Tag Archives: republic pre relese event

జగన్ పై దాడి.. నోరు జారిన డిప్యూటీ సీఎం..

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే లేపాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మరాయి. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించడం.. దానికి ప్రతి కౌంటర్ గా ఏపీ మంత్రలు సమాధానం ఇవ్వడం. పోసాని పవన్ పై వ్యక్తిగతంగా కూడా దూషించడం వంటివి చోటుచేసుకున్నాయి.

ఇందులో భాగంగా.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నోరు జారారు. పవన్ పై దూషణ పర్వంలో భాగంగా జగన్ పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ పై ప్రజలే దాడి చేస్తారనడానికి బదులుగా ‘జగన్ పై ప్రజలే దాడి చేస్తారంటూ’ వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారు. ఇక సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్ మామూలుగా రావడంలేదు.

మీమ్స్, సెటైర్స్ తో నారాయణ స్వామిని నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. ఇలా నోరు జారిన వాళ్లు అంతకముందు చాలానే ఉన్నా..ఇది ప్రస్తుతం ఎక్కవుగా వైరల్ అవుతోంది. ఎందుకంటే.. పవన్ వ్యాఖ్యలపైనే ఎక్కువగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీంతో ఇలా అతడు పొరపాటున అన్నా.. దానిని సోషల్ మీడియాలో మాత్రం వదలడం లేదు.

ఇకపోతే.. పోసాని ప్రెస్ మీట్లలో పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా పోసానిపై పవన్ అభిమానులు దాడి చేసే వరకు వెళ్లారు. మొదట అతడిని ట్రోల్ చేసిన అభిమానులు.. వ్యక్తిగతంగా పోసాని మాట్లాడటంతో.. దాడికి యత్నించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ నుంచి తన ఫోన్‌కు వేలాది మెసేజీలు అందుతున్నాయని.. బూతులు తిడుతున్నారని అంటూ తాను సైతం బూతు పురాణాన్ని ఓపెన్ చేసి.. ఆవేదన వ్యక్తం చేశాడు పోసాని.

నాగబాబు పవన్ వ్యతిరేకస్తులకు మీమ్స్, ఆడియో, వీడియోల రూపంలో సమాధానం..!

సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. మంత్రి పేర్ని నాని గురించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ మాటలు రాజకీయంగా పెను సంచలనమే స్పష్టించాయి. ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపీ మంత్రులు.. అదే విధంగా పవన్ వర్సస్ పోసాని అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా సినీ నటుడు పోసాని తెర మీదకు తొలి రోజు పవన్ పైన విమర్శలు చేసారు.

జగన్ పాలనను ప్రశంసించారు. ఇక రెండ సారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు వ్యక్తిగత దూషణలకు దారితీశాయి. అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఇక వెంటనే నాగబాబు.. అతడికి వార్నింగ్ ఇచ్చాడు. ఆస్క్‌ మీ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమాను ల ముందుకు వచ్చారు. అనేక ప్రశ్నలకు మీమ్స్ తోనే సెటైరికల్ గా సమాధానాలు ఇచ్చారు. మళ్లీ పాలిటిక్స్‌లో వస్తారా అంకుల్‌ అనే ప్రశ్నకు.. నాకు ఇంట్రెస్ట్‌ పోయింది అనే మీమ్‌తో ఆన్సర్‌ ఇచ్చారు. అందులో భాగంగా.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గురించి స్పందించాలని కోరగా ఆయన ఒక పవన్ పైన పోసాని మాట్లాడిన ఒక వీడియో పోస్టు చేసారు.

ఆ వీడియోలో ఏముందంటే.. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో పవన్ సినిమాలోకి వస్తానంటే.. తాను అతడికి బ్లాంక్ చెక్ ఇస్తానని.. అందులో ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఇండియాలోని టాప్‌ హీరోల్లో అతనొకరు…అని అందులో పోసాని చెబుతారు. ఇక ఏపీలో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారంలో ఏపీ మూవీ టికెట్స్‌ గురించి మీ అభిప్రాయం అడగ్గా విక్రమార్కుడు చిత్రంలో రవితేజ, బ్రహ్మానందం మోసాలు చేసి డబ్బులు పంచుకునే సన్నివేశాన్ని పోస్ట్‌ చేశారు.

అందులో వారిద్దరు డబ్బులు పంచుకుంటుండగా.. ఎప్పుడైనా సరిగ్గా పంచావరా.. అటూ బ్రహ్మానందం వాపోయే సీన్‌ చూపించారు. మోసం చేసినవాడు బాగుపడడురా.. అని బ్రహ్మానందం శపించగా… ఆ మనం చేసేది గుళ్లో పూజ మరి అని రవితేజ లైట్‌ తీసుకుంటాడు. ఇక, పోసాని గురించి ఒక్క మాట అనే దానికి మాధానంగా..సమరసింహారెడ్డి లో బాలకృష్ణ ఫొటో పోస్ట్‌ చేశారు. ఆ సన్నివేశంలో డైలాగ్‌… కుక్కపిల్ల మొరిగిందనుకో అనేది ఆ ఫొటో సారాంశంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు నాగబాబు మీమ్స్, ఆడియో, వీడియోలతో సమాధానం చెబుతారు.

అతడిని ఆసుపత్రిలో చూపించండి.. లేదంటే సమాజానికి ప్రమాదం: నిహారిక

సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై సినీ వర్గాలతో పాటు ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. సినీ పరిశ్రమలో అయితే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. రెండు రోజుల పాటు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ వ్యక్తిగంతగా కూడా దూషించాడు.

దీనికి పవన్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. దారుణమైన బూతులతో పవన్ ని కించపరిచిన పోసానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జనసేన నాయకురాలు నిహారిక కూడా మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోసాని కృష్ణమురళి మానసిక రోగిగా మారాడని.. అతడిన వెంటనే ఆసుపత్రిలో చూపించండి.. లేదంటే సమాజానికి ప్రమాదం అంటూ అతని పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడికి తగినట్లుగా మెంటల్ కృష్ణ సినిమా తీశాడని.. ప్రస్తుతం అతడికి ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ ఆడవాళ్లపై ఎలాంటి బ్యాడ్ కామెంట్లు చేయలేదని.. అయితే జగన్ పై వ్యాఖ్యలు చేశారనే పోసాని రియాక్ట్ అవుతున్నారని పవన్ పై అనవసరమైన ఆరోపణలు చెయ్యవద్దని హెచ్చరించింది. పోసానిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. ఈ సందర్భంగా జనసేన నాయకులు నిహారిక డిమాండ్ చేసింది. అతడిని వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా నిహారిక కోరింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పవన్ కళ్యాణ్ ను బండ బూతులు తిడుతూ.. మరోసారి రెచ్చిపోయిన పోసాని..!

రిపబ్లిక్ మూవీ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పోసాని మురళి కృష్ణ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి నీకు ఏ మాత్రం పోలిక లేదంటూ… పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు.

అదేవిధంగా పంజాబీ హీరోయిన్ విషయంలో తనను మోసం చేసిన వాళ్ళని గుర్తించి తనకి న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పోసానిపై జనసేన అభిమానులు పవన్ అభిమానులు ప్రతి నిమిషం నిమిషానికి ఫోన్ చేస్తూ అతనిని తన కుటుంబాన్ని బండబూతులు తిడుతున్నారు అంటూ తాజాగా మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ వందలాది బూతు మెసేజ్ లు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆరోపించారు.

పవన్ జగన్ గురించి విమర్శించారు..నేను జగన్ అభిమానిని కావడంతో అతని మాటలను ఖండించాను. పవన్ గతంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి విమర్శించడంతో ఆయనకి కెసిఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక సైకో… ఎవరో ఫంక్షన్ పెట్టుకుంటే అక్కడికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎందుకు వస్తున్నారని ఈ సందర్భంగా పోసాని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అనే సైకో వెధవకి చెబుతున్నా.. నీకు ఒక ఆడపిల్ల ఉంది. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుంది అనుభవిస్తావు రక్త కన్నీరు కారుస్తారు నేను బతికి ఉంటా.. దరిద్రపు నా కొడకా.. నా భార్యను అనరాని మాటలు అన్నావు అందుకు నిన్ను ఏమైనా అనొచ్చు అంటూ పోసాని మరొకసారి ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నాతో వకీల్ సాబ్ సినిమా ఎందుకు తీశావయ్యా : పవన్ కళ్యాణ్

దిల్ రాజుపై పవన్ కళ్యాణ్ ఓ రేంజిలో విరుచుకుపడ్డాడు. సీఎం జగన్ రెడ్డే.. నువ్వు కూడా రెడ్డే కదా.. వెళ్లి అడుగు అంటూ పవన్ ఫైర్ అయ్యారు. దిల్ రాజు అంటే సినిమా ప్రముఖులకు మాత్రమే తెలుస్తుంది..కానీ నేను కూడా రెడ్డి అని చెప్పు.. సీఎం జగన్ నీ పట్ల సానుకూలత చూపిస్తాడేమో.. వెళ్లి అడుగు అంటూ పవన్ ఆక్రోశంతో మాట్లాడారు.

అస్సలు తనతో వకీల్ సాబ్ ఎందుకు తీశావయ్యా.. నా సినిమా తియ్యకపోతే ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని వందల సినిమాలు రిలీజ్ అయ్యేయి. నా సినిమా తీసి తప్పు చేశావ్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పవర్ స్టార్. రిపబ్లిక్ మూవీ ఫ్రీ రిలీజ్ వేదికగా పవన్ ఆవేశంతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పరిశ్రమ పెద్దలు, వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నిర్మాతలకు హాని చేకూరే విధంగా ఉన్నాయని.. అటువంటి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు.

ఈ క్రమంలో అతడు ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై వివాదాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మీరు రెడ్డే కదా.. మీరు వెళ్లి మాట్లాడండి.. అప్పుడు సీఎం వింటాడేమో అంటూ మాట్లాడారు. అప్పుడైన సినీ వర్గాలకు మేలు చేకూరుతుందన్నారు. దిల్ రాజు అంటే తెలియదేమో నేను రెడ్డి అని చెప్పు.. సీఎం జగన్ నీ పట్ల సానుకూలత చూపిస్తాడేమో అన్నారు. తనతో వకీల్ సాబ్ సినిమా తీయకపోతే.. ఆంధ్రాలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యేవని.. తనతో ఎందుకు వకీల్ సాబ్ తీశావంటూ ఆగ్రహంతో మాట్లాడారు.

ఇదిలా ఉండగా.. సాయితేజ్, దేవ కట్టా కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం వచ్చే నెల అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర ఈ వ్యాఖ్యలు చేశారు.