Tag Archives: tea

Trending News: ఇదెక్కడి వింత రా బాబు..! టీ తాగుతూ ఇలాంటి పని చేశాడేంటి..?

Trending News: ఆ వ్యక్తికి 55 సంవత్సరాలు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా.. బంధువులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ నొప్పి గత కొన్ని రోజులుగా ఉందని.. అతడు వైద్యుడికి చెప్పాడు. అస్సలు ఏమైందా అని వాళ్లు పరీక్షలు చేయగా.. షాక్ అయ్యారు.

Trending News: ఇదెక్కడి వింత రా బాబు..! టీ తాగుతూ ఇలాంటి పని చేశాడేంటి..?

సీటీ స్కాన్ తీయగా.. కడుపులో ఉన్న ఆ వస్తువు చూసి వైద్యులే దిమ్మతిరిగిపోయారు. ఆ టెస్ట్‌ల్లో బాధితుడి కడుపులో గ్లాసు ఉన్నట్టుగా గుర్తించారు వైద్యులు. దాంతోనే అతడికి కొడుపు నొప్పి వస్తుందని కుటుంబసభ్యులకు చెప్పారు.

Trending News: ఇదెక్కడి వింత రా బాబు..! టీ తాగుతూ ఇలాంటి పని చేశాడేంటి..?

అసలు ఆ గ్లాస్ కడుపులోకి ఎలా వెళ్లింది.. అతడు దానిని చిన్న పిల్లల మాదిరిగా ఎలా మింగాడు.. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని ముజఫర్పుర్ జిల్లా మడిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివవరాలు తెలుసుకుందాం..

ఎండోస్కోపీ చేసి గ్లాస్ ను తొలగించే ప్రయత్నం..


మడిపూర్ గ్రామానికి చెందిన 55ఏళ్ల వ్యక్తికి సడన్ గా కడపు నొప్పి రావడం స్టార్ట్ అయింది. వెంటనే పోతుందిలే అనుకున్నాడు. కానీ నొప్పి మాత్రం అస్సలు తగ్గలేదు. దీంతో అతడు.. వైద్యుడిని సంప్రదించగా.. పరీక్షల అనంతరం అతడి కడుపులో గ్లాస్ ఉన్నట్లు గమనించారు వైద్యులు. అది ఎలా మింగావని అడగ్గా.. అతడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ రోజు అతడు టీ తాగేటప్పుడు గ్లాస్ కూడా మింగేసినట్లు తెలిపాడు. అయితే టీ తాగుతుండగా గ్లాస్‌ను మింగేసినట్టు చెప్పిన రోగి మాటలు నమ్మశక్యంగా లేవని వైద్యులు అంటున్నారు. అయితే తొలుత అతడికి ఎండోస్కోపీ చేసి గ్లాస్ ను తొలగించే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో.. చివరకు ఆపరేషన్‌ చేసి గ్లాస్‌ ను తొలగించారు. దీంతో అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు వైద్యులు. గ్లాస్ ఆహార నాళంలో ఎలా పట్టిందో అర్థం కాక వైద్యులు తలలు పట్టుకుంటన్నారు. చిన్న పిల్లల మాదిరిగా గ్లాస్ మింగేయడం ఏంటి అంటూ.. గ్రామస్తులు గుసగుసలు ఆడుతున్నారు.

Tea: టీ తాగిన తర్వాత ఈ ఆహార పదర్థాలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

Tea: మన నిత్య జీవితంలో ‘టీ’(TEa)కి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఉదయాన్నే కాసింత ఛాయ్ నోట్లో పడందే.. ఏ పని కూడా మొదలు కాదంటే అతిశయోక్తి కాదు. గంట గంటకు కూడా టీ తాగే వారు కూడా ఉంటారు. కొంత మందికి టీ వ్యసనం. ప్రస్తుతం ఛాయ్ లలో అనేక వెరైటీలు కూడా వస్తున్నాయి. అల్లం టీ, గ్రీన్ టీ, మసాలా టీ, తందూరి టీ ఇలా రకరకాల టీలు రావడంతో… ఛాయ్ ప్రియులు అన్నింటిన టెస్టుల చేస్తున్నారు. 

Tea: టీ తాగిన తర్వాత ఈ ఆహార పదర్థాలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

ఇదిలా ఉంటే టీ తాగడం మంచిదా కాదా.. అనే ప్రస్తావన వస్తే కొన్ని సందర్భాల్లో టీ తాగడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలు జీర్ణం కావడాన్ని అడ్డుకోవడమే కాకుండా.. ఆహారంలోని పోషక విలువను శరీరం గ్రహించకుండా అవరోధాలు ఏర్పడుతాయని చెబుతున్నారు. 

Tea: టీ తాగిన తర్వాత ఈ ఆహార పదర్థాలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

విలమిన్లు, ఖనిజాలు శోషణకు టీ అడ్డు తగులుతుందని తేలింది. ఛాయ్ లో ఉన్న టానిన్లు ముదురు గోధుమ రంగును అందిస్తాయి. అదే విధంగా గ్రీన్ టీలో క్యాటెచిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. టానిన్లు అధిక సాంద్రతలో ప్రోటీన్, ఐరన్ శోషనకు నిరోధిస్తోంది. ఇటు వంటి సమయంలో ప్రోటీన్లు తిన్న తరువాత టీ తాగకూడదు. 


టీ తాగాక మొలకలు తింటే ప్రమాదమే..

పచ్చి కూరగాయలు తిన్న తర్వాత కూడా టీ ని తాగకుంటే మంచిదని చెబుతున్నారు.  ఆకుకూరల్లో ఉండే గోయిట్రోజెన్లు థైరాయిడ్ ద్వారా అయోడిన్ శోషణను నిరోధించి అయోడిన్ లోపానికి కారణం అవుతుంటాయి. పచ్చి కూరగాయలు తిన్న తర్వాత కూడా టీ ని తీసుకోవడం మానేయాలి. తృణధాన్యాలు, మిల్లెట్స్ లో ఫైటేల్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇనుము, జింక్, మెగ్నీషియంతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీ తాగిన తర్వాత మొలకలను తినకూడదు.

ఉదయాన్ని కాఫీ, టీ తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

ఎవరికైనా ఆరోగ్యం మంచిగా ఉంటే.. ఎంత పని అయినా చేస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. ఆరోగ్యం ఉంటే.. కొన్ని కోట్లు ఆస్తి మన దగ్గర ఉన్నట్లే. ఇటీవల కరోనా కారణంగా ఎంతమంది తమ ప్రాణాలను విడిచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎంతో మంది ఉన్నతులు కూడా ఉన్నారు.

వాళ్లను ఆ డబ్బులు బతికించలేకపోయాయి. కొంతమంది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రాణాలు మాత్రం తిరిగి రాలేదు. అలా అతలాకుతలం చేసింది మాయదారి కరోనా మహమ్మారి. అందుకే ఆరోగ్యం బాగా చూసుకుంటే.. ఎంతటి దానిని అయినా సాధించవచ్చు అనేది అదొక్కటే ఉదాహరణ. కరోనా కారణంగా కొంతమంది తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనేది వాస్తవమే అయినా.. చిన్న చిన్న తప్పుల కారణంగా.. అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి.

అవేంటంటే.. రోజూ వారి దిన చర్యలో భాగంగా ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ప్రతీ ఒక్కరికీ అలవాటు. ఇక్కడే కొంతమంది తప్పు చేస్తున్నారు. తీసుకునే ఆ ఆహారం విషయంలో పొరపాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం కాఫీ, టీ తాగేవారు ఖాళీ కడుపుతో తీసుకోవడంతో.. ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

వాటివలన చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని వీలైనంత వరకు ఉదయాన్నే కాఫీకి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఎసిడిటీ ఎక్కువగా ఫామ్ అవుతుందని.. ఇది పేగులపై ప్రభావం చూపుతుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందు ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాతనే కాఫీ, టీలాంటికి ఒక కప్పుతాగాలని చెబుతున్నారు. లేదంటే పరిగడుపున మంచి నీళ్లు తాగి.. కాస్త సమయం తీసుకొని తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం నిద్ర లేవగానే బెడ్ టీ తాగుతున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు..?

ఉదయం లేవగానే చాలామంది తమ రోజును ఒక కప్పు టీ తో మొదలు పెడుతూ ఉంటారు. నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కొంతమందికి అయితే ఆర్ టీ తాగకపోతే ఆరోజు అంతా పిచ్చి గా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అంతలా టి కి ఎడిక్ట్ అయిపోయారు. వీటిని చాలా మంది పెద్ద అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు.

అయితే ఇలా ఉదయాన్నే టీ తాగడం వల్ల అది మలబద్ధకానికి దారి తీయడమే కాకుండా, నిధుల పై కూడా ప్రభావం చూపిస్తుందని ఒక నివేదిక హెచ్చరిస్తున్నారు.క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల ఎముకలు పెళుసుగా మారతాయి అని అంటున్నారు. ఉదయం లేవగానే బెడ్ టీ తాగడం చాలా మందికి అలవాటు. ఒక కప్పు టీ లో 20 నుంచి 60 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది.

ఈ కెఫిన్ ఆరోగ్యానికి మంచిది కాదు.ఇలా క్రమం తప్పకుండా టీ తీసుకోవడం వల్ల రక్త నాళాలు కుచించుకుపోయి,రక్త పోటు పెరుగుతుంది. అసిడోసిస్ పెరుగుతుంది. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. ఇలాంటి క్రమంలోనే ఉదయాన్నే కాఫీ తాగే ముందు గోరువెచ్చని నీరు లేదా సాధారణ నీరు తాగండి.

ఇలా గోరువెచ్చని నీరు లేదా సాధారణ నీటిని తాగిన తర్వాత టీ తాగండి. లేదంటే అల్పాహారంగా కొన్ని పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుని ఆ తర్వాత టీ తాగడం మంచిది. నిరంతరం టీ తాగడం వల్ల దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి. అంతేకాకుండా టి ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

ఉదయాన్నే ఖాళీ కడపుతో టీ తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకోండి!

ప్రతీ ఒక్కరికీ ఉదయం కాఫీ లేదా టీ తాగడం అలవాటు ఉంటుంది. దాని తర్వాతనే వాళ్ల రోజూ వారి దినచర్యను ప్రారంభిస్తుంటారు. కొంతమందికి ఇలా ఉదయాన్నే టీ తాగకపోతే ఆ రోజు అసలు బుర్రే పనిచేయదు. అయితే ఇదంతా ఇలా ఉండగా.. బ్రష్ చేసిన తర్వాత ఉదయం ఖాళీ కడుపుతోనే టీ తాగడం మంచిదేనా.. దాని వల్ల ఎలాంటి అనర్ధాలు ఉన్నాయి.

వాటి గురించి నిపుణులు ఎమంటున్నారో ఇక్కడ మనం తెలుసుకుందాం.. ఎసిడిటీ ఉన్నవాళ్లు ఇలా ఉదయాన్ని ఖాళీ కడపుతుతో ఛాయ్ తాగడం మంచిది కాదంటూ నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ లేని వాళ్లు కూడా ఇలా తాగడం మంచిది కాదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన యాసిడ్ లెవెల్స్ మరింత పెరిగిపోతాయి.

దీనితో ఐరన్ లోపం కలిగి ఎనీమియా సమస్య వస్తుంది. టీ లో కొన్ని నెగెటివ్ ప్రభావం కూడా ఉంటుంది. దీని వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇది కాన్స్టిపేషన్ సమస్యకు దారితీస్తుంది. టీకి కొంతమంది బానిసగా మారుతారు. ఒక్కరోజు టీ తాగలేదంటే.. పిచ్చివాడిలా ప్రవర్తిస్తుంటారు.దీనికి గల కారణం ఏంటంటే.. నికోటిన్ . పొగాకులో ఉండే నికోటిన్ మాదిరిగానే ఇందులో కూడా ఉంటుంది.

ఇది ఎవరినైనా టీకి బానిసను చేస్తుంది. అలా టీ తాగే సమయం వచ్చిందంటే.. కడుపులో పడాల్సిందే అనే ఫీలింగ్ లో ఉంటారు. అయితే ఇలా చేయడం వ్లల ఉదయం నుంచి వికారం, అలసట లాంటివి వస్తాయి. ఇవి చిన్నగా ఎసిడిటీకి దారి తీస్తాయి. ఇక టీ తాగే అలవాటు ఉండి.. కచ్చతంగా తాగాలి అనే వారు ఉదయం కాస్త.. అల్పాహారం తీసుకొని కొంచెం సమయం తర్వాత టీని తాగితే ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మీకు చాయ్ తాగే అలవాటు ఉందా.. అయితే ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి..

ఛాయ్ అంటే ఎవరకి ఇష్టం ఉండదండి.. ప్రతీ ఒక్కరికీ ఇష్టమైన పానీయం ఇది. అయితే దీనిని ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు మాత్రమే ఒకప్పుడు తీసుకునే వారు. ఒత్తిడిని తగ్గించుకునే దిశలో చాలామంది వేడివేడిగా ఏదో ఒకటి తాగుతారు. కానీ ప్రస్తుతం టైం పాస్ కోసం కూడా ఛాయ్ ని తాగుతున్నారు. సరదాగా అలా స్నేహితులతో కలిసి వెళ్లినా ఓ చాయ్​ లాగించే జనాలు కోకొల్లలు. ఇక టిఫీన్‌ చేయగానో ఓసారి, లంచ్‌కు ముందు మరోసారి మళ్లీ సాయంత్రం స్నాక్స్‌ తిన్న తర్వాత మరోసారి, చలి ఎక్కువగా ఉంటే రాత్రి ఇంకోసారి ఇలా కప్పు మీద కప్పు వేస్తూ చాయ్‌ ప్రేమికులు లొట్టలేసుకుంటూ తాగేస్తుంటారు.

ఇలా ఎక్కువగా చాయ్ లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల సైడ్​ ఎఫెక్స్ట్​ కూడా ఉన్నాయంట. చాయ్‌ తయారీ కోసం ఉపయోగించే టీ పౌడర్‌లో నికోటిన్‌, కెఫిన్‌ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవే ఇపుడు ప్రమాదానికి కారణాలు అయ్యాయి. ఇవి కడుపులో యాసిడ్ ఉత్పత్తిగా కారకాలుగా మారుతున్నాయట. చాయ్ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిగా చేస్తుంది. అందుకే చాయ్ తగిన వెంటనే ఆకలి వేయదు. చాయ్‌ తాగగానే ఒక్క సారిగా శరీరానికి శక్తి అందిన ఫీలింగ్‌ కలుగుతుంది.

అయితే ఎంత ఫాస్ట్‌గా శక్తి వస్తుందో అంతే వేగంగా వెళ్లిపోతుంది. ఇటీవల కాలంలో 30 ఏళ్ల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లు కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. చాయ్ఎక్కువగా తాగడం వల్ల కూడా ఎముకలపై ప్రభావం చూపిస్తుంది. టీ పౌడర్ లో వాడే కొన్ని పదర్ధాలు ఎముకలను బలహీన పరుస్తాయి.

వేడి చాయ్ తాగడం వల్ల కూడా భవిష్యత్ లో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. భవిష్యత్తులో గొంతు క్యాన్సర్‌(cancer)కి కూడా దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మెల్లగా చాయ్ తాగడం బంద్ చేస్తే మంచిది. దాని బదులు గ్రీన్ టీ, లెమన్ టీలు తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.

బిర్యానీ ఆకులతో టీ తయారు చేసుకోండి.. ఈ ప్రయోజనాలను పొందండి!

బిర్యానీ ఆకులను సాధారణంగా మనం బిర్యానీ చేసే సమయంలో మాత్రమే వాడుతాం. వెజ్ బిర్యానీ అయినా.. నాన్ వెజ్ బిర్యానీ అయినా బిర్యానీ ఆకు వేస్తే ఆ రుచే రెట్టింపు అవుతుంది. చివరకు మసాలా కూరల్లోనూ ఈ ఆకు వేస్తే ఆ టేస్టే వేరప్పా అన్నట్లు ఫుడ్ లవర్స్ ఎంజాయ్ చేస్తూ ఓ పట్టుపట్టేస్తారు. టేస్ట్ లోనే కాదు.. ఆరోగ్యానికి ఈ బిర్యానీ లీఫ్ ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటితో టీ కూడా చేసుకోవచ్చు.

బిర్యానీ ఆకుల అన్ని లక్షణాలను ఈ టీ గ్రహిస్తుంది. ఎలా చేయాలో తెలుసుకుందాం. బిర్యానీ ఆకుల టీ రుచికరంగా ఉండటంతో పాటు మంచి వాసన కలిగి ఉంటుంది. దీనికి ముఖ్యంగా 2-3 కప్పుల నీరు, 4-5 బిర్యానీ ఆకులు కావాలి. తాజా బిర్యానీ ఆకులు ఉంటే మీరు 3-4 బే ఆకులను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి కూడా దొరక్కపోతే ఎండిన బిర్యానీ ఆకులను కూడా ఉపయోగించవచ్చు.
ముందుగా ఒక పాత్రలో నీళ్లు వేసి మరిగించాలి.

కాస్త మరిగాక బిర్యానీ ఆకులను వేసి మరో రెండు నిమిషాలు తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఎంతో ఈజీగా తయారుచేసుకునే ఈ టీ ఎంతో రుచిగా ఉంటుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్‌తో సహా ఎలాంటి నొప్పినైనా తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం బిరియానీ ఆకులు క్యాన్సర్ కణాలను తొలగించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

కిడ్నీలో రాళ్లను కరిగించడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఈ బిరియానీ ఆకులు బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి సహాయపడతాయి. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వారు ఈ టీ తాగడం వల్ల గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి.. మధుమేహ వ్యాధిని నయం చేస్తుంది.

మధుమేహంతో బాధపడుతున్నారా.. అయితే ఈ టీ తప్పనిసరిగా తాగాల్సిందే.!

ప్రస్తుత కాలంలో కొన్ని కారణాల వల్ల ఎంతోమంది రోజురోజుకీ మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి చిన్న పెద్ద అని వయసుతో తేడా లేకుండా ఈ సమస్యతో బాధపడుతున్నారు.ఈ విధంగా మధుమేహంతో బాధపడేవారు వారి శరీరంలో షుగర్ స్థాయిలను నియంత్రించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహార నియమాలను పాటిస్తూ ప్రతిరోజు మందులను వాడుతూ ఉంటారు. ఈ విధంగా ఈ వ్యాధితో బాధపడే వారికి ఈ వ్యాధి నుంచి విముక్తి పొందటానికి అద్భుతమైన పరిష్కారం ఈ టీ త్రాగటం వల్ల దొరుకుతుందని చెప్పవచ్చు.

సాధారణంగా జామ పండ్లను పేదవాడి ఆపిల్ అని పిలుస్తారు. ఆపిల్ లో లభించే పోషకాలన్నీ జామపండులో మనకు లభిస్తాయి.అదేవిధంగా జామ ఆకుల ద్వారా కూడా ఎన్నో పోషకాలు అందుతాయి కాబట్టి వీటి ద్వారా తయారుచేసుకున్న టీత్రాగటం వల్ల మధుమేహాన్ని పూర్తిగా నియంత్రించడమే కాకుండా మరి కొన్ని అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు. ప్రతిరోజు ఉదయం జామ ఆకులతో తయారు చేసుకున్న టీని తాగడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి ఈ జామ ఆకుల టీ తాగడం ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. అయితే ఈ జామాకుల టీ ను దాదాపు పన్నెండు వారాల పాటు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు

ఈ జామ ఆకుల టీ లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. ప్రతిరోజు ఈ టీ త్రాగటం వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.అదే విధంగా ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారు ఈ టీ త్రాగటం వల్ల కీళ్ల నొప్పులు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా పట్టి నొప్పి సమస్యతో బాధపడేవారు జామ ఆకులను నమలడం వల్ల తొందరగా ఈ నొప్పి నుంచి విముక్తి పొందవచ్చు. నోటి పూత, చిగుళ్ళు వాపు వంటి సమస్యలను తగ్గించడంలో జామాకులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ అలవాట్లు ఎక్కువగా ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గినట్లే!

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి వారికి రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చని ఇప్పటికే ఎంతోమంది రోగనిరోధక శక్తిని పెంపొందించుకొనే పనిలో పడ్డారు. రోగనిరోధక శక్తి మెరుగుపడటానికి పౌష్టికాహారం తీసుకుంటూ, వివిధ రకాల కషాయాలను సేవిస్తూ ఉన్నారు. ఇలా చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అయితే తరచూ మన అలవాట్లలో కొన్ని అలవాట్ల వల్ల రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుందని తాజాగా నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ అలవాటు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

కొంతమంది మందుబాబులు ఎల్లప్పుడు మద్యం మత్తులో తూగుతుంటారు. ఇలా ఎక్కువ మొత్తంలో మద్యం సేవించడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి.అంతే కాకుండా మద్యం ఎక్కువగా సేవించే వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణులు తెలియజేశారు. ఇలాంటి వారిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందితే మరింత తీవ్రరూపం దాల్చి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.

మనం ప్రతిరోజు వండే వంటలలో సరిపడా ఉప్పు లేనిదే వంటకు తగినంత రుచి రాదు. అయితే ఈ ఉప్పును అధికంగా తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటు పెరగడమే కాకుండా, శరీరంలో అధిక శాతం సోడియంను మూత్రపిండాలు వడ పోసేటప్పుడు డొమినే ఎఫెక్ట్‌ సంభవిస్తుంది. తద్వారా మన శరీరం బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని కోల్పోయి అనేక వ్యాధులు చుట్టుముడతాయి.

సాధారణంగా కాఫీ,టీ తాగటం ద్వారా కొంతమంది మంచిదని చెబుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు రావడంతో పాటు, ఇందులో ఉండే కెఫిన్ అనే పదార్థం వల్ల నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా మరికొంత మంది ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు. అలా అనవసరంగా ఆందోళన చెందటం వల్ల మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి వారిలో అధిక రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇలాంటి అలవాట్లు ఉన్న వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణుల తెలియజేశారు.