సాధారణంగా ఇద్దరూ ప్రేమించుకున్నారంటే వారి పెళ్లికి అంగీకరించడానికి పెద్దలు ఒప్పుకోరు. ఈ విధంగా పెద్దలు ఒప్పుకోని నేపథ్యంలో ఆ జంట ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం లేదా తమ తల్లిదండ్రులకు చెడ్డపేరు రాకూడదనే భావనతో వారిరువురు కలిసి ఉండలేక చనిపోవాలనే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎంతోమంది తమ జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్నారు.
తాజాగా గుంటూరు జిల్లాలోని ఉండ్రాళ్ల మండలం యల్లాయపాలెంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అయితే ఈ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు సౌమ్య అనే యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో పెద్దవారికి చెప్పడంతో వీరి ప్రేమకు పెద్దలు అనుమతిచ్చారు. ఈ క్రమంలోనే తమ ప్రేమ పండిందని త్వరలోనే వారిద్దరూ ఒక్కటి కాబోతున్నారని ఆ జంట ఎంతో సంబరపడింది.
అయితే వారి ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. శ్రీకాంత్ అనే యువకుడు ఓ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ డెకరేషన్ కోసం వెళ్ళాడు. ఎలక్ట్రిక్ డెకరేషన్ చేస్తున్న క్రమంలో శ్రీకాంత్ కరెంట్ షాక్ తగిలి మరణించాడు.తాను ప్రేమించిన వ్యక్తి జీవితాంతం తనకు తోడుగా ఉంటానన్న వ్యక్తి ఇలా అర్ధాంతరంగా చనిపోయాడని తెలియడంతో ప్రియురాలు సౌమ్య ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది.
ఈ క్రమంలోనే శ్రీకాంత్ లేని జీవితం తనకు అవసరం లేదని విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది.ఈవిధంగా ఆత్మహత్యకు పాల్పడిన సౌమ్య ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే సౌమ్య ప్రాణాలను కోల్పోయింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమకు గుర్తుగా వీరిద్దరి శవాలు ఒకేచోట ఖననం చేశారు. ఈ విధంగా ప్రేమజంట ఒకేసారి చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…