ఏపీలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకరిపై ఒకరు వాదన ప్రతి వాదనలతో హీటెక్కిపోతోంది. పోసాని కృష్ణమురళి రెండు సార్లు విలేకరుల సమావేశం నిర్వహించి ఓ రేంజ్ లో పవన్ పై విరుచుకుపడ్డాడు. దీనిపై అతడి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్న పోసాని.. అందులో ఓ నటి గురించి ప్రస్తావన తెచ్చాడు. పంజాబీ అమ్మాయి, నటి అంటూ ఓ అంశాన్ని లేవనెత్తారు.
ఇది కూడా ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. ప్రముఖ సినీ పరిశ్రమలోని పేరున్న ఓ వ్యక్తి ఆ పంజాబీ అమ్మాయిని గర్భవతిని చేసి.. ఆపై అబర్షర్ చేయించాడని అతడు విమర్శలు చేశాడు. దమ్ముంటే అమ్మాయికి న్యాయం చేయాలని పవన్ కు సవాల్ విసిరాడు. ఆ అమ్మాయి పూనమ్ కౌర్ అంటూ.. ఆ అమ్మాయినే పరోక్షంగా అన్నాడనే వార్తలు వినిపించాయి.
దీంతో అప్పటి నుంచి పూనమ్ కౌర్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ నటి కూడా ఆ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. సీని పరిశ్రమలో తనకు గురు అంటే ఒక్కరే అని.. అది కూడా దాసరి గారు అంటూ అన్నారు. ఈ రోజు దాసరి నారాయణ రావు ఉన్నట్టు.. ఆ దేవుడు ఓ సందేశాన్ని పంపించినట్టు అనిపించింది అంటూ .. మిస్ యూ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను కూడా షేర్ చేశారు.
అందులో ఏముందంటే.. ‘తాను రేప్ కు గురయ్యాను.. కానీ సమాజం తనను ఒక విధంగా చూస్తుంది.. శీలం పోయింది.. సిగ్గు పోయిందని అంటున్నారు.. కానీ తప్పు చేసింది వాడు.. వాడు సిగ్గుపడాలి.. నేనెందుకు సిగ్గుపడాలి అంటూ ఆ మహిళ ఆ వీడియోలో చెబుతుంది. ఈ మాటలు ప్రతీ ఒక్కరినీ కదిలించాయి. దీనిని చూసిన అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడో వచ్చిన ఈ వీడియో పూనమ్ షేర్ చేశారు. ఆమె ఈ వీడియో షేర్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…