Vijayshanthi: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ చిత్రంగా తెరకెక్కిన సినిమా లాల్ సింగ్ చద్దా.ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమాకు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. గతంలో అమీర్ ఖాన్ భారతదేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండియాలో ఉండాలంటే అసహనం వేస్తుందని, ఇక్కడ రక్షణ లేదు, ఎక్కడికైనా వెళ్లిపోవాలని ఉంది అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి.
ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ప్రస్తుతం ఎంతోమంది నేటిజన్ లు తన సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి బిజెపి నాయకురాలు విజయశాంతి సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి స్పందిస్తూ ప్రజలను నోటికొచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రజలు అర్థమయ్యేలా అమీర్ ఖాన్ కు చెబుతున్నారని ఈమె ట్వీట్ చేశారు. గతంలో సర్కారుపై వ్యతిరేకతతో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఫలితాన్ని ఇస్తున్నాయని తెలిపారు.
మనదేశంలో స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవాన్ని ఇస్తుంది. ఈ వాస్తవం తెలిసిన ప్రజలు అమీర్ ఖాన్ సినిమాలను బాయికాట్ చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా ఆయన నటించిన వాణిజ్య ఉత్పత్తులను సైతం తిరస్కరిస్తున్నారనీ విజయశాంతి పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా అందర్నీ మేలుకొలుపుతుంటే.. కొందరు టాలీవుడ్ హీరోలు మాత్రం ప్రజల మనోభావాలు వాళ్ళకి తెలియవు అన్నట్టుగా అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ టీవీలలో కనిపిస్తున్నారని పరోక్షంగా ఈమె చిరంజీవిని కూడా ఉద్దేశించి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ గురించి విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…