Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఈ కార్యక్రమం రేటింగ్ కోసం సుడిగాలి సుదీర్ తో కలిసి పెద్ద ఎత్తున లవ్ డ్రామా నడిపించారు.ఇప్పటికీ సుదీర్ రష్మీ గురించి ఇలాంటి వార్తలు వినపడుతూ ఉన్నప్పటికీ వీరిద్దరూ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే.
ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే రష్మీ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఈమె ఒక నేటిజన్ తనతో మాట్లాడిన విధానం గురించి తెలియజేస్తూ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆ నేటిజన్ రష్మి గురించి మాట్లాడుతూ… రష్మీ హైపర్ ఆదితో వైల్డ్ రొమాన్స్ చేస్తోంది… ఇన్ని రోజులు సుదీర్ తో కేవలం రేటింగ్ కోసమే రొమాన్స్ చేశారు కానీ ఆదినీ రష్మీ ఎంతో ఇష్టపడుతోంది అంటూ కామెంట్ చేయడమే కాకుండా ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.
ఇలా రష్మీ గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తూ తనని ట్యాగ్ చేయడంతో మండిపడిన రష్మీ ఇదివరకు ఈ విధమైనటువంటి వేధింపులను సహించాను ఇకపై ఉపేక్షించేది లేదు పైగా నాకే ట్యాగ్ చేసే అంత ధైర్యం వచ్చింది అంటే ఇక సహించను దీనికి నువ్వు అనుభవిస్తావు అంటూ ఆమె రిప్లై ఇవ్వడంతో వెంటనే భయపడిన నెటిజన్ కాళ్ళ భేరానికి వచ్చి ఏదో పొరపాటున అన్నాను ఇకపై ఇలాంటి తప్పు చేయను ఈసారి క్షమించండి అంటూ బ్రతిమాలాడు.
ఇలా రష్మితో ఇంస్టాగ్రామ్ లో చాట్ చేస్తూ…బుద్ధి తక్కువ అయ్యి ఇలాంటి పని చేశాను నాకు పిల్లలు ఉన్నారు. ఈ ఒక్కసారి క్షమించండి అంటూ వేడుకోగా ఈ క్షమాపణలు సైబర్ క్రైమ్ పోలీసులకు చెప్పుకో అంటూ రష్మీ ఘాటుగా స్పందించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ లను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇతన పై కంప్లైంట్ ఇవ్వాల వద్ద అని ప్రశ్నించారు. అయితే చాలామంది ఈసారికి వదిలేయండి ఇకపై ఇలాంటి తప్పులు చేయరు అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇలా రష్మీ గురించి ఎవరైనా ఇకపై ఇలా మాట్లాడితే కటకటాలు లెక్క పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా రష్మీ చెప్పకనే చెప్పేశారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…