మంత్రి కేటిఅర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. అందులో టిఆర్ఎస్, బిజెపి శారీరాలే వేరని, ఆ రెండు పార్టీల ఆత్మ ఒక్కటేనని అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడు కుస్తీ పడతారు. ఆ తరువాత దోస్తీ చేస్తారు ఆని ఆరోపించారు.
మరోవైపు విభజన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధిక దీక్షకు సిద్దమా అంటూ మంత్రి కేటిఅర్ కు సవాల్ విసిరారు. ఈ అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడి పై ఒత్తిడి పెంచుదామని అన్నారు. తన సవాల్ కు సమాధానం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.