Tag Archives: Sunny

బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉన్న కంటెస్టెంట్ లు వీళ్లే..?

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ చూస్తుండగానే చివరి దశకు చేరుకుంది.ఈ క్రమంలోనే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉండడం కోసం హౌస్ లో ఉన్నటువంటి ఏడు మంది కంటెస్టెంట్ లో పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్ టు ఫినాలే రౌండ్ లో భాగంగా ఫినాలే కు చేరుకోవడానికి కంటెస్టెంట్ లు ఎంతో కష్టపడి ఇప్పటికీ కోలుకోలేకుండా ఉన్నారు.

ఇలా టాస్క్ లో పాల్గొన్న సిరి శ్రీ రామచంద్ర ఇప్పటికీ కాళ్లకు కట్లు కట్టుకుని ఇతరుల సహాయంతో ఫిజికల్ టాస్క్ లలో పాల్గొంటున్నారు.ఇలా ఇతరుల సహాయంతో ఆడిన శ్రీరామచంద్ర టికెట్ టు ఫినాలే రౌండ్లో మొదటి వ్యక్తిగా ఫీనాలేకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే టాప్ త్రీ కంటెస్టెంట్ గా శ్రీరామచంద్ర, లేదా మానస్ లలో ఒకరు సన్నీ ,షణ్ముఖ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే లేడీ కంటెస్టెంట్ లో సిరి, kajal వీరిలో ఎవరో ఒకరు కంటెస్టెంట్ గా వెళ్ళబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ లో పింకీ ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి.అయితే గత వారం రవి ఎలిమినేషన్ ఊహించని విధంగా జరగడంతో ఈ వారం ఎలిమినేషన్ పై ప్రతి ఒక్కరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈవారం ఎలిమినేషన్ లో బయటకు ఎవరు వస్తారనే విషయం తెలిస్తే టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్ లు ఎవరు తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే ఈవారం ఎలిమినేషన్ పై ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక టాప్ ఫోర్ లో నలుగురు అబ్బాయిలు ఉండగా టాప్ ఫైవ్ లో లేడీ కంటెస్టెంట్ ఉంటున్నట్లు తెలుస్తుంది మరి ఆ లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలియాల్సి ఉంది.

ఈవారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ లు వీళ్ళే.. ఆ కంటెస్టెంట్ పై ఎలిమినేషన్ వేటు పడనుందా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం 19మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైంది.ఇప్పటికే 12 వారాలను పూర్తిచేసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి 12 మంది ఎలిమినేట్ కాగా ఇక కేవలం ఏడు మంది మిగిలారు. 13వ వారంలో భాగంగా సన్నీ, షణ్ముఖ్ మినహా శ్రీరామచంద్ర, మానస్, సిరి, కాజల్, పింకీ నామినేషన్స్ లో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లనున్నారు అనే విషయంపై ఎంతో ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈవారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లో డేంజర్ జోన్ లో పింకీ, కాజల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గత వారంలో మాదిరి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన రవి బయటకి రావడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే ఈ వారం ఎవరు బయటకు వెళ్లనున్నారు అనే విషయం గురించి ఎంతో ఆతృత నెలకొంది. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం పింకీ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరి ఈ వారం అనుకున్న విధంగానే పింకీ బయటకు వస్తుందా లేకపోతే గత వారం మాదిరిగా ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ఆమె స్థానంలో మరెవరినైనా బయటకు పంపుతారా అని ఎంతో ఆతృతగా ఉంది. మరి బిగ్ బాస్ ఈవారం ఎవరిని బయటకు పంపుతారో తెలియాల్సి ఉంది..

సన్నీ పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయినే.. రివీల్ చేసిన సన్నీ ఫ్రెండ్..

మొదట బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన 19 మంది కంటెస్టెంట్లలో ఎక్కువగా పరిచయం లేని వాళ్లే ఉన్నారు. అయితే అందులోకూడా పరిచయం ఎక్కువగా ఉన్నవాళ్లు దాదాపు బయటకు వచ్చారనే చెప్పాలి. అయితే హౌస్ లో కి ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన సన్నీకి.. ఐదు వారాలు అయిపోయిన తర్వాత అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

మొదటి ఐదు వారాలు షణ్ముఖ్ జశ్వంత హాట్ ఫేవరెట్ గా ఉండగా.. అతడిని సన్నీ ఓట్ల పరంగా దాటేశాడనే చెప్పాలి. ఈ విషయం మొన్న ఫ్యామిలీ సభ్యులు వచ్చిన సమయంలో స్పష్టంగా అర్థం అయింది. టాప్ లో ఎవరు ఉంటారో టాప్ 5 మెంబర్స్ ను చెప్పమనగా చాలామంది సన్నీని టాప్ లో చూపించారు. దీంతో హౌస్ లో ఉన్న సభ్యులకు కూడా సన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని అర్థం అయిపోయింది.

దీంతోనే కాజల్ లాంటి వాళ్లు అతడితో స్నేహం చేయడం ప్రారంభించారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో అందరి డ్రెస్సింగ్ స్టైల్ కంటే.. సన్నీ స్టైల్ వెరైటీగా ఉంటుంది. పూల చొక్కాలు.. బొమ్మల బొమ్మల ప్రింటింగ్.. తలపై టోపీ ఇవన్నీ సన్నీకి సూట్ అయినట్టుగానే ఉంటూ ఫన్ జనరేట్ అయ్యేలా ఉంటాయి. అయితే సన్నీకి వారం వారం బట్టలు డిజైన్ చేసి పంపడం కోసం బయట ఒక గ్రూప్ ఉందట.

ఇలా వారం వారం అతడి డ్రెస్స్ కు డిజైన్ చేసి పంపేది మేమే అంటూ.. అతని స్నేహితుడు నరేష్ అన్నాడు. సన్నీకి పూల చొక్కాలు బాగా సెట్ అవుతున్నాయి. అందుకే అలాంటి వాటినే ప్రిఫర్ చేస్తున్నామన్నాడు. ఇక సన్నీకి ఎలాంటి లవ్ స్టోరీ లేదని.. వాళ్ల అమ్మ చూపించిన అమ్మాయిని మాత్రమే చేసుకుంటానని తన అమ్మ (కళావతి)కి మాట ఇచ్చాడని చెప్పాడు. అతడి పెళ్లి విషయం మొత్తం వాళ్ల అమ్మదే అంటూ చెప్పుకొచ్చాడు.

టికెట్ టు ఫినాలే లో మళ్లీ గొడవపడ్డ సిరి సన్నీ.. టాప్ లో మానస్!

బిగ్ బాస్ కార్యక్రమం చూస్తుండగానే చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోని కంటెస్టెంట్ ల మధ్య నువ్వా నేనా అన్నట్టు గా పోటీ నెలకొంది ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో భారీగా తలపడుతున్న కంటెస్టెంట్ లకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్ అంటూ కంటెస్టెంట్ లకు శుభవార్త చెప్పారు.

ఈ టాస్క్ లో భాగంగా ఎవరైతే గెలుస్తారోవాళ్ళు డైరెక్ట్ గా ఫినాలేకి వెళ్లే అవకాశం దక్కుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ టాస్క్ లో భాగంగా మొదటి లెవెల్ జరుగుతుంది. ఈ లెవెల్ లో భాగంగా కంటెస్టెంట్ లు ఐస్ క్యూబ్ పై నిలబడాల్సి ఉంటుంది. ఇలా ఐస్ క్యూబ్ పై నిలబడుతూ పక్కవారి బంతులను లాక్కోవాలి. ఇక టాస్క్ లో భాగంగా మరోసారి సన్నీ, సిరి మధ్య గొడవ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ టాస్క్ కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఇందులో సిరి, సన్నీ మధ్య గొడవ చోటు చేసుకోవడంతో సిరి గట్టిగా ఏడ్చినట్టు తెలుస్తుంది. ఇక సన్నీ సిరిని ఉద్దేశించి ఒకరిని విలన్ చేయడానికి తాను సిద్ధంగా ఉంటుందని అన్నారు.

సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ టాస్క్ లో భాగంగా మానస్ అధిక పాయింట్లతో గెలిచాడని తెలుస్తోంది. మరి ఈ టికెట్ టు ఫినాలే రౌండ్ లో ఎవరు గెలుస్తారు ఫైనల్స్ కి ఎవరు వెళ్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ వారం నామినేషన్లు భాగంగా సన్నీ, షణ్ముఖ తప్ప మిగిలిన ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు అయితే వీరిలో ఎక్కువగా సిరి లేదా ప్రియాంక ఈ వారం ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.

ఈవారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ మరొక రెండు వారాలలో చివరి దశకు చేరుకోనుంది.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్, సన్నీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా నడుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు. బిగ్ బాస్ టైటిల్ అబ్బాయిలదే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హౌస్ లో మొదటి నుంచి సన్నీ అగ్రిసీవ్ గా ఆడుతుండటంతో సన్నీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

ఇక చూస్తుండగానే బిగ్ బాస్ షో 12 వారాలు విజయవంతంగా పూర్తిచేసుకుని 13వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ట్రోపి కోసం షన్ను, సన్నీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇక అదే సమయంలో శ్రీరామ్, మానస్ లను కూడా పక్కన పెట్టడానికి లేదు. మానస్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇక మరొక మూడు వారాల్లో టైటిల్ విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది.

ఇక 13 వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. అయితే ఈసారి డేంజర్ జోన్ లో కాజల్, ప్రియాంక, సిరి లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా జరిగిన ఎలిమినేషన్ చివరి అంచుల వరకు వెళ్లి వచ్చిన కాజల్ ఎలిమినేట్ అయ్యే ఆస్కారం లేదని, కాబట్టి మిగిలిన ఇద్దరూ సిరి, ప్రియాంక లలో ఎవరో ఒకరు అవుట్ అవుతారు అని అంటున్నారు.

ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రతి ఎలిమినేషన్ కి రెండు రోజుల ముందు నుంచే ప్రచారం జరుగుతున్నట్లుగానే ఊహాగానాలు నిజమే అవుతున్నాయి. ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు కనుక నిజం అయితే ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

టికెట్ టు ఫినాలే ఛాన్స్ ఎవరికీ..? మొదటి ఛాలెంజ్ విన్నర్ వాళ్లేనా.?

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఎట్టకేలకు 12 వారాలు పూర్తి చేసుకొని.. 13 వ వారంలోకి అడుగుపెట్టింది. 19 మంది హౌస్ లోకి అడుగుపెట్టగా.. 13 వ వారం వచ్చేసరికి షణ్ముఖ్, సన్నీ, సిరి, ప్రియాంక, కాజల్, మానస్ మరియు శ్రీరామచంద్ర ఉన్నారు. ఇక ఈ 7 మందిలో షణ్ముఖ్, సన్నీ తప్ప మిగిలిన వారు నామినేషన్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

సిరి, మానస్, శ్రీరామ చంద్ర, ప్రియాంక మరియు కాజల్ లో తక్కువగా ప్రియాంక సింగ్ కు ఓట్లు పోల్ అవున్నాయి. అన్ అఫిషియల్ ఓటింగ్ లో ఈ సారి ప్రియాంక సింగ్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే.. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హౌస్ లో ఉన్న సభ్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు బిగ్ బాస్.

టికెట్ టు ఫినాలే టాస్క్ ను వాళ్లకు ఇచ్చాడు. దీనిలో మొత్తం మూడు ఛాలెంజ్ లు ఉంటాయి. మూడు ఆటల్లో ఎక్కువగా ఎవరు పాయింట్లు సాధిస్తారో వాళ్లు.. నేరుగా ఫైనల్ కు అడుగుపెడతారు. తొలి చాలెంజ్‌గా ‘ఐస్‌’టాస్క్‌ ఇచ్చాడు. ఇంటి సభ్యులంతా ఐస్‌తో నింపిన టబ్‌లో నిలబడి.. వారికి ఇచ్చిన బాల్స్‌ని కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్ లో సన్ని, సిరి మధ్య కాస్త గొడవ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు.. వాళ్లు ఈ ఛాలెంజ్ లో గెలిచినట్లు కూడా సమాచారం అందుతోంది.

ఈ టాస్క్ తో మళ్లీ బిగ్ బాస్ టీఆర్ పీ రేటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఫైనల్ ల్లోకి ఎవరు అడుగుపెట్టారో తెలియాలంటే.. మరొక రోజు ఆగాల్సిందే. ఇక 12వ వారం ఎలిమినేట్ అయిన యాంకర్ రవి విషయంలో ఇంకా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రవిని అన్యాయంగా బలి చేశారంటూ.. అతడి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

ఈవారం చాలా వేడిగా జరిగిన నామినేషన్స్.. కమ్యూనిటీ అంటూ చర్చ!

బిగ్ బాస్ కార్యక్రమం 12 వారాలు పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే 13వ వారం లో నామినేషన్ ప్రక్రియ ఎంతో వేడిగా కొనసాగాయి హౌస్ లో కేవలం ఐదు మంది మాత్రమే ఉండడంతో ఎవరికి వారు సేఫ్ గేమ్ ఆడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్స్ లో భాగంగా కేవలం షణ్ముఖ్ సన్ని తప్ప మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్ లు నామినేషన్స్ లో ఉన్నారు.

అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందుగానే షణ్ముఖ్ కాజల్ ఇద్దరు చాలాసేపు మాట్లాడుతున్నారు.ఈ సందర్భంగా షణ్ముఖ్ మాట్లాడుతూ నువ్వు మానస్, కాజల్ ,సన్నీని నామినేట్ చేయమని ధీమాతో ఉన్నారు అంటూ తనని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించారు.

ఇక షణ్ముఖ్ కాజల్ ను కమ్యూనిటీ అనే పదం వాడిందని అది చాలా పెద్ద మాట ఇలాంటి ఫ్లాట్ఫామ్ దగ్గర అలాంటి మాటలు మాట్లాడకూడదు అందుకే నామినేట్ చేస్తున్నానని నామినేట్ చేశాడు. అయితే కాజల్ ఎలాంటి పరిస్థితిలో ఆమె కమ్యూనిటీ అనే పదం వాడిందో అని వివరించే ప్రయత్నం చేస్తూ చాలా సేపు వాదించారు.

ఇక ప్రియాంక తను ఎవరిని నామినేట్ చేయడానికి ఎలాంటి రీజన్స్ లేవని తనకు కాసేపు టైం కావాలని బిగ్ బాస్ ను కోరింది. కానీ చివరికి బిగ్ బాస్ నామినేట్ చేయాలని సూచించడంతో షణ్ముఖ్ చెప్పిన కమ్యూనిటీ పదాన్ని వాడుకొని తను కాజల్ ను నామినేట్ చేయడంతో పాటు సిరిని కూడా నామినేట్ చేస్తుంది. అయితే నామినేషన్స్ అనంతరం తాను కమ్యూనిటీ అని ఎవరిని ఉద్దేశించి అనలేదని ఒక గుంపుగా ఉన్నవారిని కూడా కమ్యూనిటీ అంటారు అంటూ ఈ విషయం గురించి పెద్ద ఎత్తున రచ్చ చేశారు.

సన్నీ, యానీని ఆడేసుకున్న నాగార్జున.. హౌస్ లో ఏం జరుగుతుంది అంటూ!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది.

ఈ ఐదో సీజన్లో ఇప్పటికే 10 వారాలు పూర్తి కావచ్చాయి. 10వ వారంలో విజయవంతంగా యాకర్ రవి కెప్టెన్ అయ్యాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే శనివారం ఈ కార్యక్రమానికి వచ్చిన నాగార్జున సన్నీ, యానీపై కోపం చూపించినట్లు కనిపించింది.

సన్నీ విషయంపై రవి మాట్లాడుతూ.. కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ ఎక్కువగా టంగ్ లూస్ అయ్యాడని.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడని .. వెరీ బ్యాడ్ బియేవియర్.. ఇష్టం వచ్చింది చేస్తా.. అంటూన్నాడు అంటూ రవి చెబుతాడు. దానికి సన్నీ నేను అనలేదు అని.. దానికి మానస్ కూడా నాకు వినిపించలేదు అని చెబుతారు. దీనికి నాగార్జున వీడియో ప్లే చేయించి.. తంతా అనే పదం వాడావు అంటూ నిరూపిస్తాడు.

దానికి యాని ఇంటెన్షన్ గా అనలేదు.. ఆ పదం బ్రిక్స్ ను తంతా అని వాడి ఉండొచ్చు అంటూ సన్నీని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయాగా.. నాగార్జున ఆమెకు కౌంటర్ ఇస్తాడు. కోపంలో ఏది చెప్పినా ఓకె.. కాజల్ చెబుతున్న బేవకూప్ కూడా కరెక్టే కదా అంటూ చెబుతాడు నాగార్జున. దీంతో ఒక్కసారిగా యానీ మాస్టార్ షాక్ కు గురవుతుంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఎక్కవుగా సన్నీ, యానీని ఆడేసుకున్నట్లు కనపడుతోంది.

సన్నీ పై కన్నేసిన ఉమాదేవి.. ఏకంగా అల్లుడిని చేసుకొని ప్లాన్ లో..!

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న 19 మంది కంటెస్టెంట్ లలో ఉమాదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకుంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉమాదేవి రెండు వారాల పాటు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచి ఎవరూ ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

ఇలా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఉమాదేవి పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి మాట్లాడుతూ ఉమాదేవి కంటెస్టెంట్ సన్నీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈమె సన్నీ గురించి మాట్లాడుతూ ఏకంగా తనని తన అల్లుడిగా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

ఉమా దేవికి ఇద్దరు కూతుర్లు కావడంతో తన పెద్ద కూతురిని సన్నీకి ఇచ్చి పెళ్లి చేయాలని ఉమాదేవి అనుకున్నదట అయితే ఓసారి షూటింగ్ లో పాల్గొన్నప్పుడు తన చిన్న కూతురు సన్నీని అన్నయ్య అని పిలవడంతో తను కూడా తనని చెల్లెలుగా భావిస్తున్నట్లు ఉమాదేవి తెలిపారు.

కానీ తనని మాత్రం అత్తయ్య అని పిలుస్తారని,తన పిల్లలకు ఏ సమస్య వచ్చినా వెంటనే సన్ని ఆదుకుంటాడని ఈ సందర్భంగా ఉమాదేవి సన్నీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ.. సన్నీ ఎంతో అద్భుతంగా ఆడుతున్నారని, కచ్చితంగా సన్నీ టాప్ ఫైవ్ లో ఉంటారని ఉమాదేవి తెలియజేశారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపొమ్మని రవికి స్ట్రాంగ్ వార్నింగ్..?

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో గరం గరం గా సాగింది. నాగార్జున కుటుంబ సభ్యులకు చురకలంటించారు. ఇంటి సభ్యుల పై ప్రశంసలతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ వారం నామినేషన్స్ లో భాగంగా ఇంటి నుంచి వచ్చిన లెటర్స్ అందుకోలేక త్యాగం చేసిన షణ్ముఖ్, సిరి, లోబో, రవి, శ్రీ రామ్, మానస్ లకు క్లాప్స్ తో అభినందనలు తెలిపారు. అనంతరం హౌస్ సభ్యులకు వార్నింగ్ లు ఇవ్వడం మొదలు పెట్టారు నాగార్జున.

ఇంటి సభ్యులు ఫోటోలు కట్ చేస్తూ వారి చేసిన విషయాలను తెలియజేశారు. మొదటగా లోబో ఫోటో కట్ చేస్తూ, గేమ్ బాగా ఆడుతున్నావని, ముత్యాల గేమ్ ఫై ప్రశంసలు కురిపించారు. ఇంకా ఎఫర్ట్ పెట్టాలి అని సూచించారు. ఆ తర్వాత రవి ఫోటో కట్ చేస్తూ ఎందుకు బాధ అనే విషయాన్ని అడిగాడు నాగార్జున. అందుకు ఒక వీడియో ఇప్పుడు చూపించారు.

ఇక ఆ వీడియోలో రవి ఇందులో నేను ఉండడం కరెక్టేనా, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నాడో తెలియడం లేదంటూ మాట్లాడాడు. ఇక్కడ ఈ విషయంపై రవి స్పందిస్తూ తన భార్య కూతురు ఎలా ఉన్నారో తెలియడం లేదు ఆ విషయాలు చెబితే బాగుంటుంది అని తను ఆ సమయంలో అలా రియాక్ట్ అయ్యాను అని తెలిపారు. ఇక ఇదే విషయాన్ని నాగార్జున చాలా సీరియస్ గా తీసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు స్ట్రాంగ్ గా ఉండాలని, అందుకు ఒప్పుకునే వచ్చావని ఫ్యామిలీ వాళ్ళని ఎప్పుడు చూపించాలో బిగ్ బాస్ కి తెలుసని నాగ్ తెలిపారు.

నిజంగానే ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే ఉండలేకపోతున్న వారు ఉంటే వెంటనే వెళ్ళిపోవచ్చు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. గేటు ఓపెన్ చేస్తా అనే వెళ్ళిపో అని స్పష్టం చేశారు నాగార్జున. హౌస్ లోకి వచ్చారు అంటే అన్ని బరించి స్ట్రాంగ్ గా ఉండాలని, ఫ్యామిలీతో అటాచ్మెంట్ అందరికీ ఉంటుందని నువ్వు అలా అనడం వల్ల ఇతరులను మిస్ గైడ్ చేసినట్టుందని వారికి లేని ఆలోచనలు కలిగించినట్టు ఉందని హెచ్చరించారు. అలాగే ఇంకెప్పుడు ఇలా చేయద్దని స్ట్రాంగ్ గా ఉండాలని తెలిపారు నాగార్జున.