Tag Archives: rrr team message

Venu Swamy: ఆర్ఆర్ఆర్ టీమ్ కి వీణతో స్పెషల్ విషెస్ చెప్పిన వేణు స్వామి భార్య… వీడియో వైరల్!

Venu Swamy: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నటువంటి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి మనందరికీ తెలిసిందే అయితే ఈయన ప్రముఖ వీణ వాయిద్య కారిని శ్రీ వాణి నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు.

శ్రీ వాణి వీణ వాయించడంలో ఎంతో నైపుణ్యం కలరు. ఇలా వీణ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె తన పేరు పక్కన వీణ చేర్చుకొని వీణ శ్రీవాణిగా మారిపోయారు.అయితే ఈమె వేణు స్వామి భార్య అనే విషయం మొన్నటి వరకు చాలామందికి తెలియదు. అయితే గత కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయం తెలియచేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.

ఇక నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో శ్రీవాణి వీణ వాయిస్తూ నాటు నాటు పాట ట్రిబ్యూట్ చేస్తూ చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని శ్రీవాణి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..
ఆర్ఆర్ఆర్ టీంకి కంగ్రాట్స్ చెబుదాం. నాటు నాటు ఆస్కార్ సాధించిన తొలి ఇండియన్ సాంగ్ గా చరిత్ర సృష్టించింది. ఇది గొప్ప గౌరవం అంటూ ఈమె ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది.

Venu Swamy: ఇది గొప్ప గౌరవం….


ఇలా శ్రీవాణి నాటు నాటు పాటను ట్రిబ్యూట్ చేస్తూ చేసినటువంటి ఈ వీడియో చూసినటువంటి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇదేం టాలెంట్ రా బాబు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఈమె వీడియోకి ఫిదా అవుతూ ఈ వీడియో పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

“ధైర్యంగా కరోనాను అడ్డుకుందాం”.. ‘RRR’ టీమ్ అద్భుత సందేశం..!!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాచుతోంది.. ఈ సెకండ్ వేవ్ లో భాగంగా రోజుకి లక్షల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి..సామాన్య ప్రజలు ఈ మహమ్మారి ధాటికి విలవిలలాడిపోతున్నారు. పోయినట్లేపోయి మళ్ళీ ప్రజలను చుట్టుముట్టేసిన కరోనాను జయించేందుకు ఇటు ప్రభుత్వాలు, పలువురు వ్యక్తులు, సంస్థలు తమ విధిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో కొందరు సెలబ్రిటీలు సేవా కార్యక్రమాలతో పాటు సందేశ సాయం చేస్తున్నారు.

గత ఏడాది కరోనాను జయించే ప్లాస్మా దానంపై అవగాహనా కల్పించిన ఆర్ఆర్ఆర్ సినిమా టీం ఈసారి కరోనా మీద మరో సందేశాన్ని రూపొందించి విడుదల చేశారు.గత ఏడాది రూపొందించిన సందేశ చిత్రాలలో తారక్, చరణ్ మాత్రమే ఉండగా ఈసారి బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవ్ గన్ లతో సహా దేశమంతటికీ ఒకేసారి సందేశాన్ని అందించారు.ఒక్కొక్కరూ ఒక్కో భాషలో ప్రస్తుత కష్ట కాలాన్ని విశదీకరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు.

ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోని కలిసి కట్టుగా ధైర్యంగా నిలబడి కరోనాను అడ్డుకోవాలని, కుదిరిన ప్రతీ ఒక్కరూ వాక్సిన్ వేయించుకొని మన కుటుంబీకులు, స్నేహితులు, దేశాన్ని కాపాడుకోవాలని సందేశం ఇచ్చారు.ఇందులో హీరోయిన్ అలియా చేత తెలుగులో సందేశాన్ని వినిపించడం విశేషం కాగా.. చరణ్ తమిళం, ఎన్టీఆర్ కన్నడ, రాజమౌళి మలయాళంలో సందేశాన్ని అందించారు. ఇక అజయ్ దేవగన్ హిందీలో తన సందేశాన్ని వినిపించగా ప్రస్తుతం ఈ సందేశాత్మక చిత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

మరి వారి సూచనలు, సలహాలు తప్పకుండ ప్రతీ ఒక్కరూ పాటించి తిరిగి ఆరోగ్యకరమైన రోజులను మళ్ళీ తెచ్చుకోవాలని కోరుకుందాం..ఇక RRR విషయానికొస్తే ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది.. దసరా పండగ సందర్భంగా అక్టోబర్13 న విడుదల కావాల్సిన ఈ సినిమా ఈ కరోనా నేపథ్యంలో మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి…!!