Gopichand: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి తన విలనిజంతో అందరినీ భయపెట్టి అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు గోపీచంద్ ఎన్నో సినిమాలలో నటించారు. ఇక ఈయన సినీ కెరియర్ లో కూడా అందరిలాగే హిట్టూ ఫ్లాపులను సొంతం చేసుకున్నారు. గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీలో సరైన హిట్ లేక సతమతమవుతున్న గోపీచంద్ కి సిటీ మార్ మంచి హిట్ ఇచ్చిందని చెప్పాలి.

ఇకపోతే తాజాగా ఈయన మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జులై 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ తను ఇండస్ట్రీలోకి జయం సినిమా ద్వారా అడుగుపెట్టానని తెలిపారు. ఇదే తన మొదటి సినిమా అని చెప్పిన గోపీచంద్ ఈ సినిమా కోసం తను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయాన్ని కూడా వెల్లడించారు.ఈ సినిమా కోసం గోపీచంద్ కేవలం 11 వేల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించారు.
కొందరికి డబ్బులు ఇచ్చి మోసపోయాను…
తేజగారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఆయన లక్కీ నెంబర్ తో తనకు 11 వేల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని, అయితే ఆ సమయంలో 11 పక్కన మరోక సున్నా ఉంటే బాగుండేది అనిపించింది. ఇలా ఈ సినిమా కోసం తీసుకున్న 11 వేల రూపాయలు తీసుకెళ్ళి తన ఇంట్లో వాళ్లకు ఇచ్చానని గోపీచంద్ వెల్లడించారు. ఇకపోతే ఈయన తన కెరియర్ లో ఎంతో మందికి డబ్బును ఇచ్చి తిరిగి తీసుకోలేకపోయానని కొందరు ఇప్పటికీ తనకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఈ సందర్భంగా గోపీచంద్ వెల్లడించారు.































