దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు తమిళ కన్నడ భాషలలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో ఎన్నో పాత్రల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ తన నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.
తాజాగా ప్రకాష్ రాజ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను నటించిన సినిమాలలో సన్నివేశాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ పలు ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే అంతఃపురం సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడితో గొడవ పడిన విషయాన్ని కూడా వెల్లడించారు.
ఈ సినిమా షూటింగ్ తీసే సమయంలో నాకు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే అయినా ఈ సినిమాలో ముసలోడి పాత్రలో నటించాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఢిల్లీ రాజేశ్వరకి బొట్టు గాజులు తీసే సమయంలో నేను ఏడ్వాలని ఉంది. ఆ సీన్ కోసం డైరెక్టర్ కృష్ణ వంశీ ఏకంగా 14 టేకులు తీశారు. వన్ మోర్ టెక్ వన్ మోర్ టెక్ అంటుండగానే కోపం వచ్చి నీకు ఏం కావాలి రా అన్నాను.
దాంతో కృష్ణవంశీ లైట్స్ ఆఫ్ అన్నారు. కృష్ణవంశీ అలా అనేసరికి నన్ను ఈ సినిమా నుంచి తీసేస్తాడు అని భయపడ్డాను. మరొక విషయం ఏమిటంటే అప్పటికే నేషనల్ అవార్డు పొందిన నేను వన్ మోర్ టేక్ అని అడిగేసరికి నేను కోపం తెచ్చుకున్నానని ఆయన భావించారు. ఇలా లైట్స్ ఆఫ్ అన్న తర్వాత వెళ్లి ఏం కావాలి అని అడగగా కూతురు బొట్టు గాజులు వెళ్లిపోతున్న సమయంలో చిన్నపిల్లాడిలా అసహనం వ్యక్తం చేసే ఏడుపు కావాలి అన్నారు. అలా ఏడిస్తే షాట్ ఓకే అవుతుందని చెప్పగా ఆ తర్వాత టేక్ లో షాట్ ఓకే అయిందని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ అంతఃపురం సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…