Kondaa Movie: సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయోపిక్ చిత్రాలు చేస్తూ పలు వివాదాలకు కారణం అవుతున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకుల బయోపిక్ చిత్రాలు రాగ తాజాగా కొండా మురళి సురేఖ దంపతులు బయోపిక్ చిత్రం ద్వారా కొండా అనే సినిమాతో ఈ నెల 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
విడుదల తేదీ దగ్గర పడటంతో కొండ సురేఖ దంపతులు సైతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను శనివారం హనుమకొండలో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రావాల్సి ఉండగా కొందరు రాజకీయాలు చేస్తూ అతనిని రాకుండా అడ్డుకున్నారు అంటూ ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై కొండా సినిమా నిర్మాత,కొండా సురేఖ మురళి దంపతుల కుమార్తె సుస్మిత పటేల్ మాట్లాడుతూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నీ బతుకు మారదా? నీ బతుకంతా భయంతోనే సాగిపోతోంది. విరాట పర్వం సినిమా వేడుకల్లో భాగంగా సాయిపల్లవికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించారు.
ఎన్నికలు రానివ్వు నీ సంగతి చూస్తా..
నా సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా వస్తున్న రేవంత్ రెడ్డిని రాకుండా ఆపారు. ఇలా ఎంత కాలం భయపడతావు ఎన్నికలు రానివ్వు నీ సంగతిచెబుతా అంటూ వేదికపై సుస్మిత పటేల్ తీవ్రస్థాయిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లితండ్రుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన కొండా చిత్రానికి సుస్మితా పటేల్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.