కరోనా మొదటిదశలో భాగంగా విశాఖపట్నంకి చెందిన డాక్టర్ సుధాకర్ అప్పట్లో ఎంత హంగామా క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఆస్పత్రిలో ఒక మాస్క్, గ్లౌజులు ఇచ్చి వాటిని పదేపదే వాడుకో అని చెబుతున్నారు అంటూ పెద్ద ఎత్తున మీడియా ఎదుట ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యారు.
ఇలా డాక్టర్ సుధాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అప్పటి ప్రభుత్వం నిజానిజాలు గురించి ఎంక్వయిరీ చేసి ఆయనను విధుల నుంచి తొలగించడం జరిగింది.ఇలా విధుల నుంచి తొలగించిన తర్వాత ఆయనపై కేసు నమోదు చేయడంతో కొన్ని రోజుల పాటు మానసికంగా ఎంతో క్షోభ అనుభవించి డాక్టర్ సుధాకర్ ఆస్పత్రిలో చేర్పించారు.ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించగా ఈ కేసు విచారణలో భాగంగా కేసును సీబీఐకు అప్పగించాలని తెలియజేసింది.
ఈ క్రమంలోనే సుధాకర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించి గుండెపోటుతో మరణించారు. సుధాకర్ కేసులో సిబిఐ విచారణ చేపట్టగా సుధాకర్ వ్యవహారంలో ఐదుగురు అధికారుల పాత్ర కీలకంగా ఉందని వెల్లడించారు. ఈ క్రమంలోనే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు అధికారులు వారి దర్యాప్తులో పేర్కొన్నారు.
ఇలా ఐదుగురు అధికారులు పేర్లను నమోదు చేసిన సీబీఐ వారిని ప్రాసిక్యూషన్ జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటామని సి.బి.ఐ హైకోర్టుకు తెలియజేయడంతో ఆ అయిదుగురు అధికారులను ప్రాసిక్యూషన్ చేరడానికి హైకోర్టు అనుమతి తెలిపింది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…