రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే లేపాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మరాయి. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించడం.. దానికి ప్రతి కౌంటర్ గా ఏపీ మంత్రలు సమాధానం ఇవ్వడం. పోసాని పవన్ పై వ్యక్తిగతంగా కూడా దూషించడం వంటివి చోటుచేసుకున్నాయి.
ఇందులో భాగంగా.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నోరు జారారు. పవన్ పై దూషణ పర్వంలో భాగంగా జగన్ పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ పై ప్రజలే దాడి చేస్తారనడానికి బదులుగా ‘జగన్ పై ప్రజలే దాడి చేస్తారంటూ’ వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారు. ఇక సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్ మామూలుగా రావడంలేదు.
మీమ్స్, సెటైర్స్ తో నారాయణ స్వామిని నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. ఇలా నోరు జారిన వాళ్లు అంతకముందు చాలానే ఉన్నా..ఇది ప్రస్తుతం ఎక్కవుగా వైరల్ అవుతోంది. ఎందుకంటే.. పవన్ వ్యాఖ్యలపైనే ఎక్కువగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీంతో ఇలా అతడు పొరపాటున అన్నా.. దానిని సోషల్ మీడియాలో మాత్రం వదలడం లేదు.
ఇకపోతే.. పోసాని ప్రెస్ మీట్లలో పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా పోసానిపై పవన్ అభిమానులు దాడి చేసే వరకు వెళ్లారు. మొదట అతడిని ట్రోల్ చేసిన అభిమానులు.. వ్యక్తిగతంగా పోసాని మాట్లాడటంతో.. దాడికి యత్నించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ నుంచి తన ఫోన్కు వేలాది మెసేజీలు అందుతున్నాయని.. బూతులు తిడుతున్నారని అంటూ తాను సైతం బూతు పురాణాన్ని ఓపెన్ చేసి.. ఆవేదన వ్యక్తం చేశాడు పోసాని.
ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న ఈ రోజుల్లో, ఆహారంలో చిన్న మార్పులే పెద్ద ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన…
ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం గణనీయంగా పెరిగింది. సాయంత్రం అయ్యాక సమోసా, పానీపూరీ, బర్గర్,…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ఉద్యోగ సమయాలు కూడా పెద్దగా మారిపోయాయి. ఐటీ, హెల్త్కేర్, సర్వీస్ రంగాల్లో పని చేసే చాలా…
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…