Tag Archives: scientists

గుడ్డు శాఖాహారమా.. మాంసాహారమా..? శాస్త్రవేత్తలు తేల్చేశారు..!

కొన్ని ప్రశ్నలకు మనం ఎంత వెతికినా సమాధానం దొరకదు. ఉదాహరణకు చెట్టు ముందా విత్తనం ముందా..? కోడి ముందా గుడ్డు ముందా..? లాంటి ప్రశ్నలు తికమక పెట్టడానికి తప్ప సమాధానం చెప్పడానికి మాత్రం వీలు పడదు.

అయితే చాలా కాలంగా గుడ్డు శాఖాహారమా మాంసాహారమా..? అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. అయితే ఈ ప్రశ్నకు ఇటీవల శాస్త్రవేత్తలు సమాధానం ఇచ్చేశారు. మొదట చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే.. కోడి మాంసాహారం కాబట్టి కోడి నుండి వచ్చిన గుడ్డు కూడా మాంసాహారమే అంటూ గుడ్డుని తినడానికి ఇష్టపడరు. దీనికి చిన్న లాజిక్ఏంటంటే.. పశువు అనేది మాంసాహారి.

మరి ఆ పశువుల నుంచి వచ్చే పాలు కూడా మాంసాహారమే అవ్వాలి.. కానీ శాఖాహారంగా ఎందుకు పరిగణిస్తున్నారని చాలామందికి వచ్చే అనుమానం. అయితే గుడ్డుపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి గుడ్డు అనేది శాఖాహారంగా తేల్చేశారు. ఇక గుడ్డు వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఉడక బెట్టిన గుడ్డు తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి. ఇక గుడ్డును అనేక రకాలుగా వండుకుని తినొచ్చు. ఒక కోడి మరో కోడితో సంపర్కం జరిగినప్పుడే ఇది మాంసాహారంగా మారుతుంది. కోడి పుట్టిన ఆరు నెలల తరువాత ఒకటి లేదా రెండు రోజులకు గుడ్డును పెడుతుంది. ఈ ప్రక్రియ కోడిపెట్ట లేదా పుంజుతో సంపర్కం అవసరం లేకుండానే జరుగుతుంది. వీటినే అన్‌ఫెర్టిలైజర్ ఎగ్ అంటారు. సాధారణంగా మార్కెట్‌లో లభించే గుడ్లు అన్‌ఫెర్టిలైజర్ అయి ఉంటాయి. కాబట్టి గుడ్డు గురించి ఏం ఆలోచన లేకుండా లాగించేయవచ్చ అంటారు శాస్త్రవేత్తలు.

చిన్నారులకు కరోనా వైరస్ టీకాలు.. ఎప్పటినుండంటే?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ దేశాలన్ని వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే మన దేశంలో 18 సంవత్సరాలు 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ గత ఏడాదిన్నర కాలం నుంచి ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది మరణించారు. ఈ క్రమంలోనే రెండవ దశ మన దేశంలో తీవ్ర రూపం దాలుస్తూ అల్లకల్లోలం సృష్టించింది.ఈ క్రమంలోనే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.

ఇప్పటికే రెండు దశలలో వ్యాప్తిచెందిన కరోనా వైరస్ తర్వాత మూడవ దశ చిన్న పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా సమయంలో ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తమయ్యాయి. అదేవిధంగా చిన్నపిల్లలో ఈ వైరస్ ను కట్టడి చేయడం కోసం త్వరలోనే వీరికి టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించనున్నాయి.

చిన్న పిల్లలలో వ్యాక్సిన్ కనుగొనడానికి ఇప్పటికే మోడెర్నా వ్యాక్సిన్‌తో పాటు మరో ప్రొటీన్‌ ఆధారిత టీకా ఈ మేరకు ప్రాథమిక ప్రయోగాల్లో సత్ఫలితాలనిచ్చినట్లు అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు.ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 16 కోతి పిల్లలను రెండు బృందాలుగా విడదీసి వాటిలో ఒక బృందానికి మోడెర్నా, మరో వర్గానికి ప్రొటీన్‌ ఆధారిత టీకా అందించారు.  ఈ విధంగా కోతిపిల్లలలో రెండు డోసులు అందించాక ఆ కోతులలో కొవిడ్‌ కారక ‘సార్స్‌-కొవ్‌-2’ వైరస్‌ను అంతమొందించగల సురక్షిత, బలమైన యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయనీ నిపుణులు తెలియజేశారు.

పెద్ద కోతులలో 100 మైక్రోగ్రాముల టీకా డోసుతో వచ్చిన యాంటీబాడీలు.. చిన్న కోతుల్లో కేవలం 30 మైక్రోగ్రాముల డోసుతోనే ఉత్పత్తయ్యాయి. అదేవిధంగా
మోడెర్నా వ్యాక్సిన్ అందించిన కోతులలో అధిక మొత్తంలో వ్యాధి తీవ్రతను తగ్గించే  టీ-సెల్‌ ఉత్పత్తి అయినట్లు ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ క్రిస్టీనా డి పార్‌ తెలిపారు. ఈ విధంగా కూతులలో జరిపిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇవ్వడంతో త్వరలోనే ఈ వ్యాక్సిన్ ఈ విషయంలో మరింత లోతుగా అధ్యయనాలు జరిపి త్వరలోనే పిల్లలపై ప్రయోగాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆశ్చర్యం: ఓకే మహిళకు 31 సార్లు కరోనా పాజిటివ్..!

దాదాపు సంవత్సరం క్రిందట కరోనా మహమ్మారి అన్ని దేశాలకు వ్యాపించడంతో పాటు, భారతదేశంలో కూడా ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ మహమ్మారికి సంబంధించిన ఒక విషయం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. కరోనా వైరస్ ఒకే మహిళకు ఏకంగా 31 సార్లు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎలాంటి కరోన లక్షణాలు లేకుండా ఆమెకు తరచూ పాజిటివ్ అని రావడంతో వైద్యులు, శాస్త్రవేత్తలు ఆమె నమూనాలను సేకరించి పరిశోధనలను ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.

రాజస్థాన్‌లోని అప్నాఘర్‌ ఆశ్రమానికి చెందిన శారదకు కరోనా లక్షణాలు ఏమీ లేవు. అయినప్పటికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ప్రతిసారి ఆమెకు పాజిటివ్ అని నిర్ధారణ అవుతుంది. గత ఏడాది ఆగస్టు 20న ఆమెకు తొలిసారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా అందులో పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం ఆ మహిళను భరత్‌పూర్‌ జిల్లాలోని ఆర్‌బీఎం ఆస్పత్రిలో చేర్పించారు.అక్కడ చికిత్స పొందుతున్న ఆ మహిళకు వైద్యులు పలుమార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా ప్రతిసారి ఆమెకు పాజిటివ్ అని నిర్ధారణ అవుతుంది. ఇప్పటివరకు 31 సార్లు పరీక్షలు నిర్వహించగా, అన్నిసార్లు పాజిటివ్ అని రావడంతో డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు.

మొదటిసారి ఆ మహిళకు పాజిటివ్ వచ్చినప్పుడు ఎంతో నీరసంగా ఉండేదని, కేవలం నిలబడటానికి కూడా చేత కాకుండా ఉన్న ఆమె ప్రస్తుతం ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటూ, ఎలాంటి లక్షణాలు లేవు. అంతేకాకుండా ఆ మహిళ దాదాపు ఎనిమిది కిలోల బరువు కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆ మహిళకు మొదటిసారి కరోనా నిర్ధారణ అయిన తర్వాత చికిత్స తీసుకున్న అనంతరం వైరస్ శరీరంలో ఉండటం వల్ల ఎన్నిసార్లు నిర్ధారణ పరీక్షలు చేసినప్పటికీ ఆమెకు పాజిటివ్ అని వస్తుందని వైద్యులు భావించారు. అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈమె నమూనాలను సేకరించి వాటిపై అధ్యయనాలు కొనసాగిస్తున్నారు

కరోనా జలుబులాంటిదే… మళ్లీమళ్లీ సోకుతుందంటున్న శాస్త్రవేత్తలు..!

ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు జలుబులా కరోనా వైరస్ కూడా వచ్చీపోయే అవకాశాలు ఉంటాయని తెలిపారు. వైరాలజిస్టు వెండీ బార్క్‌లే కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వ్యాప్తి చెందిన కరోనా వైరస్ కు మళ్లీమళ్లీ సోకే లక్షణం ఉందని తెలిపారు.

వాతావరణంలోని మార్పుల వల్ల ప్రతి సంవత్సరం దగ్గు, జలుబు ఏ విధంగా వస్తాయో కరోనా కూడా అదే విధంగా వస్తుందని తెలిపారు. వెండీ బార్క్‌లే బ్రిటన్ లో 3.65 లక్షల మంది ప్రజలకు యాంటీబాడీ పరీక్షలు నిర్వహించి ఈ విషయాలను వెల్లడిస్తున్నామని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొన్ని నెలల పాటే యాంటీ బాడీలు ఉంటాయని గుర్తించామని… యాంటీబాడీలు లేకపోతే మళ్లీ వైరస్ సోకుతుందని చెప్పారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 26 శాతం మేర యాంటీబాడీలు తగ్గిపోతాయని గుర్తించామని.. వృద్ధుల్లో త్వరగా యాంటీబాడీలు తగ్గిపోతున్నాయని వెల్లడించారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించని వారిలో 64 శాతం యాంటీబాడీలు తగ్గిపోయినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయాలు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి.

మరోవైపు భారత్ లో గతంలో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య సగానికి తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని ప్రజలు భావిస్తున్న తరుణంలో కరోనా మళ్లీమళ్లీ సోకుతుందంటే ప్రజలకు మరిన్ని సమస్యలు తప్పవు.

ఆ రెండు రోజులు గుండెపోటు వస్తే బతికే అవకాశం తక్కువంట..!

ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు గుండెజబ్బుల బారిన పడి చనిపోతున్నారు. వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం 30 ఏళ్ల దాటిన వాళ్లు సైతం గుండెజబ్బుల బారిన పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వాళ్లు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు మరింత ఎక్కువ. పని ఒత్తిడి కూడా కొందరిలో గుండెజబ్బులకు కారణమవుతోంది. యూకేకు చెందిన పరిశోధకులు గుండె జబ్బులపై పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

శాస్త్రవేత్తల పరిశోధనల్లో వీకెండ్ లో గుండెపోటు వస్తే బ్రతికే అవకాశం లేదని.. వీక్ డేస్ లో గుండెపోటు వస్తే బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా శాస్త్రవేత్తలు శనివారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలవరకు గుండెజబ్బుల బారిన పడిన వారి డేటాను, మిగిలిన రోజుల్లో గుండెజబ్బుల బారిన పడ్డ వాళ్ల డేటాను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు.

శని, ఆదివారాల్లో గుండెపోటు వస్తే బ్రతికే అవకాశాలు చాలా తక్కువని పేర్కొన్నారు. వీకెండ్ లో హార్ట్ ఎటాక్ వచ్చిన వాళ్లలో కేవలం 20 శాతం మందికి మాత్రమే ఎలాంటి ముప్పు ఉండదని పేర్కొన్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రీససిటేషన్ స్కిన్స్ సింపోజియం సదస్సులో యూకే పరిశోధకులు సైతం ఇవే విషయాలను వెల్లడించారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వైద్యుల సూచనల మేరకు ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.

ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న అహారం వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని .. చెడు ఉన్న ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సకాలంలో వైద్య చికిత్స చేయించుకుని వైద్యులు సూచించిన మందులు వాడితే గుండె జబ్బుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

కరోనా సోకిన పిల్లల్లో అరుదైన వ్యాధి.. శాస్త్రవేత్తల్లో టెన్షన్..?

ప్రపంచ దేశాల్లో వేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ మహమ్మారికి సంబంధించి ఎన్నో లక్షణాలు వెలుగులోకి రాగా తాజాగా ఈ వైరస్ బారిన పడి కోలుకున్న చిన్నారికి అరుదైన వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఎయిమ్స్ వైద్యులు కరోనా వల్ల ఒక చిన్నారి మెదడులోని నాడులు దెబ్బ తిన్నాయని.. ఫలితంగా ఆమె చూపు మందగించిందని తేల్చారు.

చైల్డ్ న్యూరాలజీ విభాగం శాస్త్రవేత్తలు ఈ కేసును పూర్తిస్థాయిలో స్టడీ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన చిన్నారుల్లో ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారని అయితే భవిష్యత్తులో మరి కొంతమంది పిల్లల్లో సైతం ఈ సమస్య కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మెదడులో నాడులు దెబ్బ తినే ఈ సమస్యను ఎక్యూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్ అంటారని.. 11 సంవత్సరాల బాలికలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయని తెలిపారు.

సాధారణంగా పెద్దలు మాత్రమే ఈ వ్యాధి బారిన పడతారని వైద్యులు వెల్లడించారు. మనిషి మెదడులో కణాలను రక్షించే మైలిన్ పొర ఉంటుందని.. శరీరంలో సమాచార మార్పిడికి ఈ పొర దోహదపడుతుందని.. ఈ వ్యాధి వల్ల బాలిక కంటిచూపు మందగించిందని తెలిపారు. డాక్టర్ గులాటీ పాపకు చికిత్స అందించి కంటిచూపు మెరుగుపడేలా చేశారు. అయితే 50 శాతం మాత్రమే కంటిచూపు మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.

ఎక్యూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్ (ఏడీఎస్) అరుదైన వ్యాధి అని చెవులు, ముక్కు, నోరు, మూత్రాశయం, కండరాల కదలికలపై కూడా ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్యులు వెల్లడించారు. కరోనా మహమ్మారి గురించి వెలుగులోకి వస్తున్న వార్తలు ప్రజల్లో భయాన్ని మరింత పెంచేలా ఉండటం గమనార్హం. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న కొత్త లక్షణాలు శాస్త్రవేత్తలను టెన్షన్ పెడుతున్నాయి.