తెలుగు బుల్లితెర స్టార్ మా లో ఇటీవల ప్రసారమైన బిగ్ బాస్ అనే రియాలిటీ షో లో టిక్ టాక్ ఫేమ్ ఆషు రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే.. ఈమె బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైందని చెప్పవచ్చు.ఇదిలా ఉంటె ఈ భామకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చచ్చేంత ఇష్టం. ఓసారి పవన్ కళ్యాణ్ పేరును టాటూగా వేయించుకుని.. అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇప్పుడు తాజాగా ఆమెకు పవన్ కళ్యాణ్తో కలిసి మాట్లాడే అవకాశం దక్కడంతో.. ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.”నేను నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను. ఆయన నాతో పాటు నేను వేసుకున్న టాటూను కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇద్దరం రెండు గంటల పాటు మాట్లాడుకున్నాం.
ఇక తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన తన స్వదస్తూరితో రాసిన లెటర్ ఇచ్చి పంపించారు” అని పేర్కొంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో నెటిజన్ ఆషూను ఓ ప్రశ్న అడిగి షాక్ ఇచ్చాడు.. ”పవన్ కళ్యాణ్ నాలుగవ భార్యగా ఉంటారా, అని ప్రశ్నించగా.. అందుకు ఆషూ వెంటనే ఎస్ అని జవాబిచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీంతో అభిమానులు అషూ.. నువ్ చాలా లక్కీ.. పవన్ పక్కన చాలా అందంగా ఉన్నావ్.. పవన్ కళ్యాణ్ రెండు గంటలు అపాయింట్మెంట్ అంటే మామూలు విషయం కాదు.. అంత టైం అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారు.. అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే దీనిపై వెటకారాలు, ట్రోల్స్ కూడా మొదలయ్యాయి…ఇక పవన్ కళ్యాణ్ ని ఎప్పుడూ టార్గెట్ చేసే ఒక మీడియా వర్గం మాత్రం ఈ విషయాన్ని హైలైట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది..దీంతో ఆ వార్తలు కాస్త ఆషు రెడ్డికి కోపం తెప్పించాయి..కనీస నిజానిజాలు తెలుసుకోకుండా రాయడం ఎంతవరకు కరెక్ట్,పవన్ కళ్యాణ్ ను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పనా అంటూ సోషల్ మీడియాపై ఫైర్ అయ్యింది..అంతేకాదు అనవసరంగా పిచ్చి పిచ్చి రాతలు రాస్తే బాగుండదంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది ఈ బిగ్ బాస్ బ్యూటీ…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…