Tag Archives: srikanth

తప్పుడు ఆరోపణలు చేస్తే అమ్మవారి ఆగ్రహానికి బలవుతారు.. నరేష్ వ్యాఖ్యలపై శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రకాష్ ప్యానల్ పై విష్ణు ప్యానల్ బురద చల్లుకుంటూ పరస్పరం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రకాష్ ప్యానెల్ కు మద్దతు తెలుపుతున్న నాగబాబు గత రెండు రోజుల క్రితం ఓటుకు పదివేలు పంచుతున్నారనే వార్త తన వరకు వచ్చిందని మీడియా ఎదుట వెల్లడించారు.

ఈ క్రమంలోనే మంచు ప్యానెల్ నుంచి నరేష్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఓటుకు 25 వేలు డబ్బులు ఇస్తున్నారని ఒక వీడియో ద్వారా తెలియజేశారు.ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఇస్తున్న డబ్బులను తీసుకుని మంచు విష్ణుకు ఓటెయ్యండి అంటూ ఆయన ఆరోపించారు.

ఈ క్రమంలోనే నరేష్ మాట్లాడిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజు ప్యానల్ నుంచి శ్రీకాంత్ మాట్లాడుతూ నరేష్ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. మేము మందు పంచి, లేక డబ్బులు పంచి గెలవాలని అనుకోలేదు. మీ మనుషులనే పంపించి డబ్బులు ఇచ్చి మా ప్యానెల్ పై బురద చల్లుతున్నారు. అసలే దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి.ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వారు అమ్మవారి ఆగ్రహానికి బలై నాశనం అవుతారంటూ శ్రీకాంత్ నరేష్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం చెప్పారు.

ఇలా మా ఎన్నికలు ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎంతో హోరాహోరీగా జరుగుతున్నాయి.మరి నేడు జరిగే ఎన్నికలలో అధ్యక్ష పదవి ఎవరు కైవసం చేసుకుంటారు అనేది మరి కొన్ని గంటలలో తెలియనుంది. ఈ క్రమంలోనే రెండు ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్ర ఉత్కంఠత ఏర్పడిందని చెప్పవచ్చు.

హీరో శ్రీకాంత్, నరేష్ మధ్య సోషల్ వార్.. వైరల్ అయిన వీడియోలు..

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. అతడు ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ.. కోలుకుంటుంన్నాడు. దీనిపై సినీ ప్రముఖులు వివిధ రకాలుగా స్పందించారు. అందులో మొదట సీనియర్ సినీ నటుడు నరేష్.. ‘సాయి మా ఇంటి దగ్గర నుంచే బైక్ పై వెళ్లాడు. ఈ స్పోర్ట్స్ బైక్ లను వాడొద్దు.. అవి ప్రమాదకరం అని తాము తన కొడుకుకి.. మిగతా వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని అనుకున్నామని’ అన్నాడు.

కానీ ఈ లోపు ప్రమాదం జరిగిందని అన్నాడు. అంతేకాకుండా ఇలా.. రోడ్డు ప్రమదాల్లో బాబూ మోహన్ కుమారుడు, కోట శ్రీనివాసరావు కుమారుడు చనిపోయి.. వాళ్ల కటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చారు అంటూ ఆవేదన చెందాడు. దయచేసి ఎవరు బైక్ నడిపినా జాగ్రత్తగా ఉండాలంటూ.. ఓ వీడియోను పోస్టు చేశాడు నరేష్.

దీనిపై శ్రీకాంత్ తీవ్రంగా స్పందించాడు. చనిపోయిన వారి పేర్లను తీసుకురావడం కరెక్ట్ గా లేదు. మరోసారి ఈ వీడియోలు పెట్టకుండా ఉండటం మంచిది అంటూ సలహా ఇచ్చాడు. నరేష్ వీడియోపై బండ్ల గణేష్ కూడా స్పందించాడు. ఆ వీడియోలో అలా మాట్లాడటం మంచిది కాదని సలహా ఇచ్చాడు.

అయితే శ్రీకాంత్ ఇచ్చిన బైట్ కు నరేష్ తీవ్ర స్థాయిలో మండపడ్డాడు. ‘నువ్వే ఆలోచించి మాట్లాడు.. నా బైట్స్ మీద నువ్వు ఇచ్చిన బైట్ చూశాను. ఏంటమ్మా నువ్వు ఎందుకు అలా ఇచ్చావ్.. నువ్వు ఇచ్చిన బైట్ నాకు నచ్చలేదు. నా కళ్ల ముందు హీరోగా వచ్చావు.. జాగ్రత్త’ అంటూ.. మరో వీడియోను నరేష్ పోస్టు చేశాడు. ఇలా ఈ వీరిద్దరి మధ్య సోషల్ వార్ జరిగింది.

చనిపోయిన వాళ్ళతో పోల్చడం ఏంటి..? కాస్త ఆలోచించి మాట్లాడండి : నటుడు శ్రీకాంత్

శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు ఆయనను పరామర్శించి ఆయన ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ నటుడు నరేష్ సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

యువత కేవలం అతివేగం కారణంగా ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ విధమైనటువంటి యాక్సిడెంట్స్ వల్ల ఎంతో మంది చనిపోయారు అంటూ మాట్లాడటంతో నటుడు నరేష్ వ్యాఖ్యలను పలువురు సెలబ్రిటీలు తప్పుబడుతున్నారు. ఇప్పటికే ఈ విషయం గురించి బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేస్తూ ఇలాంటి సమయంలో రాజకీయాలు వద్దు..ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆ పరమేశ్వరుడిని ప్రార్థించి క్షేమంగా బయటకు రావాలని కోరుకోవాలి తప్ప మరణించిన వారి గురించి ప్రస్తావించకూడదని తెలిపారు.

ఈ విధంగా నరేష్ చేసిన వ్యాఖ్యలకు హీరో శ్రీకాంత్ స్పందించారు.. ఈ సందర్భంగా సాయి ధరమ్ రోడ్డు ప్రమాదం గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.. సాయి తేజ్ కు జరిగినది కేవలం చిన్న యాక్సిడెంట్.. ఇది కామన్ గా జరిగేది. రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయ్యి కింద పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఆయన తొందరగా కోలుకుంటారు.. కోలుకొని సురక్షితంగా బయటపడాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ శ్రీకాంత్ తెలియజేసారు.

అదే విధంగా ఎవరైనా వీడియో బైట్లు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి. సాయి ధరమ్ తేజ్ ఏంటో నాకు తెలుసు ఆయన ర్యాష్ డ్రైవింగ్ చేసే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి గురించి ఈ టైంలో ఈ విధంగా మాట్లాడటం తప్పుకాదు. ఈ సమయంలో తన కుటుంబం ఎంతో కంగారుగా బాధతో ఉంటారు. ఇలాంటప్పుడు మరణించిన వారి పేర్లు బయటకు తీసుకు రావడం మంచిది కాదు ఎందుకో నాకు నరేష్ గారు పెట్టిన బైట్ నచ్చలేదు ఇకపై ఎవరైనా ఇలాంటి బైట్లు పెట్టేముందు దయచేసి ఆలోచించండి పెట్టండి ఈ విధంగా మరణించిన వారి పేర్లను ప్రస్తావించి అందరినీ బాధ పెట్టకండి అంటూ శ్రీకాంత్ తెలియజేశారు.

నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన శ్రీకాంత్.. ఎవరూ గుర్తుపట్ననే లేదట..!

పోసాని కృష్ణ‌ముర‌ళి ఎంతటి విలక్షణ నటుడో అందరికీ తెలిసిందే. ఒక దర్శకుడిగా, ఒక నటుడిగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. దర్శకత్వం వహించి ఎన్నో సినిమాలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాయి.

అందులో 2007 సంవత్సరంలో విడుదలైన ‘ఆపరేషన్ దుర్యోదన’ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అందులో శ్రీకాంత్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో ఓ నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. రాజకీయ నేపథ్యంలో తీసిన ఈ సినిమా కొంత కాంట్రవర్సీలకు వెళ్లినా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ సినిమకు హైలెట్ గా నిలిచే సీన్ ఏంటంటే.. శ్రీకాంత్ నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం. అది శ్రీకాంత్ ఎలాంటి డూప్ లేకుండా చేశాడట. దాని వెనుక ఏం జరిగిందో వివరాల్లోకి వెళ్తే.. మొదట పోసాని ఈ కథ గురించి శ్రీకాంత్ కు చెబుతున్న సమయంలోనే ఈ సీన్ క్లియర్ గా వినిపించాడట. ఈ సీన్ సినిమాకు పెద్ద ప్లస్ అని.. ఈ సీన్ పైనే కథ ఆధారపడి ఉంటుందని చెప్పగానే.. చేసేద్దామని.. శ్రీకాంత్ ఒప్పుకున్నాడు.

కానీ అది హైదరాబాద్ లో తీసే సీన్. శ్రీకాంత్ ను ఎవరైనా గుర్తుపడితే ఎలా అనే సందేహంతోనే.. సీన్ ను మొదట చార్మినార్ దగ్గర చేశారట. కానీ అతడిని ఎవరూ గుర్తుపట్టలేదు. తర్వాత అమీర్ పేట్ లో కూడా ఆ సీన్ ను తీశారు. శ్రీకాంత్ వేషధారణ వల్ల ఎవరో పిచ్చివాడు అనుకున్నారే తప్ప అతడిని ఎవరూ గుర్తుపట్టలేదు. తీరా సినిమా విడుదలైన తర్వాత ఆ సీన్ చూసిన వాళ్లకు అర్థం అయింది.. అక్కడ ఆ సమయంలో జనం మధ్యలో నుంచి వెళ్లింది శ్రీకాంత్ అని. నిజంగా ఈ సన్నివేశం సినిమాకి హైలెట్ అయ్యింది.

వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో కూతురు?

సినీ ఇండస్ట్రీకి చాలా వరకు వారసులే పరిచయమయ్యారు. ఇప్పటికే ఎంతోమంది నటీనటుల కూతుర్లు, కుమారులు పరిచయం కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. పలువురు స్టార్ హీరోల కూతుర్లు పరిచయం కాగా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలువలేక పోయారు. అందులో మంచు లక్ష్మి, ఘట్టమనేని మంజుల, నిహారిక కొణిదెల ఎక్కువ అవకాశాలు అందుకోలేకపోగా.. మరికొంతమంది వారసురాలు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో స్టార్ హీరో కూతురు వెండితెరకు పరిచయం కానుంది.

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని సినిమాలలో నెగటివ్ పాత్రల్లో కూడా నటించాడు. ఇక ఈయన భార్య ఊహ కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. వీరికి ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇప్పటికే శ్రీకాంత్ తన పెద్ద కొడుకు రోషన్ ను వెండితెరకు పరిచయం చేశాడు. నిర్మలా కాన్వెంట్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు రోషన్. ఇక ప్రస్తుతం రాఘవేంద్ర దర్శకత్వంలో పెళ్లి సందD సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది. ఇక త్వరలోనే శ్రీకాంత్ తన కూతురు మేధా ను వెండితెరకు పరిచయం చేయనున్నాడు.

ఇదివరకే మేధ.. అనుష్క నటించిన పాన్ ఇండియా మూవీ రుద్రమదేవి సినిమాలో బాల నటిగా పరిచయమైంది. ఇందులో మేధ రుద్రమదేవి చిన్నప్పటి పాత్రలో నటించగా తన నటనకు మంచి సక్సెస్ అందుకుంది. త్వరలోనే హీరోయిన్ గా పరిచయం కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తను భరతనాట్య నృత్యకారిణి గా శిక్షణ తీసుకుంది. ఇక తన చదువులు పూర్తయిన వెంటనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది. శ్రీకాంత్ కూడా తన కూతురును పరిచయం చేయడానికి మంచి దర్శకుడు కోసం ప్రొడక్షన్ హౌస్ కోసం ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ హీరోయిన్ గా అడుగు పెడితే మాత్రం మంచి సక్సెస్ అందుకుంటుదనే అనిపిస్తుంది.

ప్రియుడి మరణ వార్త విని విషపు గుళికలు మింగిన ప్రియురాలు!

సాధారణంగా ఇద్దరూ ప్రేమించుకున్నారంటే వారి పెళ్లికి అంగీకరించడానికి పెద్దలు ఒప్పుకోరు. ఈ విధంగా పెద్దలు ఒప్పుకోని నేపథ్యంలో ఆ జంట ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం లేదా తమ తల్లిదండ్రులకు చెడ్డపేరు రాకూడదనే భావనతో వారిరువురు కలిసి ఉండలేక చనిపోవాలనే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎంతోమంది తమ జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్నారు.

తాజాగా గుంటూరు జిల్లాలోని ఉండ్రాళ్ల మండలం యల్లాయపాలెంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అయితే ఈ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు సౌమ్య అనే యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో పెద్దవారికి చెప్పడంతో వీరి ప్రేమకు పెద్దలు అనుమతిచ్చారు. ఈ క్రమంలోనే తమ ప్రేమ పండిందని త్వరలోనే వారిద్దరూ ఒక్కటి కాబోతున్నారని ఆ జంట ఎంతో సంబరపడింది.

అయితే వారి ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. శ్రీకాంత్ అనే యువకుడు ఓ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ డెకరేషన్ కోసం వెళ్ళాడు. ఎలక్ట్రిక్ డెకరేషన్ చేస్తున్న క్రమంలో శ్రీకాంత్ కరెంట్ షాక్ తగిలి మరణించాడు.తాను ప్రేమించిన వ్యక్తి జీవితాంతం తనకు తోడుగా ఉంటానన్న వ్యక్తి ఇలా అర్ధాంతరంగా చనిపోయాడని తెలియడంతో ప్రియురాలు సౌమ్య ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది.

ఈ క్రమంలోనే శ్రీకాంత్ లేని జీవితం తనకు అవసరం లేదని విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది.ఈవిధంగా ఆత్మహత్యకు పాల్పడిన సౌమ్య ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే సౌమ్య ప్రాణాలను కోల్పోయింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమకు గుర్తుగా వీరిద్దరి శవాలు ఒకేచోట ఖననం చేశారు. ఈ విధంగా ప్రేమజంట ఒకేసారి చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

తెల్లారితే పెళ్లి.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే?

తెల్లారితే ఆ ఇంట్లో పెళ్లి కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు బంధువులు రావడంతో ఆ ఇంట్లో పెళ్లి కళ ఉట్టిపడుతుంది. తెల్లవారగానే పెళ్లి కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లి పందిరి వేయడం పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. కేవలం కొన్ని గంటలలో వధువు మెడలో మూడు ముళ్ళు వేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన వరుడు ఎవరికి అందని లోకాలకు చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు పెళ్లి పనులలో బిజీగా ఉండగా వరుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలం మెదక్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్‌పల్లికి చెందిన పట్టెబర్ల యాదమ్మ, లింగయ్యల చిన్న కుమారుడు శ్రీకాంత్‌గౌడ్‌(25)కు కందుకూర్‌ మండలంలోని ఓ అమ్మాయితో ఈనెల 4వ తేదీన వివాహం నిశ్చయమైంది. అతని వివాహం కోసం కొత్త ఇంటిని నిర్మించడంతో కొత్త ఇంటి దగ్గర వివాహ కార్యక్రమాలు మొదలయ్యాయి.

బంధువులందరికీ కొత్త ఇంటి దగ్గరికి చేరుకొని పందిరి వేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఉదయమే పెళ్ళికొడుకుని చేయాల్సి ఉండగా బంధువులు అందరూ వరుడు శ్రీకాంత్ ను వెళ్లి పాత ఇంటిలో నిద్ర పోవలసిందిగా సూచించారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ పాత ఇంటి దగ్గరికి వెళ్లి పడుకున్నాడు.

శ్రీకాంత్ అన్న రాజు శ్రీకాంత్ దగ్గరకు వెళ్లి పెళ్లి పందిరి వేయడానికి పందిరి కొమ్మలు తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి ద్విచక్ర వాహనంలో వెళ్లారు. అయితే తన అన్న రాజు తిరిగి వచ్చేలోపు శ్రీకాంత్ ఉరివేసుకుని కనిపించాడు. తెల్లారితే పెళ్లి పెట్టుకొని వరుడు శ్రీకాంత్ ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల సభ్యులు ఎంతో షాక్ కి గురయ్యారు.ఈ క్రమంలోనే తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్రీకాంత్ ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి అనే కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.