రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే లేపాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మరాయి. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించడం.. దానికి ప్రతి కౌంటర్ గా ఏపీ మంత్రలు సమాధానం ఇవ్వడం. పోసాని పవన్ పై వ్యక్తిగతంగా కూడా దూషించడం వంటివి చోటుచేసుకున్నాయి.
ఇందులో భాగంగా.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నోరు జారారు. పవన్ పై దూషణ పర్వంలో భాగంగా జగన్ పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ పై ప్రజలే దాడి చేస్తారనడానికి బదులుగా ‘జగన్ పై ప్రజలే దాడి చేస్తారంటూ’ వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారు. ఇక సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్ మామూలుగా రావడంలేదు.
మీమ్స్, సెటైర్స్ తో నారాయణ స్వామిని నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. ఇలా నోరు జారిన వాళ్లు అంతకముందు చాలానే ఉన్నా..ఇది ప్రస్తుతం ఎక్కవుగా వైరల్ అవుతోంది. ఎందుకంటే.. పవన్ వ్యాఖ్యలపైనే ఎక్కువగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీంతో ఇలా అతడు పొరపాటున అన్నా.. దానిని సోషల్ మీడియాలో మాత్రం వదలడం లేదు.
ఇకపోతే.. పోసాని ప్రెస్ మీట్లలో పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా పోసానిపై పవన్ అభిమానులు దాడి చేసే వరకు వెళ్లారు. మొదట అతడిని ట్రోల్ చేసిన అభిమానులు.. వ్యక్తిగతంగా పోసాని మాట్లాడటంతో.. దాడికి యత్నించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ నుంచి తన ఫోన్కు వేలాది మెసేజీలు అందుతున్నాయని.. బూతులు తిడుతున్నారని అంటూ తాను సైతం బూతు పురాణాన్ని ఓపెన్ చేసి.. ఆవేదన వ్యక్తం చేశాడు పోసాని.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…