Movie News

జగన్ పై దాడి.. నోరు జారిన డిప్యూటీ సీఎం..

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే లేపాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మరాయి. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించడం.. దానికి ప్రతి కౌంటర్ గా ఏపీ మంత్రలు సమాధానం ఇవ్వడం. పోసాని పవన్ పై వ్యక్తిగతంగా కూడా దూషించడం వంటివి చోటుచేసుకున్నాయి.

ఇందులో భాగంగా.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నోరు జారారు. పవన్ పై దూషణ పర్వంలో భాగంగా జగన్ పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ పై ప్రజలే దాడి చేస్తారనడానికి బదులుగా ‘జగన్ పై ప్రజలే దాడి చేస్తారంటూ’ వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారు. ఇక సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్ మామూలుగా రావడంలేదు.

మీమ్స్, సెటైర్స్ తో నారాయణ స్వామిని నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. ఇలా నోరు జారిన వాళ్లు అంతకముందు చాలానే ఉన్నా..ఇది ప్రస్తుతం ఎక్కవుగా వైరల్ అవుతోంది. ఎందుకంటే.. పవన్ వ్యాఖ్యలపైనే ఎక్కువగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీంతో ఇలా అతడు పొరపాటున అన్నా.. దానిని సోషల్ మీడియాలో మాత్రం వదలడం లేదు.

ఇకపోతే.. పోసాని ప్రెస్ మీట్లలో పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా పోసానిపై పవన్ అభిమానులు దాడి చేసే వరకు వెళ్లారు. మొదట అతడిని ట్రోల్ చేసిన అభిమానులు.. వ్యక్తిగతంగా పోసాని మాట్లాడటంతో.. దాడికి యత్నించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ నుంచి తన ఫోన్‌కు వేలాది మెసేజీలు అందుతున్నాయని.. బూతులు తిడుతున్నారని అంటూ తాను సైతం బూతు పురాణాన్ని ఓపెన్ చేసి.. ఆవేదన వ్యక్తం చేశాడు పోసాని.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago