Tag Archives: srinu vaitla

Varun Tej-Lavanya Thripaati: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమ పెళ్లికి ఆ డైరెక్టర్ కారణమా?

Varun Tej-Lavanya Thripaati: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో నిజం లేదంటూ లావణ్య ఖండించినప్పటికీ వరుణ్ తేజ్ మాత్రం మౌనంగా ఉన్నారు.

ఈ విధంగా వీరి ప్రేమ వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీ వీరిద్దరూ నిశ్చితార్థం ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది.

ఇలా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకకు ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానం కూడా అందిందని సమాచారం. ఇలా వీరి నిశ్చితార్థ ఏర్పాట్లలో కూడా కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారని తెలుస్తోంది అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు ప్రేమలో పడటానికి ఒక టాలీవుడ్ డైరెక్టర్ కారణమని ఆయన కారణంగానే వీరిద్దరు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.

Varun Tej-Lavanya Thripaati: శ్రీను వైట్ల కారణమా…

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమకు డైరెక్టర్ శీను వైట్ల కారణమని తెలుస్తుంది. ఈయన దర్శకత్వంలో వీరిద్దరూ మిస్టర్ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే లావణ్య త్రిపాఠి వరుణ్ మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమ ఇప్పుడు పెళ్లికి దారి తీసిందని తెలుస్తుంది. ఇలా మిస్టర్ సినిమాకి శీను వైట్ల డైరెక్టర్ కావడంతో ఆయన కారణంగానే వీరి మధ్య ప్రేమ చిగురించిందంటూ వస్తున్నటువంటి ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Srinu Vaitla: వారు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను.. వైరల్ అవుతున్న శ్రీను వైట్ల పోస్ట్?

Srinu Vaitla: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ శీను వైట్ల ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆనందం,సొంతం రెడీ దూకుడు వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న శీను వైట్ల ఆగడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఎదుర్కొన్నారు. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల పలు సినిమాలకు దర్శకత్వం వహించిన అతనికి పెద్దగా గుర్తింపు రాకపోవడంతో పూర్తిగా ఈయనకు అవకాశాలు తగ్గిపోయాయి.

ఇలా అవకాశాలు లేక గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి శ్రీను వైట్ల అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సమయంలోనే ఆయన భార్య రూప తనకు ఊహించని షాక్ ఇచ్చింది.గత కొన్ని సంవత్సరాల నుంచి రూప శ్రీనువైట్ల దగ్గర లేదని ఆమె విడిగా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రూప తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.

ఇకపోతే తాజాగా శ్రీను వైట్ల సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.శ్రీను వైట్ల తన ముగ్గురు కూతుర్లతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

కూతుర్లతో ఉన్న ఫోటోని షేర్ చేసిన శ్రీను వైట్ల…

ఈ సందర్భంగా శ్రీనువైట్ల ఈ ఫోటోని షేర్ చేస్తూ జీవితం చాలా అందంగా ఉంటుంది అయితే మనం ప్రేమించిన వాళ్లతో ఉంటే మరింత అందంగా ఉంటుంది.ఈ ముగ్గురు లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేను అంటూ శ్రీనువైట్ల తన కూతుర్లతో దిగిన ఫోటోని షేర్ చేశారు. అయితే ఇక్కడ తన భార్య లేకపోవడంతో నిజంగానే శ్రీనువైట్ల రూపా మధ్య గొడవలు ఉన్నాయని తను వేరుగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Srinu Vaitla: సమస్యల చిక్కుముడిలో శ్రీను వైట్ల… విడాకులంటూ షాక్ ఇచ్చిన భార్య.. పాపం శ్రీను?

Srinu Vaitla:. శ్రీను వైట్ల టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరు.గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన సీను వైట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుని దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి దూకుడు ప్రదర్శించాయి.

ఇలా సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈయనకు మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా నుంచి వరుస అపజయాలు వెల్లువెత్తాయి. ఈ విధంగా వరుస ఫ్లాప్ సినిమాలు రావడంతో ఈయనకు ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. అయితే గత కొంతకాలం నుంచి ఈయన విష్ణు హీరోగా నటించిన ఢీ సినిమా సీక్వెల్ ద్వారా రాబోతున్నారని వార్తలు వచ్చాయి.

ఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు కూడా శీను వైట్లను పూర్తిగా పక్కన పెట్టేశారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేక సమస్యలు నడుమ చిక్కుకున్న శ్రీను వైట్ల తాజాగా మరొక సమస్య ద్వారా వార్తల్లో నిలిచారు. శీను వైట్ల భార్య రూపా గురించి మనకు తెలిసిందే. ఈమె శ్రీను వైట్ల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించేది.

విడాకులకు అప్లై చేసిన రూప…

ఈ విధంగా వీరిద్దరూ ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల గత నాలుగు సంవత్సరాల నుంచి శ్రీను వైట్ల రూపా ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని అయితే తాజాగా ఈమె విడాకుల కోసం నాంపల్లి కోర్టుకు అప్లై చేశారని వార్తలు రావడంతో ఒక్కసారిగా ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ఇక ఈ విషయం తెలిసిన ఎంతోమంది అభిమానులు ఒకవైపు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న శీను వైట్లకు ఇలా విడాకుల సమస్య రావడం ఏంటి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అతనికి కాల్ చేసిన సమంత.. ఏడుస్తూ ఎం చెప్పారో తెలుసా..?

సమంత గురించి తెలియని వాళ్లు ఉండరు. ఆమె మొదటగా మోడలింగ్ లో అడుగు పెట్టి 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. కానీ ఆమె తొలి చిత్రం 2010లో ఓ ఏమాయ చేశావే చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తమిళంలో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత తెలుగులో బృందావనం సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించారు. తర్వాత 2011లో దూకుడు తర్వాత.. ఇంకెన్నో సినిమాల్లో నటించారు. బృందావనం, దూకుడు సినిమాలు ఆమెకు స్టార్ హోదా తెచ్చిపెట్టాయి. దూకుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను శ్రీను వైట్ల వెల్లడించారు. ఈ సినిమాను ఇస్తాంబుల్ లో షూట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే అక్కడ ఒక రోజు వాళ్లకు షూటింగ్ లేదు. ఆ సమయంలో సమంతకు షాపింగ్ కు వెళ్లమని శ్రీనువైట్ల సూచించాడు. అతడు చెప్పిన విధంగానే ఆమె షాపింగ్ కు వెళ్లింది. అలా ఆమె షాపింగ్ కు వెళ్లిన కొన్ని నిమిషాల తర్వాత ఓ ఘటన జరిగింది. అదేంటంటే.. ఆమె ఎదురుగా ఓ ఆత్మాహుతి జరిగిందని.. దీంతో ఆమె భయపడి పోయి తనకు కాల్ చేసి ఏడుస్తూ చెప్పినట్లు శ్రీనువైట్లు చెప్పాడు.

కాని అక్కడ ఆమె మానవ బాంబ్ ను చూశారట. ఇదిలా ఉండగా.. ఇస్తాంబుల్ లో తాము స్టే చేసిన బిల్డింగ్ 36వ అంతస్తులో ఉండగా.. భూకంపం వచ్చినట్లు తెలిపాడు శ్రీనువైట్ల. అక్కడ చాలావరకు ఇబ్బందులకు గురయ్యామని.. అయినా సమంత ఎక్కడా డిస్టబెన్స్ కాకుండా.. తనకు ఇచ్చిన పాత్రకు 100 శాతం న్యాయం చేశారని చెప్పారు.