడుతుంది. అలాగే సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు.. వారు ఎదుర్కొంటున్న బాధలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ సమాజంలో ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో చిన్మయితో పలువురు మహిళలు తమకు ఎదురైన సమస్యలను చెప్పగా.. వారికి ఆమె సూచనలు, సలహాలను ఇస్తూ వస్తోంది. దీనిలో కూడా ఎలాంటి మానసిక సంఘర్షణలకు చోటు లేకుండా చిన్మయి సలహాలు ఇస్తుంటారు.

Singer Chinmayi: ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది..! సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్..!

తాజాగా సింగర్ చిన్మయి తన ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో, హీరోయిన్‌ని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించినందుకు బాధితురాలికి పలువురు హీరోయిన్లు , సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు.

అయినా సినిమా అవకాశాలు రాలేదు..

వారిలో మలయాళ నటి పార్వతి తిరువోత్ కూడా ఒకరు. ఈ ఘటన తర్వాత పార్వతి పలు మహిళా సంఘాలతో కలిసి పోరాటం చేసింది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ పోరాటం వల్ల తనకు సినిమా అవకాశాలు పోయాయని.. అంతకముందు తాను ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించానని.. అవి అన్నీ హిట్ అయ్యాయని.. అయినా సినిమా అవకాశాలు రాలేదని ఆమె చెప్పారు. ఆ పోరాటం వల్లే తనకు ఇలా జరిగిదంని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాను నటించిన సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ.. అవకాశాలు రాలేదని.. అలాగే ఫైటింగ్ కూడా చేస్తూ.. హీరోయిన్ కు సపోర్ట్ చేసినందుకు తనను బెదిరించారని చెప్పింది. ప్రస్తుతం తాను రెండు సినిమాల్లోనే నటిస్తున్నానని చెప్పింది పార్వతి. ఈ విషయంపై గాయని చిన్మయి స్పందించింది. ‘‘పార్వతి లాంటి మంచి నటి నిజం చెప్పినందుకు సినిమా అవకాశాలు కోల్పోయింది. లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి పక్షాన మాట్లాడినందుకే అలాంటి నటికి ఈ పరిస్థితి ఏర్పడిందనేది నిజం. చాలామంది మహిళలు మౌనంగా ఉంటారు. ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది’’ అని చిన్మయి ట్వీట్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, నటుడు దిలీప్ కుమార్ అరెస్టయి, బెయిల్‌పై తిరిగి వచ్చారు. జనవరి 18 వరకు అరెస్టు చేయరాదని కేరళ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

కేవలం 20 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పట్టుకున్న శునకం.. ఎక్కడంటే..!

కొన్ని కేసులను ఛేదించే క్రమంలో పోలీసులకు ఏ మాత్రం క్లూ దొరకకుండా ఉంటాయి. అటువంటి సమయంలో వాళ్లు ముందుగా సీసీ కెమెరాల్లో నేరానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు దొరుకుతాయో చూస్తారు. అయినా ఇంకా ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియకపోవచ్చు. అటువంటి సందర్భంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటారు.

అయినా నేరస్తుల వివరాలు దొరక్కపోతే డాగ్ స్క్వాడ్స్ ను కూడా ఉపయోగించుకుంటారు. ఈ డాగ్స్ పోలీసుల పర్యవేక్షణలో పూర్తిగా శిక్షణ పొంది ఉంటాయి. నేర పరిశోధనలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. అయితే ఓ శునకం కేవలం 20 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పట్టుకుంది. అవును మీరు విన్నది నిజమే..

గుజరాత్ లోని వడోదర పోలీస్ డాగ్ స్క్వాడ్​లోని శునకం 30 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులను.. ఆ తర్వాత ఆమెను హత్య చేసిన వారిని ఆ శునకం పట్టుకొని ఆశ్చర్యానికి గురిచేసింది. మొదట ఆ డాగ్ కు నిందితులు పారిపోయిన దిశను చూపించారు. దాన్ని పసిగటట్టిన ఆ డాగ్.. దాదాపు రెండు కిలోమీటర్లు పరుగెత్తి.. అక్కడ ఓ టెంట్ వద్ద ఆగింది.

అక్కడ ఆ డాగ్ మొరగడం మొదలు పెట్టింది. డాగ్ తో పాటు వచ్చిన స్క్వాడ్ అక్కడే ఉన్న రేపిస్టులను పట్టుకున్నారు. ఇలా వారికి నేరస్థులను పట్టుకోవడంలో డాగ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇలా ఆ రేపిస్టులను పట్టుకోవడంలో ఉపయోగపడిన డాగ్ పేరు ‘జావా’ అని పోలీసులు పేర్కొన్నారు.