దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు తమిళ కన్నడ భాషలలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో ఎన్నో పాత్రల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ తన నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.
తాజాగా ప్రకాష్ రాజ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను నటించిన సినిమాలలో సన్నివేశాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ పలు ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే అంతఃపురం సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడితో గొడవ పడిన విషయాన్ని కూడా వెల్లడించారు.
ఈ సినిమా షూటింగ్ తీసే సమయంలో నాకు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే అయినా ఈ సినిమాలో ముసలోడి పాత్రలో నటించాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఢిల్లీ రాజేశ్వరకి బొట్టు గాజులు తీసే సమయంలో నేను ఏడ్వాలని ఉంది. ఆ సీన్ కోసం డైరెక్టర్ కృష్ణ వంశీ ఏకంగా 14 టేకులు తీశారు. వన్ మోర్ టెక్ వన్ మోర్ టెక్ అంటుండగానే కోపం వచ్చి నీకు ఏం కావాలి రా అన్నాను.
దాంతో కృష్ణవంశీ లైట్స్ ఆఫ్ అన్నారు. కృష్ణవంశీ అలా అనేసరికి నన్ను ఈ సినిమా నుంచి తీసేస్తాడు అని భయపడ్డాను. మరొక విషయం ఏమిటంటే అప్పటికే నేషనల్ అవార్డు పొందిన నేను వన్ మోర్ టేక్ అని అడిగేసరికి నేను కోపం తెచ్చుకున్నానని ఆయన భావించారు. ఇలా లైట్స్ ఆఫ్ అన్న తర్వాత వెళ్లి ఏం కావాలి అని అడగగా కూతురు బొట్టు గాజులు వెళ్లిపోతున్న సమయంలో చిన్నపిల్లాడిలా అసహనం వ్యక్తం చేసే ఏడుపు కావాలి అన్నారు. అలా ఏడిస్తే షాట్ ఓకే అవుతుందని చెప్పగా ఆ తర్వాత టేక్ లో షాట్ ఓకే అయిందని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ అంతఃపురం సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను వెల్లడించారు.
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…