Tag Archives: shobhan babu

Actress Nagma: నా బాత్రూం విలువ చేయదు నీ ఆస్తి… అందరి ముందు నగ్మను అవమానించిన స్టార్ హీరో?

Actress Nagma: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అలనాటి సీనియర్ నటుడు శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన శోభన్ బాబుకి ఆ రోజుల్లోనే భారీగా లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. నటనపరంగా మాత్రమే కాకుండా మహిళలను గౌరవించడంలో కూడా శోభన్ బాబు అందరికీ ఆదర్శంగా ఉండేవాడు.

ఒకానొక సమయంలో శోభన్ బాబు ఒక హీరోయిన్ ని అందరి ముందు దారుణంగా అవమానించినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. శోభన్ బాబు చేతిలో అవమానించబడిన హీరోయిన్ మరెవరో కాదు నగ్మా. శోభన్ బాబు, నగ్మా జంటగా అడవి దొర సినిమాలో నటించారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అయితే ఆ షూటింగ్ సమయంలో ఒకానొక సందర్భంలో శోభన్ బాబు నగ్మా మీద కోపగించుకొని ఆమెను అవమానపరిచినట్లు తెలుస్తోంది.

శోభన్ బాబు ఆమె మీద కోప్పడటానికి కారణం కూడా లేకపోలేదు. అడవి దొర సినిమాలోని ఒక పాట కోసం చైనా సరిహద్దుకు సమీపంలో చిత్రయూనిట్ వెళ్లింది. అయితే ఆ సమయంలో షూటింగ్ స్పాట్ కి అందరూ వచ్చినా కానీ.. నగ్మా మాత్రం రాలేదట. ఆమె కోసం చిత్రయూనిట్ మొత్తం దాదాపు గంటన్నర పాటు ఎదురు చుస్తే అప్పుడు సెట్ లోకి నగ్మా సెట్ లోకి వచ్చిందట.

Actress Nagma: టైమ్ సెన్స్ ఉండాలి…


ఈ విధంగా ఆమె ఆలస్యంగా రావడమే కాకుండా.. అడిగిన ప్రశ్నలకు సరైనా సమాధానాలు చెప్పకపోవడంతో శోభన్ బాబుకు బాగా కోపం వచ్చిందట. దీంతో నగ్మాను పిలిచి నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుందని అడిగ్గా.. అందుకు ఆమె సమాధానం చెప్పగా.. ‘ నా బాత్రూం విలువ చేయదు నీ ఆస్తి. బిహేవ్ ప్రొపర్లి. టైమ్ సెన్స్ ఉండాలి అంటూ అందరిముందు నగ్మా మీద సీరియస్ అయ్యారట. అయితే శోభన్ బాబు అలా అనడంతో నగ్మా సైలెంట్ అయ్యిందట. ఆ తర్వాత శోభన్ బాబు బ్యాగ్రౌండ్ తెలుసుకుని నగ్మా షాక్ అయ్యిందట.

Shobhan Babu: స్టార్ హీరో శోభన్ బాబు పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయకపోవడానికి ఇదే కారణమా?

Shobhan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్న వారిలో నటుడు శోభన్ బాబు ఒకరు.తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి శోభన్ బాబు కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన అనంతరం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.

ఇండస్ట్రీలో ఎంతో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈయన తన వారసులుగా ఇండస్ట్రీకి తన కొడుకులను పరిచయం మాత్రం చేయలేకపోయారు.ఇలా తన పిల్లలకి నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ శోభన్ బాబు మాత్రం తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెట్టారు. ఇలా శోభన్ బాబు తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెట్టడానికి గల కారణం ఏంటి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.

ఈ క్రమంలోనే నటుడు రాజా రవీంద్రకు సైతం ఇదే ఆలోచన రావడంతో ఈయన శోభన్ బాబు గారిని ఇదే ప్రశ్న అడిగారట.అందుకు శోభన్ బాబు సమాధానం చెబుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అవకాశాలను అందుకోవడం కోసం ఎన్నో అవమానాలను, కష్టాలను పడ్డాను.ఒక స్టార్ హీరో అయినప్పటికీ ఇండస్ట్రీలో తాను ఎక్కువ ఒత్తిడికి గురయ్యానని అలాంటి ఒత్తిడి అవమానాలు కష్టాలు తన పిల్లలకు వద్దన్న ఉద్దేశంతోనే వారిని ఇండస్ట్రీకి దూరం పెట్టానని శోభన్ బాబు తెలిపారట.

Shobhan Babu: భూమిపై ఇన్వెస్ట్ చేసిన శోభన్ బాబు…

ఇక శోభన్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ అందరిలాగా సినిమాలలోని ఇన్వెస్ట్ చేయకుండా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు.ఇలా అప్పట్లో శోభన్ బాబు కొన్న భూములు విలువ ఇప్పుడు కొన్ని వేల కోట్ల విలువ చేయడం విశేషం. ఇక శోభన్ బాబు కుమారులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వ్యాపార రంగంలో మంచిగా స్థిరపడ్డారని చెప్పాలి.

Venkatesh: వెంకటేష్ నిర్మాతగా శోభన్ బాబుతో ఓ సినిమా నిర్మించారని మీకు తెలుసా?

Venkatesh: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికి ఎన్నో నిర్మాణ సంస్థలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఇక అప్పట్లో ఇండస్ట్రీలో రామానాయుడు గారు నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నేర్పించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఈయన తరువాత సురేష్ బాబు ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇకపోతే ఓ నిర్మాత కుమారుడిగా సురేష్ బాబు నిర్మాతగా మారగా వెంకటేష్ మాత్రం హీరోగా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.ఈ విధంగా వెంకటేష్ హీరోగా మాత్రమే మనకు తెలుసు కానీ ఆయన కూడా నిర్మాతగా ఒక సినిమా చేశారనే విషయం చాలా మందికి తెలియదు.

వెంకటేష్ కు సీనియర్ నటుడు నటభూషణ్ శోభన్ బాబు అంటే అమితమైన ప్రేమ ఇష్టం. ఈ క్రమంలోనే వెంకటేష్ వెంకటేష్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి శోభన్ బాబు వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా ఎంకి – నాయుడు బావ అనే సినిమాని నిర్మించారు.

ఇలా ఈ సినిమా నిర్మించే సమయంలో వెంకటేష్ వయసు 18 సంవత్సరాలు మాత్రమే.ప్రస్తుతం ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది..రామా నాయుడు సమర్పణలో వచ్చిన ఈ ఫిలిం సినిమా స్కోప్ – ఈస్ట్‌మన్ కలర్‌లో రూపొందించారు. గుమ్మడి, కాంతారావు, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి వారు నటించారు.

Venkatesh: వెంకటేష్ నిర్మించిన ఏకైక చిత్రం…


ఈ సినిమాకు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా తరువాత వెంకటేష్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోయారు. అక్కడే ఉన్నత చదువులు చదువుతూ నటనలో శిక్షణ తీసుకున్న అనంతరం కలియుగ పాండవులు సినిమా ద్వారా హీరోగా ఈయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన తరువాత వెంకటేష్ ఎలాంటి సినిమాలను నిర్మించలేదు.

Bheeshma Sujatha: శోభన్ బాబు వద్దన్నా పెళ్ళిచేసుకున్నా… జమీందారు సంబంధం అని పెళ్లి చేసుకున్న చివరికి ఇలా?

Bheeshma Sujatha: వెండి తెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన సీనియర్ నటిమని సుజాత గురించి నేటి తరం వారికి తెలియకపోయినప్పటికీ ఒకప్పుడు ఈమె అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. ఈమె భీష్మ సినిమాలో మత్స్య కన్యగా నటించడంతో ఈమె భీష్మ సుజాతగా పేరు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి భీష్మ సుజాత చాలా కాలం తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను తెలిపారు.ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ తనకు అతి చిన్న వయసులోనే పిఠాపురం జమీందారు సంబంధం రావడంతో పెళ్లి చేశారని తెలిపారు.

ఇలా తనకు పెళ్లి నిశ్చయమైనప్పుడు శోభన్ బాబు గారు ఇంత చిన్న వయసులోనే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అమ్మ అని తనకు చెప్పినప్పటికీ తాను మాత్రం వినకుండా పిఠాపురం సంబంధం అని పెళ్లి చేసుకున్నాను అయితే అప్పటికే ఆయనకు పెళ్లి జరిగింది మొదటి భార్య అంగీకారంతోనే తనని రెండవ పెళ్లి చేసుకున్నారని తెలిపారు.

Bheeshma Sujatha: దానధర్మాలు చేయటం వల్ల ఆస్తులు కరిగిపోయాయి…


అయితే ఆయనని పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితం ప్రశాంతంగా ఉంటుందనుకున్నాను. కానీ తన భర్త చేసే దానధర్మాల వల్ల కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా కరిగిపోయాయని మరికొన్ని ఆస్తులు కోర్టు ఆధీనంలో ఉన్నాయని సుజాత వెల్లడించారు.ఇలా ఆర్థిక పరిస్థితులు తనని వెంటాడటంతో తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చానని అయితే హీరోయిన్ గా మాత్రమే కాకుండా డబ్బింగులు కోరసులు డ్రామాలు అన్నీ కూడా చేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా సుజాత తన వ్యక్తిగత జీవితం గురించి చేసినటువంటి ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Actress Satya Priya : శోభన్ బాబు, జయలలిత కు ఒక కూతురు.. అనే వదంతుల్లో పచ్చి నిజాలు బయటపెట్టిన సత్యప్రియ.!!

జయలలిత రాజకీయాలలోకి రాకముందు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి 1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది అందే వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది. తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు)అని పిలుచుకుంటారు.

ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఎంజీఆర్, జయలలిత తమిళ ఇండస్ట్రీలో “ది బెస్ట్ పేయిర్” గా చెప్పుకోవచ్చు. వీరిద్దరు కలిసి దాదాపు 28 చిత్రాల్లో కలిసి నటించారు. వీరు కలిసి మొదటగా 1964లో “ఆయిరత్తిల్ ఒరువన్” అనే చిత్రంలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఆ తరువాత అనేకమంది తెలుగు తమిళ కన్నడ మలయాళ హీరోలు ఆమెతో నటించడానికి ఉత్సాహం చూపేవారు.

1970 ఆ ప్రాంతంలో ఎంజీఆర్.. జయలలితను కాకుండా చంద్రకళ, మంజుల, లత కథానాయికలుగా ఓ తమిళ చిత్రంలో ఎంజీఆర్ నటించారు. తనను కాదని వేరే కథానాయికలతో ఎంజీఆర్ నటించడం జయలలితకు నచ్చలేదు. ఆ క్రమంలో జయలలిత, ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగింది. 1971లో జయలలిత తల్లి స్వర్గస్తులయ్యారు. ఆ తర్వాత ఒక్కసారిగా జయలలితకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో (1973) శోభన్ బాబుతో నటించే అవకాశం వచ్చింది. అలా శోభన్ బాబు, జయలలిత కలిసి “డాక్టర్ బాబు” చిత్రంలో కలిసి నటించారు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. 1975 వచ్చేసరికి తమిళంలో పూర్తిగా అవకాశాలు తగ్గడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో శోభన్ బాబుతో సాన్నిహిత్యం పెరిగింది.

1979 “స్టార్ అండ్ స్టైల్” అనే ఓ ఇంగ్లీషు పత్రిక వీరి రహస్య అనుబంధం గురించి రాయడం జరిగింది. ఈ ఇంగ్లీష్ ఆర్టికల్ ని తమిళనాట బాగా పేరు పొందిన “కుముదం” పత్రిక తమిళంలోకి అనువదించి జయలలిత, శోభన్ బాబు రహస్య అనుబంధం గురించి రాశారు. దానికి స్పందించిన జయలలిత.. శోభన్ బాబు తనకు మధ్య బంధం ఉందని… ఒకరి బాధలు, భావాలు పంచుకునేంత దగ్గరని అది ఎంతో పవిత్రమైన అనుబంధమని.. శోభన్ బాబును తను కలిసే నాటికి ఆయన వివాహితుడని కావున ఆయన సతీమణికి ద్రోహం చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తరువాత‌ వారి రహస్య అనుబంధం గురించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలో పుంఖానుపుంఖాలుగా వదంతులతో కూడిన వార్తలు దినపత్రికలో వచ్చాయి. శోభన్ బాబు, జయలలిత మధ్య గల ఆ రహస్య అనుబంధం ఏమిటి అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

అయితే ఈ మధ్యకాలంలో అలనాటి నటి సత్యప్రియ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ… శోభన్ బాబు, జయలలిత మధ్య రహస్య అనుబంధం గురించి ఆమెను అడగగా…. జయలలిత పర్సనల్ మేకప్ మెన్ తనకు కూడా మేకప్ మేన్ గా పని చేశారని… శోభన్ బాబు, జయలలిత మధ్య అనుబంధం నిజమేనని… కానీ వారిద్దరికీ కలిసి ఒక కూతురుకు జన్మించిందనేది అవాస్తవమని మేకప్ మెన్ చెప్పారని.. ఒక్కసారి జయలలిత ద్వేశించిన వ్యక్తిని మల్లి దగ్గరికి రానివ్వదని జయలలిత ముఖ్యమంత్రి అయ్యాక ఒకప్పుడు పర్సనల్ మేకప్ మెన్ గా పని చేసిన అనుబంధంతో ఆమెను కలుద్దామని వెళ్లేసరికి తనను గేటు వద్ద నుంచే పంపించిందని మేకప్ మెన్ తనతో అన్నారని సత్యప్రియ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Actress Jayachitra: ఆ చిన్న పొరపాటు వల్ల బాహుబలి సినిమా అవకాశాన్ని కోల్పోయాను.. సీనియర్ నటి జయ చిత్ర కామెంట్స్ వైరల్!

Actress Jayachitra: సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో గ్లామరస్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి జయ చిత్ర ఒకరు.అప్పట్లో ఈమె కృష్ణంరాజు కృష్ణ శోభన్ బాబు వంటి హీరోల సరసన నటించి అద్భుతమైన నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈ విధంగా గట్టిగా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో అద్భుతంగా అవకాశాలను అందుకొని బిజీగా మారిపోయారు.

హీరోయిన్ గా ఎంతో గుర్తింపు పొందినటువంటి జయ చిత్ర సెకండ్ ఇన్నింగ్స్ పవర్ ఫుల్ అత్త పాత్రలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. అయితే తాజాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో వచ్చినటువంటి పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జయచిత్ర ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను తన సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు సీరియల్స్ లో కూడా నటించానని తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగులో రాఘవేంద్రరావు బంధువులు తెరకెక్కిస్తున్నటువంటి మంగమ్మగారి మనవడు సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది.ఆ సమయంలో తాను రాజమౌళి గెస్ట్ హౌస్ లో ఉన్నానని ఇలా తనకు అవకాశం రావడంతో తాను ఈ సీరియల్లో చేయడానికి ఓకే చెప్పాను.అయితే అదే సమయంలోనే కొందరు ఉద్దేశపూర్వకంగా తాను ఈ సీరియల్ లో నటించడానికి ఇష్టత చూపలేదని తను ఫారెన్ వెళ్లాలనుకుంటున్నాను అంటూ దర్శకులకు అబద్ధాలు చెప్పారు.

Actress Jayachitra:శివగామి పాత్ర నాకే వచ్చేది..

ఇది నిజమే అనుకొని నాకు ఈ సీరియల్లో అవకాశం లేకుండా పోయింది.హీరోయిన్ గా ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు సంపాదించుకున్న తనకు ఈ సీరియల్ మిస్ అవ్వడంతో ఆ అసంతృప్తి తనలో అలాగే ఉండిపోయిందని ఈమె తెలియజేశారు.ఒకవేళ ఈ సీరియల్లో కనుక నేను నటించి ఉంటే తప్పకుండా నాకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించే అవకాశం వచ్చేదని ఆ చిన్న పొరపాటు కారణంగా ఈ అవకాశాన్ని కోల్పోయానంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Actress Sharada: మూడుసార్లు నేషనల్ అవార్డు తీసుకున్న ఒక్క సీన్ కోసం 20 టేకులు తీసుకున్న సీనియర్ నటి శారద?

Actress Sharada: సాధారణంగా సినిమాలలో నటించాలంటే అన్ని రకాల ఎమోషన్స్ మనము వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సన్నివేశానికి అనుగుణంగా నటీనటులు తమహావ భావాలను పలికించాలి. అయితే కొన్నిసార్లు ఎంతో మహానటులు నటీమణులు అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు చేయడానికి కాస్త కష్టతరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఎక్కువ టేకులు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ క్రమంలోనే నటి శారద తన సినీ కెరియర్లో ఎన్నో గొప్ప గొప్ప అవార్డులను అందుకోవడమే కాకుండా మూడుసార్లు జాతీయ అవార్డును కూడా అందుకున్నప్పటికీ ఈమె ఒక్క సన్నివేశం చేయడానికి ఏకంగా 20 టేకులు తీసుకోవడం గమనార్హం. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు శారద హీరో హీరోయిన్లుగా వచ్చిన శారద అనే సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయంలో నటించారు.

ఈ సినిమాలో శారద మతిస్థిమితం కోల్పోయిన అమ్మాయిగా కనిపించాల్సి ఉంటుంది. అయితే ఒక సన్నివేశంలో శోభన్ బాబు డాక్టర్ గా ఉండగా శారద సోదరుడు తనని పట్నం తీసుకెళ్లి తన పరిస్థితిని చెప్పగా శోభన్ బాబు తాను పట్నం రావాల్సిన పనిలేదు నేనే తన ఊరికి వస్తానని శారద వెంట తన ఊరికి వెళ్తారు. శోభన్ బాబు లోపలికి రావడం చూసి ఆమె శోభన్ బాబుని తన భర్త అని భావించి తనని ఎందుకు వదిలి వెళ్లారు.. తనకెందుకు అన్యాయం చేశారంటూ కాళ్లపై పడి ఏడ్వాల్సి ఉంటుంది.

Actress Sharada: చివరి టేక్ ఓకే చేసిన డైరెక్టర్…

ఈ సన్నివేశం చేయడం కోసం శారద నుంచి డైరెక్టర్ విశ్వనాథ్ గారికి రావలసిన ఫీల్ రాకపోవడంతో ఆయన ఏకంగా ఈ సన్నివేశం కోసం 20 టేకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా 20 టేకుల చేసిన అనంతరం విశ్వనాథ్ గారు చివరి టేక్ ఓకే చేశారట.నటీనటులను ఏమాత్రం విసుక్కోకుండా తనకు కావలసిన సన్నివేశం కావలసిన విధంగా వచ్చేవరకు విశ్వనాథ్ గారు ఎంతో ఓపికగా ఎన్ని టేక్స్ అయినా కానీ సన్నివేశాన్ని తెరకెక్కించడం ఆయన నైజం. అందుకే ఆయన సినిమాలు ఎంతో సహజంగా ఉంటాయని చెప్పాలి.

Nirupam Paritala: డాక్టర్ బాబు ఇకపై సీరియల్స్ చేయరా… కేవలం యూట్యూబ్ వీడియోలతోనే సరిపెట్టుకుంటారా?

Nirupam Paritala: బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పరిటాల నిరుపమ్ అందరికీ సుపరిచితమే.ఈయన ఈ పేరు కన్నా డాక్టర్ బాబుగా ఎంతో గుర్తింపు పొందారు.స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన డాక్టర్ బాబు ప్రస్తుతం ఈ సీరియల్ కు దూరమయ్యారు.

ఇలా కార్తీకదీపం సీరియల్ నుంచే కాకుండా ఈయన బుల్లితెరపై ఎలాంటి సీరియల్స్ లోను సందడి చేయలేదు. అయితే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారని అలాగే సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తానని గత వీడియోలలో తెలిపారు. ఇకపోతే తన భార్య మంజులతో కలిసి డాక్టర్ బాబు ఏదో ఒక వీడియో ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు.

మంజుల నిరుపమ్ అనే పేరుతో వీరిద్దరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే అయితే నిత్యం ఏదో ఒక వీడియో ద్వారా మంజుల అభిమానులను సందడి చేస్తుంటారు. ఇక ఈ వీడియోలో డాక్టర్ బాబు సైతం తన పంచ్ డైలాగులతో అందరిని నవ్విస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా వరలక్ష్మీ వ్రతం అంటూ నగల షాపింగ్ కి వెళ్ళిన వీడియోని మంజుల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు.

Nirupam Paritala: బుల్లితెరకు దూరమవుతున్నారా…

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇలా డాక్టర్ బాబు మంజుల వీడియోలు చూసినా అభిమానులు ఇకపై డాక్టర్ బాబు బుల్లితెర సీరియల్స్ లో నటించరా? ఇలా కేవలం యూట్యూబ్ వీడియోలకు మాత్రమే పరిమితం అవుతారా? అంటూ పెద్ద యెత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ విధంగా అభిమానులలో తలెత్తుతున్న ఈ ప్రశ్నలకు డాక్టర్ బాబు ఏ విధమైనటువంటి సమాధానం చెబుతారు తెలియాల్సి ఉంది.

Jagan Movie: ఏపీ సీఎం జగన్ పేరుతో సినిమా ఉందని మీకు తెలుసా?

Jagan Movie: జగన్ అంటేనే టక్కున అందరికీ ఏపీ ముఖ్యమంత్రి గుర్తుకు వస్తారు. అయితే జగన్ పేరు మీదగా ఓ సినిమా కూడా ఉందండోయ్.. ఈ సినిమా గురించి చాలా మందికి తెలియదు. అప్పట్లో శోభన్ బాబు హీరోగా ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులను సందడి చేసింది. మరి ఆ సినిమా విశేషాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను సందడి చేశాయి. ఈ క్రమంలోనే 1972లో వచ్చిన మానవుడు దానవుడు అనే సినిమాలో శోభన్ బాబు హీరోగా నటించారు. ఇందులో శోభన్ బాబు జగన్ అనే పాత్రలో నటించారు. ఇక ఈ పాత్ర అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో చాలామంది తమ పిల్లలకు జగన్ అనే పేరు కూడా పెట్టారు.

ఇక జగన్ పాత్రకు వచ్చిన ప్రేక్షకాదరణ దృష్టిలో ఉంచుకొని దాసరి నారాయణరావు రాజకీయాల నేపథ్యంలో ఓ సినిమాని ప్లాన్ చేశారు. ప్రస్తుతం, మాజీ ముఖ్యమంత్రుల మధ్య డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి జగన్ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయంలో నటించారు.

అభ్యంతరం తెలిపిన సెన్సార్…


ఇక ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత సెన్సార్ వెళ్ళినప్పుడు సినిమాకు అభ్యంతరం వచ్చింది. ఇందులో ముఖ్యమంత్రిని ఉద్దేశించి పలు సన్నివేశాలు ఉండటం చేత సెన్సార్ సభ్యుల నుంచి అభ్యంతరాలు వెలువడ్డాయి. అయితే దాసరి సినిమాలకు ఇలాంటి అభ్యంతరాలు రావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే దాసరి రివిజన్ కోసం ప్రింట్ ముంబైకు వెళ్ళింది. అక్కడ పలు సమస్యలు ఎదురైనా, అనంతరం ఈ సినిమా అనుకున్న తేదీ కన్నా మరికొద్ది రోజులు విడుదలకు వాయిదా పడింది. అలా ఈ సినిమా 1984 మార్చి 10 వ తేదీ విడుదల అయింది. ఇలా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించలేకపోయినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా విడుదల సమయంలో శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రభావం శోభన్ బాబు జగన్ సినిమాపై పడింది.

శోభన్ బాబు కొడుకు ఎంత అందంగా ఉన్నాడో.. హీరోకు ఏ మాత్రం తగ్గని పోలికలతో?

ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గర అయిన హీరో శోభన్ బాబు. ఇతడిని ఆంధ్ర సోగ్గాడని కూడా పిలిచేవారు. అయితే అస్సలు పేరు వచ్చేసి.. ఉప్పు శోభనా చలపతిరావు. కృష్ణాజిల్లా చిన నందిగామ ఇతని స్వగ్రామం.. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం ఉన్నత పాఠశాలలో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. కాలేజీ రోజుల్లో ‘పునర్జన్మ’ నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

అతడికి చిన్నతనం నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం ఉండేదట. తిరువూరులో కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు తను బాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని, మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూశానని చెప్పుకొచ్చాడు. అయితే శోభన్ బాబు మొదట పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు. ఆ సినిమా 1959న విడుదల అయ్యింది కాని విజయవంతం కాలేదు.

తర్వాత అతడు చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించాడు. 1960 లో విడుదల అయిన ఈ సినమా బంపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాతనే అతడికి మంచి పేరు వచ్చింది. అప్పట్లో ఎన్టీఆర్, ఎన్నాఆర్ వంటి పెద్ద స్టార్ లతో అతడు పోటీ పడే వారు. అయితే శోభన్ బాబుకు 1958 వ సంవత్సరంలో శాంతకుమారి అనే ఆవిడను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు జన్మించారు.

అయితే అతడు ఏ ఫంక్షన్ కి వెళ్లినా తన ఫ్యామిలీని పరిచయం చేసిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలు తమ వారసులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సమయంలో శోభన్ బాబు కూడా తన వారసుడిని సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలని.. ఆయన అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ శోభన్ బాబు వారసుడికి సినీ ఇండస్ట్రీ అంటే అస్సలు ఇష్టం లేదట. అందుకే సినీ పరిశ్రమలోకి రావడానికి అతడు అయిష్టత చూపించడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేకపోయారు.