Tag Archives: tolywood

Ntr: నేను ఈ స్థాయిలో ఉండడానికి ఆ ఇద్దరు మహిళలే కారణం.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ తన జీవితంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు మహిళల గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు ఇలా తను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు మూల కారణం తన అమ్మ అని తెలిపారు తన అమ్మ నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయడం కోసం తనకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్పిందని తెలిపారు.

ఇలా డాన్స్ నేర్చుకోవడం ఒక మంచి ఆర్ట్ అని తనలో ఉన్నటువంటి భావాలన్నింటిని కూడా నేను డాన్స్ రూపంలో తెలియజేస్తానని ఈయన తెలియజేశారు ఇలా నా జీవితంలో అమ్మ కీలక పాత్ర పోషించిందని ప్రతి ఒక్క విషయంలో తాను నన్ను ఎంతగానో ప్రోత్సహించేదని తెలిపారు. ఇక నా జీవితంలో నా భార్య ప్రణతి కూడా కీలకపాత్ర పోషించారని తెలిపారు.

తన ఇష్టాలను నాపై రుద్దదు..

నేను ఇలా హోమ్లి మెన్ గా ఉన్నాను అంటే అందుకు కారణం ప్రణతి అని తెలిపారు. ఆమె తన ఇష్ట ఇష్టాలను ఎప్పుడూ కూడా నాపై రుద్దదు అంతేకాకుండా ప్రతిరోజు నేను వ్యాయామం చేసేలా నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు.ఇలా ప్రణతి కూడా నా విజయంలో భాగం అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన తల్లి భార్య గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Nagashaurya-Anusha Shetty: వెండి కంచాల్లో.. రాచరికపు స్టైల్ లో నాగశౌర్య పెళ్లి భోజనాలు.. ఫోటోలు వైరల్!

Nagashaurya-Anusha Shetty: టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయిని ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. బెంగళూరులో ఆదివారం ఉదయం 11:25 గంటలకు నాగశౌర్య వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ క్రమంలోనే నాగశౌర్య ప్రీ వెడ్డింగ్ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లికి సంబంధించిన హల్దీ, సంగీత్, పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట చెక్కర్లు కొట్టడంతో పెద్ద ఎత్తున అభిమానులు, నేటిజన్ లు నాగశౌర్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే నాగశౌర్య పెళ్లిలో వడ్డించిన భోజనాలకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

నాగశౌర్య తండ్రి ఓ ప్రముఖ వ్యాపారవేత్త. వందల కోట్ల కు నాగశౌర్య వారసుడు అదేవిధంగా అనూష శెట్టి సైతం ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె కావడంతో వీరి పెళ్లికూడా అంతే ఘనంగా నిర్వహించారు. అలాగే వీరి పెళ్లిలో భోజనాలను రాచరికపు స్టైల్ లో వడ్డించారని తెలుస్తోంది.

12 రకాల వంటకాలతో విందు..

వెండికంచాలలో సుమారు 12 రకాల వంటకాలతో పెళ్లికి వచ్చిన అతిథులకు విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.ప్రస్తుతం నాగశౌర్య పెళ్లిలో విందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే నాగ శౌర్య బెంగుళూరులో వివాహం చేసుకోగా త్వరలోనే హైదరాబాదులో సినీ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ నిర్వహించి వారందరికీ విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన వెలువబడునుంది.

Mehboob Dilse: బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ ఇంట విషాదం.. తల్లి మృతి చెందడంతో కన్నీళ్లు పెట్టుకున్న మెహబూబ్?

Mehboob Dilse:ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇండస్ట్రీకి చెందినవారు లేదా వారి కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను షాక్ కి గురిచేస్తుంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెహబూబ్ గురించి అందరికీ సుపరిచితమే బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఈయన అంచలంచెలుగా ఎదుగుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్న మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాను ఎంతగానో ప్రేమించే తన తల్లి మృతి చెందడంతో ఒక్కసారిగా తన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. మెహబూబ్ తల్లి గుండెపోటుతో మరణించడంతో ఈయన కన్నీళ్లు మున్నీరు అవుతున్నారు. ఈ క్రమంలోనే తన తల్లిని తలుచుకొని మహబూబ్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా తన తల్లిని తలుచుకుంటూ అమ్మా ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు ధైర్యంగా నేను ఎలా నిర్ణయాలు తీసుకోవాలి నేను రోజు ఎవరితో మాట్లాడాలి.. నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో తెలియడం లేదమ్మా అంటూ ఎమోషనల్ అయ్యారు. నా ప్రతి ఒక్క సందర్భంలోనూ నా వెనకే ఉండి నన్ను ప్రోత్సహించావు. నా ఎదుగుదలను చూసి మురిసి పోయావు అంటూ ఎమోషనల్ అయ్యారు.

Mehboob Dilse: మా కోసం సర్వస్వం త్యాగం చేశావు…

మా కోసం మా ఎదుగుదల కోసం సర్వస్వం త్యాగం చేసిన నువ్వు మా మధ్య లేకపోవడంతో ఇకపై మా జీవితంలో ఎలా ముందుకు సాగాలో తెలియడం లేదు ప్రతిక్షణం నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తూ ఉంటావని నాకు తెలుసు. తమ్ముడికి నాన్నకి ఏ విధమైనటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను. నువ్వు గర్వపడేలా మరింత స్థాయికి ఎదుగుతాను అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా మెహబూబ్ తల్లి మరణించారనే విషయం తెలియగానే పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు తనకు ఫోన్ చేసి పరామర్శించారు.

Vijayshanthi: అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి.. పరోక్షంగా చిరు పై సెటైర్స్?

Vijayshanthi: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ చిత్రంగా తెరకెక్కిన సినిమా లాల్ సింగ్ చద్దా.ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమాకు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. గతంలో అమీర్ ఖాన్ భారతదేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండియాలో ఉండాలంటే అసహనం వేస్తుందని, ఇక్కడ రక్షణ లేదు, ఎక్కడికైనా వెళ్లిపోవాలని ఉంది అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ప్రస్తుతం ఎంతోమంది నేటిజన్ లు తన సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి బిజెపి నాయకురాలు విజయశాంతి సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి స్పందిస్తూ ప్రజలను నోటికొచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రజలు అర్థమయ్యేలా అమీర్ ఖాన్ కు చెబుతున్నారని ఈమె ట్వీట్ చేశారు. గతంలో సర్కారుపై వ్యతిరేకతతో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఫలితాన్ని ఇస్తున్నాయని తెలిపారు.

మనదేశంలో స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవాన్ని ఇస్తుంది. ఈ వాస్తవం తెలిసిన ప్రజలు అమీర్ ఖాన్ సినిమాలను బాయికాట్ చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా ఆయన నటించిన వాణిజ్య ఉత్పత్తులను సైతం తిరస్కరిస్తున్నారనీ విజయశాంతి పేర్కొన్నారు.

Vijayshanthi: చిరంజీవిని కూడా టార్గెట్ చేసిన విజయశాంతి…

ఇక ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా అందర్నీ మేలుకొలుపుతుంటే.. కొందరు టాలీవుడ్ హీరోలు మాత్రం ప్రజల మనోభావాలు వాళ్ళకి తెలియవు అన్నట్టుగా అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ టీవీలలో కనిపిస్తున్నారని పరోక్షంగా ఈమె చిరంజీవిని కూడా ఉద్దేశించి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ గురించి విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Hero Siddharth: పాన్ ఇండియా సినిమాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్… అదొక నాన్సెన్స్ అంటూ కామెంట్స్!

Hero Siddharth: పాన్ ఇండియా అనే పదం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినబడుతోంది.ఒక సినిమా అన్ని భాషలలో తెరకెక్కి విడుదల కావడంతో ఆ సినిమాని పాన్ ఇండియా సినిమాగా పిలుస్తున్నాం. ఈ క్రమంలోనే పుష్ప, RRR, కేజిఎఫ్ వంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ప్రేక్షకులను సందడి చేశాయి.అయితే ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు ఈ పాన్ ఇండియా సినిమాలు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Hero Siddharth: పాన్ ఇండియా సినిమాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్… అదొక నాన్సెన్స్ అంటూ కామెంట్స్!

తాజాగా కాంట్రవర్సీ హీరో సిద్ధార్థ్ కూడా పాన్ ఇండియా సినిమాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాన్ ఇండియా అనేది అగౌరవం అయినది, అదొక నాన్సెన్స్ అంటూ సిద్ధార్థ్ కామెంట్ చేశారు.ఇక్కడ చేసే సినిమాలన్నీ కూడా భారతీయ సినిమాలు అయినప్పుడు పాన్ ఇండియా అని ఎందుకు పిలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

Hero Siddharth: పాన్ ఇండియా సినిమాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్… అదొక నాన్సెన్స్ అంటూ కామెంట్స్!

ఈ విధంగా మాట్లాడితే పదిహేను సంవత్సరాల క్రితమే మణిశర్మ రోజా అనే సినిమాను ఇండియా సినిమాగా తెరకెక్కించి విడుదల చేశారు.తాజాగా నా స్నేహితులు కేజిఎఫ్ చిత్రాన్ని కూడా చేశారు. ఆ సినిమా చూసి నేను ఎంతో గర్వ పడుతున్నాను అంటూ సిద్దార్థ్ తెలిపారు. నచ్చిన సినిమాని ఏ భాషలో చూసే అధికారమైనా ప్రేక్షకులకు ఉంది. అందుకే పాన్ ఇండియా అనే పదాన్ని తొలగించి ఇండియన్ సినిమా అని పేరు పెట్టాలని సిద్ధార్థ వెల్లడించారు.

అంత బిల్డప్ ఎందుకు….

ఒక సినిమా తెరకెక్కతుంది అంటే ఎంతో మంది టెక్నీషియన్లు కావాలి. ఇలా వివిధ భాషలలో నటీనటులు కలిసి పనిచేయడం వల్ల ఒక సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా ఏ భాషలో తెరకెక్కిస్తే ఆ భాషా చిత్రంగా పిలవాలి కానీ పాన్ ఇండియా అని ఎందుకు బిల్డప్ ఇస్తారు.. ఇంతగా బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఘాటుగా స్పందించారు. మరి సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి తెలియాల్సి ఉంది.

నాగార్జున లాంటి బిజినెస్ మైండ్.. డేర్ టాలీవుడ్‌లో మిగతా వారికి లేదా..?

టాలీవుడ్ హీరోలలో ఉన్న అందరికంటే అక్కినేని నాగార్జున పక్కా బిజినెస్ మేన్ అని.. ఆయనకున్న డేర్ మరొకరికి లేదని ఇప్పటికే చాలా సందర్భాలలో చెప్పుకున్నారు. కేవలం ఒకే ఒక్క సాంగ్ చూసి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి నిన్నే పెళ్ళాడతా లాంటి సినిమా అవకాశం ఇవ్వడం అంటే చాలా ధైర్యం ఉండాలి. పైగా ఈ సినిమాకు సంగీత దర్శకుడు సందీప్ చౌతా. అతను అప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ఇక ఇలాంటి ప్రయోగాత్మకమైన సినిమాను సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ బ్యానర్‌లో నిర్మించడం అంటే కూడా ఓ సాహసమే.

ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో నాగార్జున లాంగ్ హేయిర్ స్టైల్ ఆ తర్వాత టాలివుడ్ స్టార్ హీరోలందరూ ఫాలో అయ్యారు. కానీ, నాగార్జునకు సూటయినట్టుగా మరే హీరోకు సెట్ అవలేదు. ఇక మంచి కమర్షియల్ సినిమాలు చేస్తున్న నాగ్..మణిరత్నం లాంటి దర్శకుడితో గీతాంజలి సినిమా చేయడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాల్సిందే. సరికొత్త మోకోవర్‌తో నాగ్ మెప్పిస్తాడా అని అందరూ భావించారు. కానీ, అది కూడా ఆ తర్వాత ఓ ట్రెండ్ అయింది.

ఈ క్రమంలోనే రాం గోపాల్ వర్మకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడం మరో గొప్ప విషయం. అసలు దర్శకత్వ శాఖలో పనిచేయకుండానే రాం గోపాల్ వర్మకు తన సొంత బ్యానర్‌లో శివ సినిమా అవకాశం ఇవ్వడం కూడా అప్పట్లో పెద్ద హాట్ టాపిక్. కానీ నాగార్జున అప్పుడు చేసిన సాహసం ఆయన ఇమేజ్‌నే మార్చేసింది. నాగ్ కెరీర్‌లో మాత్రమే కాదు అన్నపూర్ణ సంస్థలో..రాం గోపాల్ వర్మ కెరీర్‌లో ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరి కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌లా మిగిలింది. ఇక ఈ సినిమాకు ఎలాంటి అనుభవం లేని వర్మ వాడిన కెమెరా యాంగిల్స్, కట్ టు కట్ షాట్స్ ఆ తర్వాత నుంచి అందరూ ఫాలో అవుతున్నారు.

ఇలాంటి సంచలన నిర్ణయాలు నాగార్జున ఇప్పటికే ఎన్నో తీసుకున్నాడు. అలా తీసుకున్న మరో డెసిషన్ అన్నీ సినిమాలు రిలీజ్ తేదీని ప్రకటించి వాయిదా వేసుకున్న కొడుకుతో కలిసి నటించిన బంగార్రాజు సినిమాను సంక్రాంతికి అనూహ్యంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడమే. అన్నీ సినిమాలు వాయిదా పడుతుంటే నాగార్జున ఎలా వస్తాడులే అనుకున్నారు. కానీ, బంగార్రాజు సినిమాను ఎప్పుడు మొదలు పెట్టారో ఎప్పుడు పూర్తి చేశారో కూడా తెలీదు. సినిమా 40 శాతం షూటింగ్ అయినప్పటి నుంచి వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ వచ్చి సినిమా మీద అంచనాలు పెంచారు.

Bangarraju Movie: ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావయ్యా..బంగార్రాజు!

ఆ తర్వాత సినిమాను సెన్సార్‌తో సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి రెడీగా పెట్టారు. ఎప్పుడైతే రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయో.. ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా  బంగార్రాజు రిలీజ్ డేట్‌ను ప్రకటించారు నాగార్జున. ఈ సినిమా అనుకున్నట్టుగానే విడుదల చేసి మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఎంత నమ్మకం లేకపోతే పెద్ద సినిమాల నిర్మాతలకు కూడా ధైర్యం చేసి రిలీజ్ చేయకపోయినా నాగార్జున మాత్రం బంగార్రాజును చాలా నమ్మకంగా రిలీజ్ చేసి మంచి లాభాలను అందుకున్నారు.