Singer Chinmayi: ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది..! సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్..!
Singer Chinmayi: గాయని చిన్మయి గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆమె సింగింగ్ తో పాటు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేస్తుంది. అయితే ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటుంన్నారు. మొన్న హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను ఈమె తప్పుపడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా ఆమె స్త్రీల సమస్యలపై ఎప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూ.. అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడుతుంది. అలాగే సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు.. వారు ఎదుర్కొంటున్న బాధలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ సమాజంలో ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో చిన్మయితో పలువురు మహిళలు తమకు ఎదురైన సమస్యలను చెప్పగా.. వారికి ఆమె సూచనలు, సలహాలను ఇస్తూ వస్తోంది. దీనిలో కూడా ఎలాంటి మానసిక సంఘర్షణలకు చోటు లేకుండా చిన్మయి సలహాలు ఇస్తుంటారు.
తాజాగా సింగర్ చిన్మయి తన ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో, హీరోయిన్ని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించినందుకు బాధితురాలికి పలువురు హీరోయిన్లు , సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు.
వారిలో మలయాళ నటి పార్వతి తిరువోత్ కూడా ఒకరు. ఈ ఘటన తర్వాత పార్వతి పలు మహిళా సంఘాలతో కలిసి పోరాటం చేసింది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ పోరాటం వల్ల తనకు సినిమా అవకాశాలు పోయాయని.. అంతకముందు తాను ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించానని.. అవి అన్నీ హిట్ అయ్యాయని.. అయినా సినిమా అవకాశాలు రాలేదని ఆమె చెప్పారు. ఆ పోరాటం వల్లే తనకు ఇలా జరిగిదంని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాను నటించిన సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ.. అవకాశాలు రాలేదని.. అలాగే ఫైటింగ్ కూడా చేస్తూ.. హీరోయిన్ కు సపోర్ట్ చేసినందుకు తనను బెదిరించారని చెప్పింది. ప్రస్తుతం తాను రెండు సినిమాల్లోనే నటిస్తున్నానని చెప్పింది పార్వతి. ఈ విషయంపై గాయని చిన్మయి స్పందించింది. ‘‘పార్వతి లాంటి మంచి నటి నిజం చెప్పినందుకు సినిమా అవకాశాలు కోల్పోయింది. లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి పక్షాన మాట్లాడినందుకే అలాంటి నటికి ఈ పరిస్థితి ఏర్పడిందనేది నిజం. చాలామంది మహిళలు మౌనంగా ఉంటారు. ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది’’ అని చిన్మయి ట్వీట్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, నటుడు దిలీప్ కుమార్ అరెస్టయి, బెయిల్పై తిరిగి వచ్చారు. జనవరి 18 వరకు అరెస్టు చేయరాదని కేరళ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…