Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వరస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మహేష్ బాబు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇకపోతే మహేష్ బాబు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటూనే తనకు ఏమాత్రం విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలకు వెళుతూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.
ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరకడంతో తన భార్య పిల్లలతో కలిసి మహేష్ బాబు స్పెయిన్ వెళ్లారు. అదేవిధంగా మహేష్ బాబు నమ్రతల 18వ వివాహ వార్షికోత్సవం కావడంతో ఈ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ వెళ్లినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టులో మహేష్ ఫ్యామిలీ సందడి చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ బాబు 18వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా తన భార్య నమ్రతకు ఎంతో ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది.ఇక మహేష్ బాబు నమ్రత ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మహేష్ బాబు కన్నా నమ్రత వయసులో పెద్దది అయినప్పటికీ ఈ దంపతులు మాత్రం వీరి జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.
మహేష్ బాబు నమ్రత వంశీ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగింది. ఇలా ఈ సినిమా అనంతరం వీరిద్దరూ కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న అనంతరం ఈ జంట 2005 వ సంవత్సరంలో అది కొద్ది మంది సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.వివాహం తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ తన ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఓ కోడలిగా భార్యగా అమ్మగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…