Tag Archives: spain

Mahesh Babu: 18వ పెళ్లిరోజు సందర్భంగా నమ్రతకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన మహేష్… పెళ్లిరోజు కోసం స్పెయిన్ వెళ్లిన మహేష్ ఫ్యామిలీ!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వరస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మహేష్ బాబు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇకపోతే మహేష్ బాబు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటూనే తనకు ఏమాత్రం విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలకు వెళుతూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.

ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరకడంతో తన భార్య పిల్లలతో కలిసి మహేష్ బాబు స్పెయిన్ వెళ్లారు. అదేవిధంగా మహేష్ బాబు నమ్రతల 18వ వివాహ వార్షికోత్సవం కావడంతో ఈ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ వెళ్లినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టులో మహేష్ ఫ్యామిలీ సందడి చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ బాబు 18వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా తన భార్య నమ్రతకు ఎంతో ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది.ఇక మహేష్ బాబు నమ్రత ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మహేష్ బాబు కన్నా నమ్రత వయసులో పెద్దది అయినప్పటికీ ఈ దంపతులు మాత్రం వీరి జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.

Mahesh Babu: పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నమ్రత..

మహేష్ బాబు నమ్రత వంశీ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగింది. ఇలా ఈ సినిమా అనంతరం వీరిద్దరూ కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న అనంతరం ఈ జంట 2005 వ సంవత్సరంలో అది కొద్ది మంది సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.వివాహం తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ తన ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఓ కోడలిగా భార్యగా అమ్మగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

మొదటి వెడ్డింగ్ యానివర్సరీకీ స్పెయిన్ వెళ్లిన మెగా డాటర్… తనపై ఫిర్యాదు చేసిన భర్త!

మెగా కుటుంబంలో ఎన్నో అల్లరి పనులు చేస్తూ చిలిపిగా ముద్దుగా వుండే నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెగా డాటర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నిహారిక వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అందుకు కారణం తన భర్తకు సినిమాలలో నటించడం ఇష్టం లేదని ఈమె హీరోయిన్ గా దూరమైనప్పటికీ నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు.

ఇక నిహారిక గత ఏడాది డిసెంబర్ 9 వ తేదీ జొన్నలగడ్డ వెంకట చైతన్యని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజులలో వీరి మొదటి పెళ్లి రోజు రావడంతో వీరిద్దరూ వారి పెళ్లి రోజున జరుపుకోవడానికి స్పెయిన్ వెళ్లారు. ఇక స్పెయిన్ లో ఈజంట బార్సిలోనాలోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తూ ఎన్నో ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 

ఇక స్పెయిన్ లో వీరు గడిపిన ప్రతి ఒక్క మూమెంట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ స్కై డ్రైవింగ్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకున్నటువంటి వీడియోను షేర్ చేశారు. అలాగే డిన్నర్ కోసం ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు నిహారిక మాత్రం డిన్నర్ చేయకుండా ఫోన్ లో లీనమైపోయింది. ఈ క్రమంలోనే చైతన్య సెల్ఫీ ఫోటో దిగి ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఎప్పుడు ఇదే పనే ప్రతిక్షణం సెల్ ఫోన్ లో బిజీగా ఉంటుంది అంటూ నిహారిక గురించి ఫిర్యాదు చేశారు.ఈ ఫోటో షేర్ చేసిన మరికాసేపటికి నిహారిక ఫోన్ చూస్తూ ఉన్నటువంటి మరొక ఫోటోను షేర్ చేస్తూ కొన్ని మిలియన్ క్షణాల తర్వాత అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం వీరి స్పెయిన్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు వీరికి ముందుగానే పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

పార్లమెంట్ ను వణికించిన ఎలుకలు.. పరుగులు పెట్టిన ఎంపీలు?

సాధారణంగా పార్లమెంట్ లో వాతావరణం ఎలా ఉంటుంది అంటే అధికార పక్షాలు, ప్రతిపక్షాలు ఉండి అధికార పక్షాన్ని పలు విషయాలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ తీవ్ర గందరగోళంగా ఉంటుంది.ఈ క్రమంలోనే ఏదైనా బిల్లు ఆమోదం పొందడానికి అధికారపక్షం ప్రవేశపెడితే అందుకు నిరసనగా ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనలు చేస్తూ పార్లమెంట్ వాతావరణాన్ని గందరగోళానికి గురి చేస్తాయి. ఎప్పుడు ఎంతో గందరగోళంగా ఉండే ఈ పార్లమెంట్ సభ్యులను ఒక ఎలుక గడగడలాడించింది. పార్లమెంటులో ఎలుకల దూరి ఎంపీలను పరుగులు పెట్టించిన ఘటన స్పెయిన్‌లోని అండలుసియా పార్లమెంట్ లో జరిగింది.

ఈ సందర్భంగా పార్లమెంట్ లో జరుగుతున్న సమావేశంలో భాగంగా సుజానా డియాజ్ అనే రీజినల్ ప్రెసిడెంట్ సెనేటర్‌గా ఎంపికవ్వాలా? వద్దా అనే విషయం గురించి ఓటింగ్ జరుగుతున్న క్రమంలో స్పీకర్ మార్తా బాస్క్వెట్ మాట్లాడుతుండగా.. ఆమెకు పార్లమెంట్ ఆవరణలో ఒక ఎలుక కనిపించడంతో గట్టిగా అరుస్తూ నోరు మూసి పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే పార్లమెంటులో ఎలుక ఉందని గ్రహించిన మిగతా ఎంపీలు అక్కడి నుంచి పరుగులు పెట్టగా మరి కొందరు తమ కుర్చీల పైకి కాళ్ళు పెట్టుకుని అక్కడే కూర్చున్నారు. ఈ విధంగా ఎలుక కనిపించడంతో కొంత సమయం పాటు పార్లమెంట్ వాతావరణంలో అధికార, ప్రతిపక్షాలు గందరగోళం చేశారు. ఈ క్రమంలోనే ఎలుకలు పట్టే సమస్త సహాయ చర్యలతో అక్కడి నుంచి ఎలుకను తీసుకు వెళ్లిన తర్వాత తిరిగి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ఈ విధంగా పార్లమెంట్ వాతావరణంలో ప్రతిపక్షాలు చేయాల్సిన పని చిట్టెలుకలు చేసి గందరగోళం సృష్టించాయి. ఈ క్రమంలోనే ఎలుకను పార్లమెంటు భవనం నుంచి తీసుకెళ్లిన తర్వాత పార్లమెంటు సభ్యులు డియాజ్ కోసం ఓట్లు వేశారు .ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.