తెలుగు బుల్లితెర స్టార్ మా లో ఇటీవల ప్రసారమైన బిగ్ బాస్ అనే రియాలిటీ షో లో టిక్ టాక్ ఫేమ్ ఆషు రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే.. ఈమె బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైందని చెప్పవచ్చు.ఇదిలా ఉంటె ఈ భామకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చచ్చేంత ఇష్టం. ఓసారి పవన్ కళ్యాణ్ పేరును టాటూగా వేయించుకుని.. అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇప్పుడు తాజాగా ఆమెకు పవన్ కళ్యాణ్తో కలిసి మాట్లాడే అవకాశం దక్కడంతో.. ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.”నేను నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను. ఆయన నాతో పాటు నేను వేసుకున్న టాటూను కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇద్దరం రెండు గంటల పాటు మాట్లాడుకున్నాం.
ఇక తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన తన స్వదస్తూరితో రాసిన లెటర్ ఇచ్చి పంపించారు” అని పేర్కొంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో నెటిజన్ ఆషూను ఓ ప్రశ్న అడిగి షాక్ ఇచ్చాడు.. ”పవన్ కళ్యాణ్ నాలుగవ భార్యగా ఉంటారా, అని ప్రశ్నించగా.. అందుకు ఆషూ వెంటనే ఎస్ అని జవాబిచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీంతో అభిమానులు అషూ.. నువ్ చాలా లక్కీ.. పవన్ పక్కన చాలా అందంగా ఉన్నావ్.. పవన్ కళ్యాణ్ రెండు గంటలు అపాయింట్మెంట్ అంటే మామూలు విషయం కాదు.. అంత టైం అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారు.. అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే దీనిపై వెటకారాలు, ట్రోల్స్ కూడా మొదలయ్యాయి…ఇక పవన్ కళ్యాణ్ ని ఎప్పుడూ టార్గెట్ చేసే ఒక మీడియా వర్గం మాత్రం ఈ విషయాన్ని హైలైట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది..దీంతో ఆ వార్తలు కాస్త ఆషు రెడ్డికి కోపం తెప్పించాయి..కనీస నిజానిజాలు తెలుసుకోకుండా రాయడం ఎంతవరకు కరెక్ట్,పవన్ కళ్యాణ్ ను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పనా అంటూ సోషల్ మీడియాపై ఫైర్ అయ్యింది..అంతేకాదు అనవసరంగా పిచ్చి పిచ్చి రాతలు రాస్తే బాగుండదంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది ఈ బిగ్ బాస్ బ్యూటీ…!!
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…