Mrunal Thakur: హిందీ సీరియల్స్ లో నటిస్తూ అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని బాలీవుడ్ కే పరిమితమైనటువంటి మృణాల్
ఠాకూర్ తెలుగులోకి సీతారామం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.మొదటి సినిమానే ఇంత మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా ఈమెకు ఈ సినిమా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయారు.
మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మృణాల్ కుతెలుగులో వరుస అవకాశాలు వస్తాయి, ఇక ఈమె బిజీగా మారిపోతారు అని అందరూ అనుకున్నారు అయితే ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అవుతున్న ఇంకా ఈమె తదుపరి సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో ఇలా సీతారామం తర్వాత ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మృణాల్ ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా తర్వాత తాను దర్శక నిర్మాతలను కలిసినప్పుడు వారు నాతో మాట్లాడుతూ మీరు సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. మీకు సినిమా అవకాశాలు ఇవ్వాలంటే సీతామహాలక్ష్మి పాత్ర కన్నా గొప్పగా ఉండాలి అలాంటి పాత్ర రాయడానికి కాస్త సమయం పడుతుంది అంటూ చెప్పేవారని అందుకే తనకు గ్యాప్ వచ్చిందని తెలిపారు.
ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నాని 30అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాక త్వరలోనే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పనులు ప్రారంభమవుతాయి అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా ద్వారా మృణాల్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…