Tag Archives: sekhar master

Sekhar Master: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా… మామూలుగా లేదుగా?

Sekhar Master: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లుగా ఎంతో మంది కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఈయన ప్రముఖ దివంగత కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకున్నారు.

ఇలా ఆయన వద్ద శిష్యరికం పొందినటువంటి శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల అందరి సినిమాలలో తప్పనిసరిగా ఈయన కొరియోగ్రాఫర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా శేఖర్ మాస్టర్ కేవలం కొరియోగ్రఫీ మాత్రమే కాకుండా పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్న సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా శేఖర్ మాస్టర్ రెమ్యూనరేషన్ గురించి మరో కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈయన కూడా రాకేష్ మాస్టర్ వద్ద శిష్యరికం పొందారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన శేఖర్ మాస్టర్ రెమ్యూనరేషన్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

లక్ష మాత్రమే…

శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్న ఎన్నో సంగీత్ వేడుకలకు కూడా కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారని బషీర్ మాస్టర్ వెల్లడించారు. ఒకరోజు ఒక ఈవెంట్ కనుక చేస్తే సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారంటూ బషీర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను కూడా ఈవెంట్స్ చేస్తానని అయితే రోజుకు లక్ష మాత్రమే తీసుకుంటాను అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Rakesh Master: రాకేష్ మాస్టర్ కుటుంబ బాధ్యత మాదే… గణేష్ మాస్టర్ కామెంట్స్ వైరల్!

Rakesh Master: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఎందరో స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన రాకేష్ మాస్టర్ ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించారు. ఇలా స్టార్ హీరోలతో ఎన్నో పాటలకు అద్భుతమైన స్టెప్పులు వేయించిన రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు పొందాడు. అంతే కాకుండా ఎంతోమందికి డాన్స్ కూడా నేర్పించాడు. ఈటీవీలో ప్రసారమైన ఢీ షో లో కూడా పాల్గొన్నాడు.

ఇదిలా ఉండగా ఆయన శిష్యులు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు. అయితే కొంతకాలంగా ఆయనకి సరైన అవకాశాలు రాకపోవటంతో కామెడీ షోలు, ఇంటర్వ్యు లలో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. ఈ ఇంటర్వ్యులలో రాకేష్ మాస్టర్ చేసే వ్యాఖ్యలు కొన్ని సందర్భాలలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా తన శిష్యుడు శేఖర్ మాష్టర్ గురించి రాకేష్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబందించిన వీడియోలను షేర్ చేసేవాడు. ఆయన షేర్ చేసే వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అయ్యేవి. ఇదిలా ఉండగా అదివారం ఉదయం రక్తవిరేచనలు, వాంతులు అవటంతో ఆయన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సోమవారం రోజు బొరబండ లో రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు నిర్వహించారు.

Rakesh Master : ఆర్థికంగా అండగా నిలుస్తాం…


ఇక రాకేష్ మాస్టర్ చివరి చూపు కోసం ఆయన శిష్యులు అందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో గణేష్ మాస్టర్, జానీ మాస్టర్ రాకేష్ మాస్టర్ పాడే కూడా మోసారు. ఇదిలా ఉండగా మీడియాతో మాట్లాడిన గణేష్ మాస్టర్..” తన గురువు మరణం గురించి బాధపడుతూ.. రాజేష్ మాస్టర్ కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయిందని, ఆయన శిష్యులు అందరూ కలిసి ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని, వారి కుటుంబ బాధ్యతలు పిల్లల బాధ్యతలను తాము చూసుకుంటాము అంటూ ఈ సందర్భంగా గణేష్ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Sekhar Master: రాకేష్ మాస్టర్ పార్థివ దేహం చూసి కన్నీటి పర్యంతరమైన శేఖర్ మాస్టర్… వీడియో వైరల్!

Sekhar Master:ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం మరణించారు. ఇలా రాకేష్ మాస్టర్ మరణించడంతో పలువురు సినీ సెలబ్రిటీలు ఇతర డాన్స్ కొరియోగ్రాఫర్లు ఆయన శిష్యులు పెద్ద ఎత్తున రాకేష్ మాస్టర్ మృతి పై సంతాపం తెలియజేస్తున్నారు.

ఇక రాకేష్ మాస్టర్ దగ్గర శేఖర్ మాస్టర్ కూడా శిష్యరికం పొందిన విషయం మనకు తెలిసిందే.ఇలా రాకేష్ మాస్టర్ శిష్యుడిగా ఈయన కూడా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే ఒకానొక సమయంలో రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గురించి అతని భార్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య వివాదాలు కూడా తలెత్తాయి.

సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకున్నారు.అయితే రాకేష్ మాస్టర్ మరణించడంతో శేఖర్ మాస్టర్ అతని చివరి చూపు కోసం వస్తారా రారా అన్న సందేహం కూడా అందరిలో ఉండేది కానీ శేఖర్ మాస్టర్ మాత్రం తన గురువుగారిని ఆఖరి చూపు చూసుకోవడం కోసం తరలివచ్చారు.

Sekhar Master: కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్….


ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ పార్థివ దేహాన్ని చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతరం అయ్యారు. ఆయన పార్తివదేహానికి పూలమాలలు సమర్పించి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sekhar Master: తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయినా శేఖర్ మాస్టర్.. ఓదార్చిన ఓంకార్!

Sekhar Master: శేఖర్ మాస్టర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఢీ డాన్స్ షో ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క హీరోలకు డాన్స్ కంపోస్ట్ చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఒకవైపు వెండితెర సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న శేఖర్ మాస్టర్ మరోవైపు డాన్స్ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే డాన్స్ ఐకాన్ కార్యక్రమానికి రమ్యకృష్ణతో కలిసి శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో భాగంగా c/o కంచరపాలెం సినిమాలోని ‘ఆశా పాశం’ అనే పాటకు అద్భుతమైన డ్యాన్స్ చేశాడు. ఈ పాట అనంతరం తన తండ్రి వేదిక పైకి రాగానే ఇప్పటివరకు తన తండ్రిని ఏమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను నాన్న నాకు ఒక టైట్ హగ్గు కావాలి అంటూ తన తండ్రిని హత్తుకుని ఎమోషనల్ అయ్యారు.

ఈ సంఘటన మొత్తం చూస్తున్నటువంటి శేఖర్ మాస్టర్ కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ తన తండ్రిని కనీసం హగ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆ దేవుడు తన తండ్రిని దూరం చేశాడంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ విధంగా శేఖర్ మాస్టర్ ఎమోషనల్ కావడంతో ఓంకార్ మీకు తండ్రిగారు లేరు నాకు తండ్రి గారు లేరు నాకు నువ్వు నీకు నేను అంటూ శేఖర్ మాస్టర్ కు టైట్ హాగ్ ఇచ్చి తనని ఓదార్చారు.

Sekhar Master: ఒక్కసారిగా ఎమోషనల్ అయిన శేఖర్ మాస్టర్..

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే శేఖర్ మాస్టర్ ఎమోషనల్ కావడంతో అక్కడే ఉన్నటువంటి మోనాల్ సైతం ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ ఎపిసోడ్ శనివారం టెలికాస్ట్ కానుంది ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

Sekhar Master: ప్రభాస్ పవన్ సినిమాలకు పని చేయకపోవడానికి అదే కారణం.. వారి వల్లే అవకాశం కోల్పోయా: శేఖర్ మాస్టర్

Sekhar Master: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో కుర్ర హీరోల నుంచి అగ్ర హీరోల వరకు తన స్టెప్పులతో అందరిని సందడి చేస్తున్నారు.ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కెరియర్ పరంగా ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అదేవిధంగా ఒకవైపు కొరియోగ్రాఫర్ గా బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు శేఖర్ స్టూడియో ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

శేఖర్ మాస్టర్ స్టెప్స్ ఎంతో స్టైలిష్ గా ఉండడంతో ఈయన కొరియోగ్రఫీకి అందరూ అభిమానులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క సినిమాలో తప్పనిసరిగా ఈయనకు అవకాశం ఉంటుందని చెప్పాలి.ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోలు అందరికీ తాను కొరియోగ్రాఫర్ గా పనిచేశానని అయితే ప్రభాస్ పవన్ కళ్యాణ్ కి మినహా మిగిలిన హీరోలు అందరీ సినిమా కోసం తాను పనిచేశానని తెలిపారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రభాస్ సినిమాలకు కూడా తనకు అవకాశం వచ్చినట్టే వచ్చి, ఆ అవకాశాలు జారిపోయాయని శేఖర్ మాస్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు.పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో తనకు ఒక పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చిందని తీరా ఆ పాట షూట్ చేసే సమయంలో టెక్నీషియన్ కు అనారోగ్యం చేయడం వల్ల తాను వేరే సినిమాకు కమిట్ అయ్యాను అలా ఈ సినిమా అవకాశం కోల్పోయిందని తెలిపారు.

Sekhar Master: తప్పకుండా వారితో సినిమాలు చేస్తా….

ఇక ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన మిర్చి సినిమాకి తనకు అవకాశం వచ్చిందని శేఖర్ మాస్టర్ వెల్లడించారు.అయితే అప్పుడే తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్లో ఎదుగుతుండడంతో కొరటాల శివ తనకు ఆ అవకాశం ఇవ్వలేదని అలా ప్రభాస్ సినిమా కూడా మిస్ అయిందని శేఖర్ మాస్టర్ తెలిపారు.అయితే వీరిద్దరితో ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా తప్పకుండా సినిమా చేస్తానని ఈయన ధీమా వ్యక్తం చేశారు.

Avinash: శేఖర్ మాస్టర్ పరువు దారుణంగా తీసేసిన ముక్కు అవినాష్.. ఏం జరిగిందంటే?

Avinash: బుల్లితెరపై శేఖర్ మాస్టర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ శేఖర్ మాస్టర్ తనదైన శైలిలో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక వెండితెరపై ఈయనకి కొరియోగ్రాఫర్ గా ఉన్న డిమాండ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇప్పటికే స్టార్ హీరోలందరికీ అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించిన శేఖర్ మాస్టర్ స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Avinash: శేఖర్ మాస్టర్ పరువు దారుణంగా తీసేసిన ముక్కు అవినాష్.. ఏం జరిగిందంటే?

ఈయన వేసే స్టెప్పులు ఐకానిక్ స్టెప్పులుగా మారిపోతూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంలోని ఏక్ బార్ ఏక్ బార్ స్టెప్పులు ఒక రేంజ్ లో పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ ఈ స్టెప్పులు ఏదో ఒక సందర్భంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

Avinash: శేఖర్ మాస్టర్ పరువు దారుణంగా తీసేసిన ముక్కు అవినాష్.. ఏం జరిగిందంటే?

ఈ క్రమంలోనే ఈ స్టెప్పులు పై ముక్కు అవినాష్ శేఖర్ మాస్టర్ పై పంచులు వేస్తూ అతని పరువు మొత్తం తీశారు.ప్రతి ఆదివారం స్టార్ మాలో కామెడీ స్టార్స్ ధమాకా కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేత గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముక్కు అవినాష్ శేఖర్ మాస్టర్‌గా, యష్ మాస్టర్ నటించాడు. ఇక అవినాష్ లేడీ గెటప్పుతో దుమ్ములేపేశాడు.

ఏ టైంలో ఈ స్టెప్స్ కంపోజ్ చేశారో కానీ…

శేఖర్ మాస్టర్ అభిమానిగా ముక్కు అవినాష్ నటిస్తూ ఆయన స్టెప్పులు వేసిన ఏక్ బార్ ఏక్ బార్ అంటూ డాన్స్ మూమెంట్ ను అవినాష్ చేశారు.ఈ క్రమంలోనే ఫ్లోర్ మూమెంట్ వేస్తూ ఏ టైం లో ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారో గానీ అంటూ శేఖర్ మాస్టర్ ని ముక్కు అవినాష్ అనడంతో వెంటనే శేఖర్ మాస్టర్
ఏం టైంలో కంపోజ్ ఏంట్రా అని శేఖర్ మాస్టర్ పగలబడి నవ్వారు. ఈ విధంగా ముక్కు అవినాష్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పై పంచులు వేస్తూ అందరిని నవ్విస్తున్నారు.

అలా జరగడంతో.. 3 నెలలు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది : నటి పూర్ణ

సాధారణంగా చాలామందికి టెర్రస్ మీద అంటే మేడ మీద ప్రేమ కథలు జరిగే ఉంటాయి. చిన్నతనం నుంచి ఏదో ఒక సందర్భంలో ఇలా టెర్రస్ పైకి ఎక్కి ప్రేమ వ్యవహారాలను నడిపే ఉంటారు. మేడ మీదకు చదువుకోవడానికి వెళ్లినప్పుడో.. లేదా బట్టలు ఆరేయడానికి వెళ్లినప్పుడో ప్రేమ కథలు నడిచే ఉంటాయి.

ఇలా మేడమీదే అమ్మాయి, అబ్బాయిల చూపులు కలుస్తుంటాయి. అందుకే వీటిని టెర్రస్ లవ్ స్టోరీలు అంటారు. ఇలాంటి స్టోరీలు వారి వారి జీవితంలో జరిగే విషయాలను తమ కళ్ల ముందుకు తీసుకొచ్చేందుకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టార్ ప్రయత్నిస్తున్నాడు. దాని కోసం తన యూ ట్యూబ్ ఛానల్ లో స్వీయ నిర్మాణంలో వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న శేఖర్ మాస్టర్, బుల్లితెరపై కూడా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆ మధ్య ఢీ డాన్స్ షో, ఇప్పుడు కామెడీ స్టార్స్‌కి జడ్జీగా ఉన్న శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇలా టెర్రస్ ప్రాజెక్ట్ ప్రమోషన్లో భాగంగా.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, కామెడీ స్టార్స్ షోలకు సంబందించిన ప్రముఖ సెలబ్రిటీలు రంగంలోకి దిగారు. ఇప్పటికే హైపర్ ఆది, ప్రియమణి, అనసూయ తమ టెర్రస్ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుని ప్రమోషన్ చేశారు. తాజాగా నటి పూర్ణ తన టెర్రస్ అనుభవాలను పంచుకున్నారు.

ఆమె లవ్ స్టోరీ కాకుండా టెర్రస్ పై జరిగిన ఓ ఘటనను చెప్పుకొచ్చారు. తన ఇంటి చుట్టు పక్కల ఉండే వాళ్లు అంతా తనకు బ్రదర్స్ అని.. అందుకే ఎలాంటి లవ్ స్టోరీలు లేవని చెప్పారు. చిన్నతనంలో ఓ రోజు టెర్రస్ మీద నుంచి కిందపడగా.. తలకు పెద్ద గాయం అయిందని.. మూడు నెలల ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చిందని చెప్పారు. టెర్రస్ లవ్ స్టోరీని చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నామని.. శేఖర్ మాస్టార్ కు ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పారు పూర్ణ.