Gopichand: గోపీచంద్ జయం సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా… మరీ ఇంత తక్కువా?
Gopichand: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి తన విలనిజంతో అందరినీ భయపెట్టి అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు గోపీచంద్ ఎన్నో సినిమాలలో నటించారు. ఇక ఈయన సినీ కెరియర్ లో కూడా అందరిలాగే హిట్టూ ఫ్లాపులను సొంతం చేసుకున్నారు. గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీలో సరైన హిట్ లేక సతమతమవుతున్న గోపీచంద్ కి సిటీ మార్ మంచి హిట్ ఇచ్చిందని చెప్పాలి.
ఇకపోతే తాజాగా ఈయన మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జులై 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ తను ఇండస్ట్రీలోకి జయం సినిమా ద్వారా అడుగుపెట్టానని తెలిపారు. ఇదే తన మొదటి సినిమా అని చెప్పిన గోపీచంద్ ఈ సినిమా కోసం తను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయాన్ని కూడా వెల్లడించారు.ఈ సినిమా కోసం గోపీచంద్ కేవలం 11 వేల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించారు.
తేజగారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఆయన లక్కీ నెంబర్ తో తనకు 11 వేల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని, అయితే ఆ సమయంలో 11 పక్కన మరోక సున్నా ఉంటే బాగుండేది అనిపించింది. ఇలా ఈ సినిమా కోసం తీసుకున్న 11 వేల రూపాయలు తీసుకెళ్ళి తన ఇంట్లో వాళ్లకు ఇచ్చానని గోపీచంద్ వెల్లడించారు. ఇకపోతే ఈయన తన కెరియర్ లో ఎంతో మందికి డబ్బును ఇచ్చి తిరిగి తీసుకోలేకపోయానని కొందరు ఇప్పటికీ తనకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఈ సందర్భంగా గోపీచంద్ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…