Tag Archives: telugu film industry

Raja Singh : విప్లవ పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడైపోయింది… వెంటనే ఆమెని అరెస్ట్ చేయాలి బీజేపీ నేత రాజా సింగ్ డిమాండ్!

Raja Singh : ప్రముఖ నటి సాయి పల్లవి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమాలో రానా సరసన సాయి పల్లవి నటించింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Sai pallavi: అలాంటి పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడైపోయింది… వెంటనే తనని అరెస్ట్ చేయాలి బీజేపీ నేత డిమాండ్!

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి గోసంరక్షకులని కాశ్మీరీ పండిట్ లతో పోల్చటం పెద్ద దుమారం లేపాయి. ఈ విషయంపై ఇప్పటికే పలువురు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యాడు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అంటూ మండిపడ్డాడు. ముస్లింలు, క్రైస్తవుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఎవ్వరికీ ధైర్యం ఉండదు… కానీ హిందువుల మీద మాత్రం ఇలాంటీ వ్యాఖ్యలు చేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు.

Sai pallavi: అలాంటి పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడైపోయింది… వెంటనే తనని అరెస్ట్ చేయాలి బీజేపీ నేత డిమాండ్!

సాయి పల్లవి సినిమా కోసం కమ్యూనిస్టులు పుస్తకాలు చదివి ఆమె మెదడు పనిచేయడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలలో ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆమె మీద కేసు నమోదు చేయాలని చెప్పుకొచ్చాడు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినందుకు ఇలా ఒకరిని శిక్షిస్తే తప్ప మరెవరూ ఇలాంటి పని చేయటానికి సాహసం చేయరు అంటూ కోపంతో ఊగిపోయాడు.

ఏం మాట్లాడినా సినిమా ప్రమోషన్ కోసం అంటారు…

ఇదిలా ఉండగా ఇప్పటికే హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో సాయి పల్లవి మీద కేసు నమోదు అయ్యింది. అంతే కాకుండా ఆమె నటించిన విరాటపర్వం సినిమా బాయ్ కాట్ చేయాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం గురించి తాజాగా సాయి పల్లవి స్పందించింది. నిన్న హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ.. ఇప్పుడు నేను ఏమి మాట్లాడినా కూడా సినిమా కోసం మాట్లాడుతున్నాను అనుకుంటారు. ఇప్పుడు నేను సినిమా విడుదల అవుతుందన్న సంతోషంలో ఉన్నాను. సినిమా విడుదల అయిన తర్వాత ఈ విషయం గురించి తప్పకుండా మాట్లాడుతాను అంటూ చెప్పుకొచ్చింది.

Manchu Vishnu: చేతిలో రాయి లేదు కాబట్టి బ్రతికిపోయావ్.. లేకపోతేనా.. మంచు విష్ణుని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్!

Manchu Vishnu : ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు తనయుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విష్ణు సినిమా ద్వారా హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మంచు విష్ణు ఆ తర్వాత అస్త్రం, ఢీ, కృష్ణార్జున, దేనికైనా రెడీ వంటి సినిమాల ద్వారా హీరోగా మంచి గుర్తింపు పొందాడు. అయితే మంచు విష్ణు నటించిన సినిమాలు చెప్పుకోతగ్గ స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి.

Manchu Vishnu: ఫాదర్ ఆఫ్ ఇండియా తీయొచ్చు కదా.. మంచు విష్ణుని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్?

ఇటీవల కొంతకాలము సినిమాలకు దూరంగా ఉన్న మంచు విష్ణు మా ఎన్నికల సమయంలో చాలా సందడి చేసి మా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. మంచు విష్ణు సినిమాలు తక్కువగా చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో మంచు విష్ణు చేసే పోస్ట్ లు.. ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతాయి.

Manchu Vishnu: ఫాదర్ ఆఫ్ ఇండియా తీయొచ్చు కదా.. మంచు విష్ణుని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్?

తాజాగా మంచు విష్ణు సోషల్ మీడియాలో తన ఫొటో షేర్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు వెంటనే స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మంచు విష్ణు షేర్ చేసిన ఫోటోలో..ఆయన అలా దీనంగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంది. ఈ ఫోటో షేర్ చేస్తూ.. నేనేమీ చెయ్యాలే.. అని ట్యాగ్ చేస్తూ థర్స్ డే థాట్స్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన వెంటనే నెటిజన్లు తమ కామెంట్లతో అతని మీద దాడికి దిగారు.

ముందు తీసే సినిమా పై ఫోకస్ పెట్టు….

ఫాదర్ ఆఫ్ ఇండియా అనే సినిమా తీసేయ్ అంటూ కొందరు కామెంట్స్ చేయగా..నువ్ ఏదో చేసేయాలని ఇంకేదో చేసేయకు భయ్యో… ఫస్ట్ నువ్ తీసే సినిమా మీద ఫోకస్ పెట్టు అని ఇంకొందరుకామెంట్స్ చేస్తున్నారు. టైమ్‌కి చేతిలో రాయి లేదు కాబట్టి బతికిపోయావ్..! అంటూ మరికొందరు చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మంచు విష్ణు షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణుకి జోడిగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ మంచు విష్ణు సరసన స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Chiranjeevi -surekha: కలెక్టర్ ని కాదనుకొని చిరంజీవిని పెళ్లి చేసుకున్న సురేఖ.. అందుకు కారణం అదేనా?

Chiranjeevi -surekha : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పునాది రాళ్ళు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరంజీవి తన ప్రతిభతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇలా మెగాస్టార్ గా గుర్తింపు పొందాడు.

Chiranjeevi -surekha: కలెక్టర్ ని కాదనుకొని చిరంజీవిని పెళ్లి చేసుకున్న సురేఖ.. అందుకు కారణం అదేనా?

ఇదిలా ఉండగా చిరంజీవి ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి పెళ్ళి గురించి ప్రస్తుతం కొన్ని ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి. చిరంజీవి, సురేఖ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం ఒక ప్రముఖ నటుడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అల్లు రామలింగయ్య మొదట సురేఖని ఒక కలెక్టర్ కి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడట. కానీ ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి సలహా మేరకు సురేఖని చిరంజీవికి ఇచ్చి పెళ్ళి చేశారు.

Chiranjeevi -surekha: కలెక్టర్ ని కాదనుకొని చిరంజీవిని పెళ్లి చేసుకున్న సురేఖ.. అందుకు కారణం అదేనా?

సురేఖ పెళ్ళి విషయంలో ఆమె తండ్రీ అల్లు రామలింగయ్య ఆయనకి అత్యంత సన్నిహితుడైన ప్రభాకర్ రెడ్డితో చర్చించాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాకర్ రెడ్డి భార్య బయటపెట్టింది. తాజాగా ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని చిరంజీవి పెళ్ళి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకరోజు అల్లు రామలింగయ్య వచ్చి సురేఖకి కలెక్టర్ సంబంధం రెడీగా ఉంది.. చిరంజీవి కూడా పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరికిచ్చి పెళ్లి చేయమంటావ్..’’ అని ప్రభాకర్ రెడ్డిగారిని అడిగారు.

చిరంజీవి పై ఇష్టంతోనే కలెక్టర్ ను కాదన్న సురేఖ…

అప్పుడు ఆయన పిల్లలకి నచ్చివన్ని తెచ్చి ఇస్తాం. కలెక్టర్ సంబంధం కూడ మంచిదే. కానీ సురేఖకి ఇష్టమైన వ్యక్తికి ఇచ్చి పెళ్ళి జరిపించు అని చెప్పాడట. కానీ చిరంజీవి పైకి వస్తాడా అని అల్లు రామలింగయ్య అనుమాన పడితే..సురేఖ అదృష్టవంతురాలు అయితే తప్పకుండా పైకి వస్తాడని చెప్పాడట. దీంతో అల్లు రామలింగయ్య సురేఖని అడగగా చిరంజీవిని చేసుకోటానికి ఇష్టపడింది. దీంతో అల్లు రామలింగయ్య తన కూతురుని చిరంజీవికి ఇచ్చి పెళ్లి జరిపించాడు.. అంటూ సంయుక్త గారు చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రభాకర్ రెడ్డి గారి సలహా వల్ల సురేఖ, చిరంజీవిల పెళ్ళి జరిగింది.

Sai Pallavi: సాయి పల్లవి వంశ చరిత్ర గురించి ఆశక్తికర విషయాలను బయటపెట్టిన ప్రముఖ జర్నలిస్టు సాయి !

Sai pallavi: సహజ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళం, భాషలలో ఎన్నో సూపర్ సినిమాలలో నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం సాయి పల్లవి విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమాలో దగ్గుబాటి రానాకి జోడిగా సాయి పల్లవి నటించింది. ఈ సినిమా ఈ నెల 17 వ తేదీ విడుదల కానుంది.

Sai pallavi: సాయి పల్లవి వంశ చరిత్ర గురించి ఆశక్తికర విషయాలను బయటపెట్టిన ప్రముఖ జర్నలిస్టు సాయి?

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సాయి పల్లవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చాంశనీయంగా మారాయి. కాశ్మీరీ పండిట్ ల హత్యలను, గోవులను అక్రమంగా రవాణా చేసే ఒక మతానికి చెందిన వ్యక్తిని కొట్టడం…రెండూ ఒకే అంటూ సాయి పల్లవి వ్యాఖ్యలు చేసింది. దీంతో సాయి పల్లవి విమర్శలను ఎదుర్కొంటోంది. గోవులను హత్య చేసేవారిని, కాశ్మీరీ పండిట్ లతో పోల్చటం ఏంటి అంటూ ఒక వర్గం వారు సాయి పల్లవి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sai pallavi: సాయి పల్లవి వంశ చరిత్ర గురించి ఆశక్తికర విషయాలను బయటపెట్టిన ప్రముఖ జర్నలిస్టు సాయి?

ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరుగుతోంది. దీంతో సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా బాయ్‌కాట్‌ చేయాలని నినాదాలు చేస్తున్నారు. ఈ సంఘటన వల్ల సాయి పల్లవి వంశ చరిత్ర గురించి తెలుసుకోవటానికి కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ సాయి ఇటీవల సాయి పల్లవి భాష చరిత్రకి సంబంధించిన వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో సాయి పల్లవి వంశ చరిత్ర గురించి క్షుణ్ణంగా వివరించాడు.

భారీ ఎత్తున వలసవచ్చిన బడగ వంశస్థులు..

సాయి పల్లవి తమిళనాడులోని నీలిగిరి ప్రాంతానికి కోటగిరి అనే ప్రాంతం .వీరు మైసూరు ప్రాంతంనుంచి వలస వచ్చి కోయంబత్తూర్ లో సెటిల్ అయ్యారు. ఆ కాలంలో టిప్పు సుల్తాన్‌ మతం మారని వారిని చంపేస్తున్న నేపథ్యంలో బారీ ఎత్తున వలస వచ్చి వీరి పూర్వీకులు అడవుల్లో తల దాచుకున్నారు. వీరినే బడగ జాతి వారు అంటారు. వీరి అరణ్యవాసానికి ముఖ్యకారణం టిప్పు సుల్తాన్‌ ఈ విధంగా సాయి పల్లవి బడగ వంశ చరిత్ర గురించి జర్నలిస్ట్ సాయి వెల్లడించారు.

Kamal Hassan: కమల్ హాసన్ కి మరి ఇంత కోపమా.. వేదికపై నుంచే అభిమానికి వార్నింగ్ ఇచ్చిన హీరో?

Kamal Hassan: కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో కమల్ హాసన్ ఎంతో సంతోషంలో ఉన్నారు. ఈ సినిమా అంచనాలకు మించి ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో స్వయంగా కమల్ హాసన్ తన అప్పును మొత్తం తీరుస్తానని తెలిపారు. ఇలా సినిమా మంచి విజయం కావడంతో కమల్ హాసన్ ఎంతో చురుగ్గా ‘మక్కల్‌ నీది మయ్యం’పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

kamal-haasan-he-get-very-angry-and-given-a-warned-the-fans-on-the-stage

ఈ క్రమంలో పార్టీ తరఫున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై ఒక నేత రక్తదానం గురించి మాట్లాడుతూ ఉండగా వెనుక నుంచి ఓ అభిమాని పెద్ద ఎత్తున విక్రమ్ విక్రమ్ అంటూ అరిచారు.

kamal-haasan-he-get-very-angry-and-given-a-warned-the-fans-on-the-stage

ఈ విధంగా అభిమాని వేదికపై పెద్ద ఎత్తున కమల్ హాసన్ అతనికి వేలు చూపిస్తూ సైలెంట్ గా ఉండమని చెప్పారు. ఇలా వేదికపైనే కమల్ హాసన్ సీరియస్ అయ్యారు. ఇక తాను ఎందుకు వద్దని చెప్పాను అనే విషయాన్ని కూడా ఆయన వివరించారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా ఏకంగా 4 లక్షల లీటర్ల రక్తాన్ని ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాము.ఇదే రక్తాన్ని బయట కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు. అలా కాకూడదనే మనం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసాము.

విక్రం అంటే అమ్మటం అని అర్థం…
ఈ విధంగా రక్తదానం గురించి ఒక నేతమాట్లాడుతున్న సమయంలో విక్రమ్ అంటూ అరవగా మనం కూడా రక్తాన్ని అమ్ముతున్నామని భావిస్తారు. తమిళంలో విక్రమ్ అంటే అమ్మడం అని అర్థం వస్తుంది. ఇలా మనం రక్తదానం గురించి మాట్లాడేటప్పుడు విక్రమ్ అంటే మనం కూడా ఈ రక్తం అమ్ముతున్నామని అనుకుంటారు అందుకే అరవద్దని చెప్పాను అంటూ కమల్ హాసన్ అనంతరం వివరణ ఇచ్చారు.

Sai Pallavi: మతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న నెటిజన్స్?

Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తన పని తాను చూసుకుంటూ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అగ్ర తారగా పేరు సంపాదించుకున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్ర తారగా గుర్తింపు పొందిన సాయిపల్లవి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు.ఈమె నటించిన విరాట పర్వం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Sai Pallavi: మతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న నెటిజన్స్?

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడుతూ కశ్మీర్ పండిట్ల హత్య, గో హత్యల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో కశ్మీర్ పండిట్లను ఎలా హత్య చేశారో చూపించారు. మనం దానిని మతఘర్షణలు చూస్తే ఎలా?మొన్నటికి మొన్న ఒక బండిలో ఆవును తీసుకొని ఒక ముస్లిం వ్యక్తి వెళ్తుంటే తనని కొంతమంది కొట్టి చంపి జైశ్రీరామ్ అన్నారు.

Sai Pallavi: మతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న నెటిజన్స్?

ఇక అప్పట్లో జరిగిన దానికి ప్రస్తుత జరిగిన దానికి పెద్ద తేడా లేదు.ఇక్కడ సమస్య వస్తున్నది మతాల వల్ల కాదు మనం మంచితనంగా ఉంటే ఎలాంటి సమస్యలు రావని ఈమె కాశ్మీర్ ఫైల్స్ ఘటన గురించి మాట్లాడారు.ఈ క్రమంలోనే సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం కొంతమంది తనకు మద్దతు తెలపగా మరికొంతమంది తన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సాయి పల్లవి వ్యాఖ్యలు విరాటపర్వం పై ప్రభావం చూపనున్నాయా…

అలాగే సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా చూసేది లేదంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ విధంగా సాయి పల్లవి విరాటపర్వం సినిమా విడుదలకు ముందు ఈ విధమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సినిమాను పూర్తిగా ఇబ్బందులలోకి నెట్టేశారని తెలుస్తోంది. మొత్తానికి సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Prabhas: ప్రభాస్ కోసం రాత్రంతా పడిగాపులు కాసిన మీడియా.. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్?

Prabhas: పాన్ ఇండియా స్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్న ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఎక్కడున్నారు అంటే అక్కడ అభిమానులు మీడియా పెద్ద ఎత్తున ఆయనతో ఫోటోలు దిగడం కోసం, ఆయన ఫోటోలు కోసం ఎగబాకుతూ ఉంటారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఓం రౌత్ ఘనంగా పార్టీ ఇవ్వడంతో ఆది పురుష్ చిత్ర బృందం మొత్తం ఆ దర్శకుడి ఇంటికి క్యూ కట్టారు.

the-media-has-been-waiting-total-night-for-prabhas-by-request

ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు అందరూ కూడా డైరెక్టర్ ఓం రౌత్ ఇంటికి వెళ్ళారని తెలియడంతో మీడియా ఒక్కసారిగా అక్కడ వాలిపోయింది. రాత్రంతా ఎంతో ఘనంగా పార్టీ చేసుకున్న అనంతరం మరుసటి రోజు ఉదయం ప్రభాస్ అక్కడినుంచి వెళ్ళడానికి బయటికి రాగా మీడియా ఒక్కసారిగా ప్రభాస్ ను చుట్టుముట్టింది.

the-media-has-been-waiting-total-night-for-prabhas-by-request

ప్రభాస్ అక్కడి నుంచి కారు వద్దకు వెళ్తుండగా మీడియా సర్ మీ కోసం రాత్రి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము.. ప్లీజ్ అంటూ అతనిని రిక్వెస్ట్ చేయడంతో డార్లింగ్ మీడియా అభ్యర్థన మేరకు కాసేపు అక్కడ నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అనంతరం ప్రభాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా ప్రభాస్ ఫోటో కోసం మీడియా రాత్రంతా ఇలా వెయిట్ చేయడం చూస్తుంటేనే అతనికి ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది.

ఘనంగా పార్టీ ఇచ్చిన బాలీవుడ్ డైరెక్టర్…

ఇకపోతే ప్రభాస్ కృతిసనన్ హీరోహీరోయిన్లుగా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మిగిలిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన పార్టీ ఇవ్వడంతో చిత్రబృందం మొత్తం ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్టు కే సినిమాలతో బిజీగా ఉన్నారు..

Gopichand: గోపీచంద్ జయం సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా… మరీ ఇంత తక్కువా?

Gopichand: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి తన విలనిజంతో అందరినీ భయపెట్టి అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు గోపీచంద్ ఎన్నో సినిమాలలో నటించారు. ఇక ఈయన సినీ కెరియర్ లో కూడా అందరిలాగే హిట్టూ ఫ్లాపులను సొంతం చేసుకున్నారు. గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీలో సరైన హిట్ లేక సతమతమవుతున్న గోపీచంద్ కి సిటీ మార్ మంచి హిట్ ఇచ్చిందని చెప్పాలి.

Gopichand: గోపీచంద్ జయం సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా… మరీ ఇంత తక్కువా?

ఇకపోతే తాజాగా ఈయన మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జులై 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Gopichand: గోపీచంద్ జయం సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా… మరీ ఇంత తక్కువా?

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ తను ఇండస్ట్రీలోకి జయం సినిమా ద్వారా అడుగుపెట్టానని తెలిపారు. ఇదే తన మొదటి సినిమా అని చెప్పిన గోపీచంద్ ఈ సినిమా కోసం తను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయాన్ని కూడా వెల్లడించారు.ఈ సినిమా కోసం గోపీచంద్ కేవలం 11 వేల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించారు.

కొందరికి డబ్బులు ఇచ్చి మోసపోయాను…

తేజగారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఆయన లక్కీ నెంబర్ తో తనకు 11 వేల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని, అయితే ఆ సమయంలో 11 పక్కన మరోక సున్నా ఉంటే బాగుండేది అనిపించింది. ఇలా ఈ సినిమా కోసం తీసుకున్న 11 వేల రూపాయలు తీసుకెళ్ళి తన ఇంట్లో వాళ్లకు ఇచ్చానని గోపీచంద్ వెల్లడించారు. ఇకపోతే ఈయన తన కెరియర్ లో ఎంతో మందికి డబ్బును ఇచ్చి తిరిగి తీసుకోలేకపోయానని కొందరు ఇప్పటికీ తనకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఈ సందర్భంగా గోపీచంద్ వెల్లడించారు.

Telugu Indian Idol Winner: తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా ట్రోఫీ అందుకున్న వాగ్దేవి.. ఎమోషనల్ అయిన తండ్రి!

Telugu Indian Idol Winner: తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమౌతున్నటువంటి తెలుగు ఇండియన్ ఐడల్ సూపర్ సింగర్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. 12మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేకు ఐదు మంది కంటెస్టెంట్ లు ఎంపికయ్యారు.ఇకపోతే ఈ ఐదుగురిలో పోటాపోటీగా సాగిన ఈ కార్యక్రమంలో చివరికి సింగర్ వాగ్దేవి విజేతగా నిలబడ్డారు.

Telugu Indian Idol Winner: తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా ట్రోఫీ అందుకున్న వాగ్దేవి.. ఎమోషనల్ అయిన తండ్రి!

ఈ కార్యక్రమానికి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఈ నెల 17వ తేదీ ప్రసారం కానుంది. ఇకపోతే ఈ కార్యక్రమ గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు విరాటపర్వం చిత్రబృందం కూడా వేదికపై సందడి చేసినట్లు తెలుస్తోంది. మొట్టమొదటిసారి తెలుగు ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తిక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా శ్రీరామచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Telugu Indian Idol Winner: తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా ట్రోఫీ అందుకున్న వాగ్దేవి.. ఎమోషనల్ అయిన తండ్రి!

ఇక ఇప్పటికే ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరై చిరంజీవి చేతుల మీదుగా విజేతకు ట్రోఫీ అందజేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి విజేతగా వాగ్దేవిని ప్రకటించడంతో ఆమె ఎంతో సంతోషపడుతూ తనకు ఎప్పటికైనా ఏ ఆర్ రెహమాన్ దగ్గర పాట పాడాలని అలాగే ఇళయరాజా గారి దగ్గర కోరస్ అయినా ఇవ్వాలనే తన కోరిక అంటూ తెలిపారు.

ఈ విజయం తల్లికి అంకితం…

ఇక తన తల్లికి నన్ను సింగర్ చూడడమే తన కోరిక అని ఈ విజయాన్ని తన తల్లికి అంకితం చేస్తున్నా అంటూ తెలిపారు. అదే విధంగా నన్ను ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక వాగ్దేవి తండ్రి ఈ విషయంపై స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మా అమ్మాయి ఇటువంటి అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు.

Gopichand: పది వేల రూపాయల కోసం ఆ డైరెక్టర్ కి ఫోన్ చేసి అడిగిన గోపీచంద్.. డైరెక్టర్ షాకింగ్ సమాధానం!

Gopichand: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా,హీరోగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు గోపీచంద్ ఎన్నో సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈయన సినీ కెరీర్ లో హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చాయి.ఒకానొక సమయంలో గోపీచంద్ కెరియర్ పూర్తిగా అయిపోయిందనుకున్న తరుణంలో సిటీ మార్ సినిమా ద్వారా మరోసారి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.

Gopichand: పది వేల రూపాయల కోసం ఆ డైరెక్టర్ కి ఫోన్ చేసి అడిగిన గోపీచంద్.. డైరెక్టర్ షాకింగ్ సమాధానం!

ఇకపోతే తాజాగా గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జులై 1వ తేదీ విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Gopichand: పది వేల రూపాయల కోసం ఆ డైరెక్టర్ కి ఫోన్ చేసి అడిగిన గోపీచంద్.. డైరెక్టర్ షాకింగ్ సమాధానం!

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గోపీచంద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కమర్షియల్ అంటే డబ్బు విషయంలో చాలామంది ఎంతో కమర్షియల్ గా ఉంటూ ఉంటారు. ఈ క్రమంలోనే యాంకర్ గోపీచంద్ ని ప్రశ్నిస్తే మీకు అర్జెంటుగా 10000 కావాలని ఫోన్ చేసి అడిగితే ఎవరు వేస్తారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గోపీచంద్ సమాధానం చెబుతూ డైరెక్టర్ మారుతి గారు అని చెప్పారు.

ఈ క్రమంలోనే మారుతి గారికి ఫోన్ చేసి తనకు ఒక్క నిమిషంలో పదివేల రూపాయలు కావాలి అర్జెంట్గా వేయమని చెప్పారు. ఈ విధంగా గోపీచంద్ 10,000 కావాలని అడగడంతో మారుతి మాట్లాడుతూ అదేంటి ఏదో 10 లక్షలు కావాలని అడిగావ్ అన్న అంటూ సమాధానం చెప్పారు. పదివేలే కదా వెంటనే నీ నెంబర్ పంపించు వేస్తాను అని సమాధానం చెప్పారు.

పది లక్షలు అన్నట్టు అడిగావన్నా..

ఇక గోపీచంద్ గూగుల్ పే నెంబర్ కి సెండ్ చేయమని చెప్పగా మారుతీ నిమిషంలో పదివేల రూపాయలు తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ పాత్రలో సందడి చేయనున్నారు.