Tag Archives: Sitaram

Mrunal Thakur: సీతారామం తర్వాత అందుకే గ్యాప్ వచ్చింది… అసలు విషయం చెప్పేసిన నటి మృణాల్!

Mrunal Thakur: హిందీ సీరియల్స్ లో నటిస్తూ అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని బాలీవుడ్ కే పరిమితమైనటువంటి మృణాల్
ఠాకూర్ తెలుగులోకి సీతారామం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.మొదటి సినిమానే ఇంత మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా ఈమెకు ఈ సినిమా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయారు.

మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మృణాల్ కుతెలుగులో వరుస అవకాశాలు వస్తాయి, ఇక ఈమె బిజీగా మారిపోతారు అని అందరూ అనుకున్నారు అయితే ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అవుతున్న ఇంకా ఈమె తదుపరి సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో ఇలా సీతారామం తర్వాత ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మృణాల్ ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా తర్వాత తాను దర్శక నిర్మాతలను కలిసినప్పుడు వారు నాతో మాట్లాడుతూ మీరు సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. మీకు సినిమా అవకాశాలు ఇవ్వాలంటే సీతామహాలక్ష్మి పాత్ర కన్నా గొప్పగా ఉండాలి అలాంటి పాత్ర రాయడానికి కాస్త సమయం పడుతుంది అంటూ చెప్పేవారని అందుకే తనకు గ్యాప్ వచ్చిందని తెలిపారు.

Mrunal Thakur: సీతా మహాలక్ష్మి పాత్ర కన్నా గొప్పగా ఉండాలి….

ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నాని 30అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాక త్వరలోనే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పనులు ప్రారంభమవుతాయి అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా ద్వారా మృణాల్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Mrunal Thakur: హీరోయిన్లు ఆ విషయంలో ఎప్పుడు మొహమాట పడకూడదు… హీరోయిన్లకు సలహాలు ఇచ్చిన సీతారామం బ్యూటీ!

Mrunal Thakur: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు హీరోయిన్లకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. సినిమాలో వారి పాత్రలకు ఇచ్చే ప్రాధాన్యత నుంచి మొదలుకొని రెమ్యూనరేషన్ల వరకు హీరోలకు అధిక ప్రాధాన్యత కల్పించగా హీరోయిన్లకు మాత్రం హీరోలతో సమానమైన ప్రాధాన్యత ఇవ్వరు.ఇలా హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ వ్యత్యాసం గురించి చర్చించారు.

ఇకపోతే తాజాగా సీతారామం సినిమా ద్వారా తెలుగులో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరోయిన్ల రెమ్యూనరేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చాలా మంది హీరోయిన్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి సంకోచిస్తారని తెలియజేశారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి ఏమాత్రం మొహమాట పడకూడదని మనకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని రెమ్యూనరేషన్ డిమాండ్ చేయాలని ఈమె పలువురు హీరోయిన్లకు సలహాలు ఇచ్చారు.చాలామంది హీరోయిన్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి మొహమాటపడుతున్నారని అయితే ఇది సరైన పద్ధతి కాదని ఈమె తెలిపారు.

Mrunal Thakur: అప్పుడే మన వృత్తి విషయంలో కాన్ఫిడెన్స్ వస్తుంది…


మనకు ఇండస్ట్రీలో ఉన్న పాపులారిటీ ఆధారంగా మన రెమ్యూనరేషన్ మనమే నిర్ణయించుకోవాలని ఇలా నిర్ణయించుకున్నప్పుడే మన వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నామో అర్థమవుతుందని ఈ సందర్భంగా ఈమె హీరోయిన్ల రెమ్యూనరేషన్ గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హిందీలో ఈమె పిప్పా అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె రెమ్యూనరేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mrunal Thakur: ఏంటి సీతారామం హీరోయిన్ ఇలా తయారయింది.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి!

Mrunal Thakur: ఆ సమయంలో చచ్చిపోవాలనుకున్నా… షాకింగ్కా మెంట్స్ చేసిన నటి మృణాల్‌ ఠాకూర్‌!

: సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృనాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్ర ద్వారా ఈమె అద్భుతమైన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇలా సీత పాత్రలో అందరిని మెప్పించిన ఈమెకు రోజురోజుకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోయింది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇదిలా ఉండగా తాజాగా ఈ నటికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ అసలు ఏంటి ఇక్కడ నిజంగానే మృణాల్ ఠాకూరేనా ఉండేది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలో ఈమె గుర్తుపట్టలేని విధంగా నల్లగా మారిపోవడమే కాకుండా తన చర్మం మొత్తం కమలిపోయినట్టు ఉంది.

ఇలా ఈ ఫోటోసోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే కొందరు స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల తనలో ఇలాంటి మార్పులు వచ్చాయని భావించగా మరికొందరు అసలు ఇక్కడ సీతారామం హీరోయిన్ కాదు. ఎవరిదో ఈ ఫోటో, ఆమెది అసలైన ఫోటో కాదంటూ కొట్టి పారేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Mrunal Thakur: నల్లగా మారిపోయిన నటి…

ఈ ఫోటో చూస్తున్న అభిమానులు షాక్ అయ్యి ఈ ఫోటోని వైరల్ చేస్తున్నప్పటికీ ఈ ఫోటో పై ఇప్పటివరకు నటి ఏ విధంగాను స్పందించలేదు.మరి నిజంగానే ఈ ఫోటోలో ఉన్నది ఆమెనా కాదా అనే విషయం తెలియాలంటే ఈ ఫోటో పై నటి స్పందించాల్సి ఉంది.ఇక సీతారామం సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈమెకు తిరిగి నందిని రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాలో చేసే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.

Actor Naresh: సినిమా విడుదలైన రెండో రోజే థియేటర్లు ఖాళీ.. నరేష్ కామెంట్స్ వైరల్!

Actor Naresh: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కరోనాకి ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. దేశంలో కరోనా వ్యాప్తి చెందడంతో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా చాలా నష్టపోయింది. కరోనా కారణంగా సినిమా నిర్మాణ పనులు ఆగిపోయి నటీనటులందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు. కరోనా తగ్గు ముఖం పట్టిన తర్వాత కూడా ప్రేక్షకులు బయటకి వచ్చి థియేటర్లలో సినిమాలు చూడటానికి ఇష్టపడటం లేదు.

థియేటర్లు మూతపడటంతో ఓటీటీ లకు బాగా అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపటం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటిటిలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి నెలలు గడుస్తున్నా కూడా చాలామంది ప్రేక్షకులు ఓటీటీ లలోనే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకు ముఖ్య కారణం సినిమా టికెట్ రేట్లు భారీగా పెరగటమే. బాగా డబ్బున్న వారికి ఈ టికెట్ రేట్లు పెద్ద సమస్య కాదు. కానీ ఒక మధ్య తరగతి కుటుంబం సినిమా చూడాలంటే మినిమం 3 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందువల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం లేదు.

ఇటీవల ఈ విషయంపై నటుడు వి కె నరేష్ స్పందించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రతో ఉన్న రిలేషన్ వల్ల వివాదంలో నిలిచిన నరేష్ చాలాకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాడు. ఇటీవల నరేష్ ఈ విషయం గురించి స్పందిస్తూ ప్రజలు థియేటర్లలో సినిమా చూడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నరేష్ స్పందిస్తూ…సినిమా కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్లకి వచ్చి సినిమాలు చూస్తారు. ఇటీవల విడుదలైన బింబిసారా, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయని వెల్లడించాడు.

Actor Naresh: పాప్ కార్న్ పెప్సీ రేట్లు పెరగడం కూడా..

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడకపోవటానికి టికెట్ రేట్లు పెరగటం ముఖ్య కారణం కావచ్చు .కానీ అదొక్కటే కారణం కాదు. సినిమా టికెట్ రేట్లతో పాటు సినిమా థియేటర్లలో అమ్ముతున్న పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లు కూడా బాగా పెరిగాయి. ఒకప్పుడు రూ.20, రూ.30 లకు దొరికే పాప్ కార్న్, కూల్ డ్రింక్ ధర ఇప్పుడు రూ.200, రూ.300 అయ్యింది. అందువల్ల ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే మొత్తంగా రూ.2500 ఖర్చు పెట్టాల్సిందే! అలాంటప్పుడు ప్రజలు థియేటర్‌కు రావటానికి ఆసక్తి చూపరు. వారు మంచి సినిమాతో పాటు మంచి ఎక్స్‌పీరియన్స్‌ కోరుకుంటారు. అని నరేశ్‌ ట్వీట్‌ చేశాడు.

Sitaramam Movie: సీతారామం వంటి సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..?

Sitaramam Movie: తెలుగు సినిమాలకు ఆగస్టు నెల బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఈ నెలలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల మొదట్లో విడుదలైన బింబిసారా, సీతారామం, కార్తికేయ 2సినిమాలు విడుదలయి ఇప్పటికి భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి.ఇకపోతే హను రాఘవపూడి దర్శకత్వంలో క్లాసికల్ ప్రేమ కథ చిత్రంగా వచ్చిన సినిమా సీతారామం.

ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు.ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోగా నటించాల్సిన అవకాశం సరాసరి దుల్కర్ సల్మాన్ కు దక్కలేదు.కొందరు టాలీవుడ్ హీరోలు ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ఇలాంటి సూపర్ హిట్ సినిమా చేసే అవకాశం ఆయనకు వచ్చింది.

మరి ఇలాంటి సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే.. ఈ సినిమా కథను ముందుగా డైరెక్టర్ హను రాఘవపూడి రౌడీ హీరో విజయ్ దేవరకొండకు వినిపించారట. ఈయన కిఈ సినిమా కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారని ఒకానొక సమయంలో డైరెక్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక విజయ్ దేవరకొండ కాదనడంతో ఈ సినిమా కథతో డైరెక్టర్ హీరో రామ్,నానికి కూడా వినిపించారట.

Sitaramam Movie: ఆ సినిమాల కోసం హిట్ సినిమాని వదులుకున్న హీరోలు…

ఈ విధంగా నాని రామ్ కూడా ఈ సినిమా కథను రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం దుల్కర్ సల్మాన్ కు వెళ్ళింది. ఇలా ఈ సినిమాతో మలయాళ నటుడు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో మన టాలీవుడ్ హీరోలు మాత్రం డిజాస్టర్ సినిమాలు చేయడం కోసం ఈ సూపర్ హిట్ సినిమాని చేతులారా వదులుకున్నారని చెప్పాలి. నాని నటించిన అంటే సుందరానికి సినిమా కూడా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు ఇక రామ్ నటించిన దివారియర్ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఏది ఏమైనా ఈ హీరోలు సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నారని చెప్పాలి.