Mehboob Dilse:ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇండస్ట్రీకి చెందినవారు లేదా వారి కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను షాక్ కి గురిచేస్తుంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెహబూబ్ గురించి అందరికీ సుపరిచితమే బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఈయన అంచలంచెలుగా ఎదుగుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్న మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాను ఎంతగానో ప్రేమించే తన తల్లి మృతి చెందడంతో ఒక్కసారిగా తన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. మెహబూబ్ తల్లి గుండెపోటుతో మరణించడంతో ఈయన కన్నీళ్లు మున్నీరు అవుతున్నారు. ఈ క్రమంలోనే తన తల్లిని తలుచుకొని మహబూబ్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా తన తల్లిని తలుచుకుంటూ అమ్మా ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు ధైర్యంగా నేను ఎలా నిర్ణయాలు తీసుకోవాలి నేను రోజు ఎవరితో మాట్లాడాలి.. నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో తెలియడం లేదమ్మా అంటూ ఎమోషనల్ అయ్యారు. నా ప్రతి ఒక్క సందర్భంలోనూ నా వెనకే ఉండి నన్ను ప్రోత్సహించావు. నా ఎదుగుదలను చూసి మురిసి పోయావు అంటూ ఎమోషనల్ అయ్యారు.
Mehboob Dilse: మా కోసం సర్వస్వం త్యాగం చేశావు…
మా కోసం మా ఎదుగుదల కోసం సర్వస్వం త్యాగం చేసిన నువ్వు మా మధ్య లేకపోవడంతో ఇకపై మా జీవితంలో ఎలా ముందుకు సాగాలో తెలియడం లేదు ప్రతిక్షణం నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తూ ఉంటావని నాకు తెలుసు. తమ్ముడికి నాన్నకి ఏ విధమైనటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను. నువ్వు గర్వపడేలా మరింత స్థాయికి ఎదుగుతాను అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా మెహబూబ్ తల్లి మరణించారనే విషయం తెలియగానే పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు తనకు ఫోన్ చేసి పరామర్శించారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…