Tag Archives: shriya saran

నేను చనిపోతే ఈ సినిమా చేసాకే చనిపోతా అని ఏఎన్ఆర్ అన్నారు : నటి శ్రియా..!

శ్రియా సరన్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. అయితే చాలా గ్యాప్ తర్వాత శ్రియా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గమనం సినిమాతో డిసెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రియ సరన్ తో పాటుగా శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్య మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా శ్రియా సరన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

20 ఏళ్ళు ఇలా మీ ముందు ఉన్నాను. ఇష్టం నా మొదటి సినిమా. ఆ రోజులు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎంతో ప్రేమ దొరికింది. నేను ఇంత దూరం వచ్చాను అంటే అందుకు గల కారణం ప్రేక్షకుల ప్రేమ. అదే విధంగా నేను చేసిన కొన్ని సినిమాలు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా కొన్ని వర్కవుట్ అవ్వలేదు. నేను సినిమా ఇండస్ట్రీ లో ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీయా.

అదే విధంగా నేను ఎప్పటి వరకు బ్రతికి ఉంటానో.. అప్పటి వరకు నటిస్తూనే ఉండాలి అని సినిమాలు చేస్తూనే ఉండాలి అని అనుకుంటున్నాను. ఏఎన్నార్ గారు చివరి క్షణం వరకు కూడా నటించారు.. మనం సినిమా సమయంలో ఒకవేళ నేను చనిపోతే ఆ సినిమా చేసే చనిపోతాను అని అనేవారు. అలా నేను కూడా చివరిక్షణం వరకూ నటిస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చింది శ్రియా సరన్. నా కూతురు, నా కుటుంబం నా సినిమాలు చూసి గర్వపడేలా ఉండాలని అనుకుంటున్నాను. అదేవిధంగా సినిమాలో ఏ పాత్ర చేసినా కూడా నా మనసుకు నచ్చాలని అనుకుంటున్నాను అని తెలిపింది.

గమనం సినిమా కథ వినగానే వెంటనే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్పుడే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలో నేను దివ్యాంగురాలు పాత్రలో కనిపిస్తాను.. వినిపించదు కానీ మాట్లాడతాను.. ఇందులో నటించడానికి కొన్ని క్లాసులకు కూడా వెళ్లాను.. ఈ సినిమాలో నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణమే నా పాత్ర అని చెప్పుకొచ్చింది శ్రియా శరన్. మనిషిలో జరిగే అంతర్గత,సంఘర్షణ ప్రయాణం గురించి చెప్పేదే ఈ గమనం సినిమా. నిస్సహాయతతో ఉండే మనిషి ఒక్కసారిగా బలం వస్తే వాటిని ఒక్కసారిగా అధిగమించే చేస్తాం. అదేవిధంగా నా డెలివరీ సమయంలో కూడా నాకు ఒక భయం ఉండేది కానీ ఏం కాదు అన్న ధైర్యం నేను తెచ్చుకున్నాను అందువల్లే అంత సాఫీగా సాగిపోయింది అని తెలిపింది.

శ్రీయ సరన్ ప్రెగ్నేన్సీపై.. మంచు లక్ష్మి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

సాధారణంగా ప్రస్తుతం ఏ చిన్న సీక్రెట్ దాచాలని అనుకున్నా ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీస్‌కు సంబంధించిన ఏ విషయమైనా కూడా ఎంత దాచేసినా క్షణాల్లోనే పాకిపోతుంది.. వైరల్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో శ్రియ సరన్ మాత్రం చాలా పెద్ద సీక్రేట్ ఏడాది పాటు దాచేసింది.

కనీసం చిన్న అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడింది. ఉన్నట్లుండి ఈ రహస్యం బయటికి చెప్పిన తర్వాత ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోయారు. ఒక ఆడపిల్లకు జన్మనివ్వడం సంతోషకరమైన విషయమే కానీ.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటే బాగుండేదని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవితంలో అత్యంత ముఖ్యమైన, ఆనందకరమైన విషయాన్ని ఇలా రహస్యంగా ఉంచడంపై ఫ్యాన్స్‌ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఆమె ప్రెగ్నెన్సీని దాచడంపై మంచు లక్ష్మి ప్రసన్న స్పందించింది. శ్రీయ పోస్టుకు ఆమె రీ ట్వీట్ చేసింది. శ్రీయకు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘‘ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయం. నీకు దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా. అలాగే ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పడంలో నువ్వు తీసుకున్న సమయం విషయమై నిన్ను చూసి గర్వపడుతున్నా. ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది నీ వ్యక్తిగత విషయం.

అది అందరికీ సమయానికి చెప్పాల్సిన అవసరం లేదు” అని తెలిపింది. ప్రస్తుతం మంచు లక్ష్మి ట్వీట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌‌ని శ్రీయ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె చాలారోజుల తర్వాత మళ్లీ RRR మూవీలో నటిస్తోంది.

అతి పెద్ద సీక్రెట్ ను దాచిపెట్టిన శ్రీయ.. షాకైన అభిమానులు..?

కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్ గా సినీ పరిశ్రమని షేక్ చేసిన నటి శ్రీయ శరన్. తెలుగులోనే కాదు.. సౌత్ ఇండియా లెవల్లో తన అందాలతో ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.

అందం, అందుకు తగ్గ అభినయం కనబర్చి ఎందరో అభిమానులను కూడగట్టుకున్న ఈ బ్యూటీ. తర్వాత కొంతకాలంగా సరైన అవకాశాలు రాకా ఆమె వెండితెరపై కనిపించలేదు. తర్వాత 2018 సంవత్సరంలో రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్ళాడి సినిమాలకు ఇంకాస్త దూరం అయింది. సినిమాలకు దూరం అయినా సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటూ రొమన్స్ అప్ డేట్స్ ఇస్తూనే వస్తోంది.

ఇదంతా ఇలా ఉండగా ఆమె ఓ పెద్ద సీక్రెట్ ను దాచి పెట్టింది. అదేంటంటే.. 2020 లాక్‌డౌన్‌ సమయంలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వగా.. ఆ విషయాన్ని ఇంతకాలం దాచిపెట్టారు. తాజాగా అభిమానులతో ఆ విషయాన్ని పంచుకున్నారు. అసలు తరచూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీయా.. అసలు ఇంతకాలం ఈ వార్తను ఎలా దాచి పెట్టిందిని అంతా షాక్ అవుతున్నారు. 2020 ప్రపంచం అంతా స్థంభించిపోయింది. ఎక్కడి వాళ్లు అక్కడే కోవిడ్ కారణంగా ఆగిపోయారు.

ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్‌లో ఉండిపోయారు. కరోనాతో ఎందరో ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి సమయంలోనూ తమ జీవితంలో మాత్రం అద్భుతం జరిగిందని తెలిపింది శ్రీయ. ఆ బేబీకి సంబంధించిన ఫొటోలు, తన చిన్నారితో ఆడుకుంటున్న వీడియోని పోస్ట్‌ చేశారు. ఈ మధ్యే మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చేసిన ఈ జంట ముంబైలో ఉంటున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో అజయ్ దేవ్‌గన్ భార్యగా నటిస్తుంది శ్రీయ.

పబ్లిక్ గా భర్తతో రొమాన్స్ చేసిన హీరోయిన్.. వైరల్ గా మారిన వీడియో!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం పాటు తన హవాని కొనసాగించిన ఎంతోమంది స్టార్ నటీమణులలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకొని ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు నటి శ్రియ.కెరియర్ మొదట్లో మోడలింగ్ చేసినటువంటి శ్రియ “ఇష్టం” సినిమా ద్వారా వెండితెరపై సందడి చేశారు.ఈ క్రమంలోనే నాగార్జున సరసన నటించినటువంటి “సంతోషం” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.

ఈ విధంగా కెరియర్ పై ఎంతో ఫోకస్ పెట్టిన శ్రీయ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించింది. ఈ క్రమంలోనే విదేశీ వ్యాపారవేత్తతో ప్రేమ ప్రయాణం సాగించిన ఈమె 2018 లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. ప్రస్తుతం వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న శ్రీయ వివాహం తర్వాత సోషల్ మీడియాలో ఎంతో బిజీగా ఉన్నారు.

నిత్యం తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి దిగినటువంటి రొమాంటిక్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానుల సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఏకంగా బికినీ ధరించి అందాలను ఒలకబోస్తూ ఉన్న ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే తాజాగా శ్రీయ శరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్ ప్లేస్‌లో తీసుకున్నటువంటి వీడియోను ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో శ్రీయ తన భర్త ఆండ్రీతో కలిసి పబ్లిక్ గా ఎంతో రొమాన్స్ చేశారు. ఈ వీడియోలో శ్రేయ పాట పాడుతూ ఉండగా తన భర్త స్టెప్పులు వేశాడు. ఇందులో భాగంగానే పాట పాడుతున్న శ్రీయ ఉమ్మా ఉమ్మా అంటూ తన భర్తను రెచ్చగొట్టడంతో అతను ఏకంగా లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు.ప్రస్తుతం ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది.

బంగార్రాజులో నాగార్జునతో జోడీ కట్టనున్న శ్రీయ..!

గతంలో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో బంగార్రాజు పాత్ర ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బంగార్రాజు టైటిల్ తో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశారు. వీరిద్దరి కాంబోలో బంగార్రాజు సినిమా రాబోతోందని అధికారిక ప్రకటన కూడా చేశారు.అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల లేకపోయింది.

ఈ క్రమంలోనే నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా ఇంకా చిత్రీకరణ ప్రారంభించక ముందే ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బంగార్రాజు సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించనున్నారని వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

తాజాగా ఈ సినిమా గురించి మరొక సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా శ్రీయ నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో సందడి చేయనున్నారని మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాగచైతన్యకు జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జోడి కట్టనున్నారు.

ఇదివరకే నాగార్జున, శ్రీయ పలు సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే బంగార్రాజు సినిమాలో మరోసారి ఈ జోడి తెరపై సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి రావడంతో ఈ సినిమా ఆగస్టు నెలలో సెట్స్ పైకి వెళ్లి చిత్రీకరణ పనులలో బిజీ కానుందని తెలుస్తోంది.

శ్రీయా శరణ్ అందాలా ఆరబోత మాములుగా లేదుగా!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీయ శరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన నటనతో, అందంతో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో నటించింది. ‘ఇష్టం’ సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. 2018లో ఆండ్రూ అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా లేటు వయస్సులో ఘాటు అందాలతో బాగా రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్తతో దిగిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేస్తూ రెచ్చిపోతుంది. తాజాగా తన భర్తతో టూర్ ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన సెల్ఫీలను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకుంది. అందులో ఆమె పింక్ కలర్ బికినీతో హాట్ హాట్ ఫోజ్ లతో అరాచకంగా ట్రీట్ చేస్తుంది శ్రీయ.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీయ శరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

తన నటనతో, అందంతో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.

తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో నటించింది.

‘ఇష్టం’ సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

2018లో ఆండ్రూ అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత కూడా లేటు వయస్సులో ఘాటు అందాలతో బాగా రచ్చ చేస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్తతో దిగిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేస్తూ రెచ్చిపోతుంది.

తాజాగా తన భర్తతో టూర్ ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన సెల్ఫీలను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకుంది.

అందులో ఆమె పింక్ కలర్ బికినీతో హాట్ హాట్ ఫోజ్ లతో అరాచకంగా ట్రీట్ చేస్తుంది శ్రీయ.

మరోసారి రెచ్చిపోయిన శ్రియా శరన్.. ఈసారి ఏకంగా పబ్లిక్ లోనే పచ్చిగా ముద్దులు పెట్టుకుంటూ..!!

సోషల్ మీడియా వాడకంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా మన సెలెబ్రెటీలు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంటూ పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఫుల్ బిజీ అయిపోతున్నారు.. ఇక హీరోయిన్ ల విషయం అయితే అసలు చెప్పనక్కర్లేదు.. తమ అంద చందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు..హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్నారు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొందరు హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్ శ్రియా శరన్ ఒకరు..

వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది. పెళ్ళి తర్వాత కూడా ఈమె అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు కూడా ఇదే చేసింది శ్రియ..ఏకంగా పబ్లిక్ గానే ముద్దులతో రెచ్చిపోయింది ఈ సీనియర్ హీరోయిన్.. ప్రస్తుతం శ్రియా శరన్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.. తన భర్తతో కలిసి ఓ పబ్లిక్ ప్లేస్ లోనే ఘాటు ముద్దులతో రెచ్చిపోయింది ఈ భామ.. ఈ వీడియోలో శ్రియా, తన భర్త ఇద్దరు కలిసి పబ్లిక్ లోనే మాస్క్ తీసి ముద్దులు పెట్టుకుంటున్నారు..

ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ తో ఈ వీడియోని వైరల్ చేస్తుంటే.. మరికొందరు పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి పాడు పనులేంటి అంటూ ఈ హీరోయిన్ పై ట్రోల్స్ చేస్తున్నారు..ఇక గతంలో కూడా ఈ హీరోయిన్ పలు ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే..ఇక శ్రియ సినిమాల విషయానికొస్తే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.. దీనితో పాటు గమనం అనే సినిమాలో కూడా లీడ్ రోల్ పోషిస్తుంది.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..వచ్చేనెల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది…!!

https://telugudesk.net/wp-content/uploads/2021/03/WhatsApp-Video-2021-03-07-at-7.27.21-PM.mp4