దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు తమిళ కన్నడ భాషలలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో ఎన్నో పాత్రల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ తన నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.
తాజాగా ప్రకాష్ రాజ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను నటించిన సినిమాలలో సన్నివేశాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ పలు ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే అంతఃపురం సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడితో గొడవ పడిన విషయాన్ని కూడా వెల్లడించారు.
ఈ సినిమా షూటింగ్ తీసే సమయంలో నాకు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే అయినా ఈ సినిమాలో ముసలోడి పాత్రలో నటించాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఢిల్లీ రాజేశ్వరకి బొట్టు గాజులు తీసే సమయంలో నేను ఏడ్వాలని ఉంది. ఆ సీన్ కోసం డైరెక్టర్ కృష్ణ వంశీ ఏకంగా 14 టేకులు తీశారు. వన్ మోర్ టెక్ వన్ మోర్ టెక్ అంటుండగానే కోపం వచ్చి నీకు ఏం కావాలి రా అన్నాను.
దాంతో కృష్ణవంశీ లైట్స్ ఆఫ్ అన్నారు. కృష్ణవంశీ అలా అనేసరికి నన్ను ఈ సినిమా నుంచి తీసేస్తాడు అని భయపడ్డాను. మరొక విషయం ఏమిటంటే అప్పటికే నేషనల్ అవార్డు పొందిన నేను వన్ మోర్ టేక్ అని అడిగేసరికి నేను కోపం తెచ్చుకున్నానని ఆయన భావించారు. ఇలా లైట్స్ ఆఫ్ అన్న తర్వాత వెళ్లి ఏం కావాలి అని అడగగా కూతురు బొట్టు గాజులు వెళ్లిపోతున్న సమయంలో చిన్నపిల్లాడిలా అసహనం వ్యక్తం చేసే ఏడుపు కావాలి అన్నారు. అలా ఏడిస్తే షాట్ ఓకే అవుతుందని చెప్పగా ఆ తర్వాత టేక్ లో షాట్ ఓకే అయిందని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ అంతఃపురం సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…