Actress Jayachitra: సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో గ్లామరస్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి జయ చిత్ర ఒకరు.అప్పట్లో ఈమె కృష్ణంరాజు కృష్ణ శోభన్ బాబు వంటి హీరోల సరసన నటించి అద్భుతమైన నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈ విధంగా గట్టిగా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో అద్భుతంగా అవకాశాలను అందుకొని బిజీగా మారిపోయారు.
హీరోయిన్ గా ఎంతో గుర్తింపు పొందినటువంటి జయ చిత్ర సెకండ్ ఇన్నింగ్స్ పవర్ ఫుల్ అత్త పాత్రలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. అయితే తాజాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో వచ్చినటువంటి పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జయచిత్ర ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తాను తన సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు సీరియల్స్ లో కూడా నటించానని తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగులో రాఘవేంద్రరావు బంధువులు తెరకెక్కిస్తున్నటువంటి మంగమ్మగారి మనవడు సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది.ఆ సమయంలో తాను రాజమౌళి గెస్ట్ హౌస్ లో ఉన్నానని ఇలా తనకు అవకాశం రావడంతో తాను ఈ సీరియల్లో చేయడానికి ఓకే చెప్పాను.అయితే అదే సమయంలోనే కొందరు ఉద్దేశపూర్వకంగా తాను ఈ సీరియల్ లో నటించడానికి ఇష్టత చూపలేదని తను ఫారెన్ వెళ్లాలనుకుంటున్నాను అంటూ దర్శకులకు అబద్ధాలు చెప్పారు.
ఇది నిజమే అనుకొని నాకు ఈ సీరియల్లో అవకాశం లేకుండా పోయింది.హీరోయిన్ గా ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు సంపాదించుకున్న తనకు ఈ సీరియల్ మిస్ అవ్వడంతో ఆ అసంతృప్తి తనలో అలాగే ఉండిపోయిందని ఈమె తెలియజేశారు.ఒకవేళ ఈ సీరియల్లో కనుక నేను నటించి ఉంటే తప్పకుండా నాకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించే అవకాశం వచ్చేదని ఆ చిన్న పొరపాటు కారణంగా ఈ అవకాశాన్ని కోల్పోయానంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…