Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ విక్టరీ వెంకటేష్ నటించిన కీసి కా భాయ్… కిసి కీ జాన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా రంజాన్ పండుగ సందర్భంగా ఈనెల 21వ తేదీ విడుదల కానుంది.
ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఏంటమ్మా అనే సాంగ్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇందులో సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ వెంకటేష్ ముగ్గురు పంచ కట్టలో అదిరిపోయే మాస్ పర్ఫామెన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో 48 గంటల్లోనే 43 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టిస్తుంది.
ఇకపోతే తాజాగా ఏంటమ్మా సాంగ్ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ ఈ సినిమాలో డాన్స్ చేయడం గురించి మాట్లాడినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ మాట్లాడుతూ ఏంటమ్మా సాంగ్ చేసేటప్పుడు తెగ ఎంజాయ్ చేసామని తెలిపారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి తాను నటించడం నిజంగానే కల నిజమైనట్లుందని, ఇది మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు.ఇక ఈ పాటను వెండితెరపై చూసినప్పుడు మరింత కిక్ వస్తుందని చరణ్ తెలిపారు.
ప్రస్తుతం చరణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ డాన్స్ వీడియో కూడా వైరల్ గా మారింది.ఇక రాంచరణ్ సినిమాల విషయానికొస్తే ఈయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దుబాయ్ వెకేషన్ లో ఉన్నటువంటి రామ్ చరణ్ తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ పనులతో బిజీగా మారిపోతారు.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…