Tag Archives: Turkey

Samantha: ఓయమ్మ సమంత ధరించిన ఈ చెప్పులు విలువ అన్ని లక్షలా… సమంత రేంజ్ మామూలుగా లేదు?

Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలో వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లో మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ సమంత ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా పలు సినిమా షూటింగ్ పనులలో సమంత తరచూ ఇతర దేశాలకు పయనం అవుతున్నారు.

తాజాగా సమంత తన సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ఇతర దేశాలకు వెళుతూ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దీంతో ఒక్కసారిగా కెమెరాలన్నీ సమంతను బంధించేసాయి. అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ దృష్టి సమంత వేసుకున్నటువంటి చెప్పులపై పడింది.

దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సమంత ధరించిన ఈ చెప్పులు విలువ ఎంత అని తెలుసుకొనే పనిలో పడ్డారు.. సమంత ధరించిన చెప్పులు లూయిస్ విట్టన్ కంపెనీకి చెందినవి అని తెలుస్తోంది. వాటి ధర 2.5 లక్షలు అని తెలుస్తోంది.ఇలా సమంత ధరించిన చెప్పులు విలువ రెండున్నర లక్ష విలువ చేస్తాయని తెలిసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు.

Samantha: లక్షలు విలువ చేస్తున్న సమంత చెప్పులు..


కేవలం చెప్పుల కోసమే సమంత ఇలా రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదని ఈ చెప్పుల ధర సమంత రెంజ్ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. దీంతోపాటు సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు.

Niharika: హాలిడే వెకేషన్ లో బికినీ లో చిల్ అవుతున్న నిహారిక.. బయటపడ్డ సీక్రెట్?

Niharika: మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి జరిగిన తర్వాత కాస్త గ్లామర్ డోస్ పెంచి అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. పెళ్లి కాకముందు వరకు ఎంతో ఒద్దికగా ఉన్నటువంటి నిహారిక పెళ్లయిన తర్వాత కాస్త గ్లామర్ డోస్ పెంచి పెద్ద ఎత్తున ఆ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా అభిమానులు నిహారిక వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో తరచూ హాలిడే వెకేషన్ కి వెళ్తున్నటువంటి ఈమె ఏకంగా తన వెకేషన్ కి సంబంధించిన అన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.గత కొద్ది రోజుల క్రితం టర్కీ వెకేషన్ వెళ్ళినటువంటి ఈమె ఏకంగా బికినీ ధరించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇకపోతే మరొక వెకేషన్ లో ఉన్నటువంటి నిహారిక ఏకంగా బ్యాక్ అందాలను చూపెడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఈ విధంగా నిహారిక బ్యాక్ ఎక్స్ పోస్ట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో తన వీపుపై ఉన్నటువంటి టాటూ బయటపడింది. ఈ క్రమంలోనే నిహారిక వీపుపై ఉన్నటువంటి టాటూ సీక్రెట్ గురించి నేటిజెన్లు ఆరా తీస్తున్నారు. ఇక్కడ NK అనే అక్షరాలతో పాటు ఏదో పక్షి ఎగురుతున్నట్టు ఉండటంతో చాలామంది NK అంటే నిహారిక కొణిదెల అని భావిస్తున్నారు అయితే ఈ టాటూకి సరైన అర్థం ఏంటో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

Niharika: ఒంటరిగా వెకేషన్ వెళ్లిన నిహారిక..

ఇకపోతే నిహారిక తన టాటూ సీక్రెట్ ఆమె నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా సమయంలోనే రివిల్ చేసింది అయితే తాజాగా ఈమె హాలిడే వెకేషన్ లో భాగంగా మరోసారి ఇలా హాట్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో తన టాటూ బయటపడటంతో అభిమానులు తన టాటూ గురించి చర్చలు జరుపుతున్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో నిహారిక హాలిడే వెకేషన్ వెళ్లిన ప్రతిసారి ఒంటరిగా స్నేహితులతో కలిసి వెళుతుంది. ఈ క్రమంలోనే చాలామంది నిహారిక ఇలా ఒంటరిగా వెకేషన్ వెళ్లడానికి గల కారణం ఏంటి అంటూ చర్చలు మొదలుపెట్టారు.

Mystery temple: ఆ గుడిలోకి వెళ్లారంటే… ప్రాణాలతో తిరిగి రాలేరు.. ఎక్కడో తెలుసా..?

Mystery temple:సాధారణంగా ప్రజలు తమ కోరికలు, బాధలను నెరవేర్చాలని దేవుడిని ప్రార్థించేందుకు గుడులకు వెళ్తుంటారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు గుడిలో దేవుడిని దర్శించుకుంటారు. మనకు ఎన్ని బాధలు ఉన్నా.. ఒక్కసారి దేవుడి ఆలయానికి వెళ్లి ఆయనను చూస్తే.. కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మనసు తేలిక అవుతుంది.

Mystery temple: ఆ గుడిలోకి వెళ్లారంటే… ప్రాణాలతో తిరిగి రాలేరు.. ఎక్కడో తెలుసా..?

కానీ ఎవరైనా చావడానికి గుడికి వెళ్తారా..? అయితే ఓ గుడికి వెళ్తే మాత్రం చావడం ఖాయం. తెలిసి తెలిసి ఆ గుడిలోకి అడుగుపెట్టే సాహసం చేస్తారా.. ఇలాంటి ఆలయం ఎక్కడు ఉందో అని అందరికి ఆసక్తి ఉంటుంది. 

Mystery temple: ఆ గుడిలోకి వెళ్లారంటే… ప్రాణాలతో తిరిగి రాలేరు.. ఎక్కడో తెలుసా..?

ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందంటే.. దక్షిణ టర్కీలోని పాముక్కలే సమీపంలో ఉంది. ఆలయంలో పక్షులు, జంతువులు చనిపోవడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది. స్థానికులు ఈ గుడిని ‘ నరక ద్వారం’గా పిలుస్తారు. అయితే ఆ గుడిలోకి వెళ్లిన జంతువులు ఎందుకు మరణిస్తున్నాయనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు. 

మరణాలుకు ఈ వాయువే కారణం:

తాజాగా ఈ మిస్టరీని సైంటిస్టులు చేధించారు. ఈ ఆలయం దిగువ భాగం నుంచి ప్రమాదకర కార్బన్ డయాక్సైడ్ వాయువు వస్తుందని నిర్థారించారు. సైంటిస్టుల పరిశోధన ప్రకారం.. ఆలయం దిగువభాగాన పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉందని భావిస్తున్నారు. దీంతోనే గుడిలోపలకి వెళ్లిన జంతువులు, పక్షులు మరణిస్తున్నాయమని తేల్చారు. సాధారణంగా.. 10 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉంటేనే.. 30 నిమిషాల్లో ఎవరైనా మత్తులోకి జారుకుంటారు.. తరువాత మరణిస్తారు. అయితే ఈ గుహలో ఈ విషవాయువు 91 శాతం వరకు ఉందని తేల్చారు.

కుప్పకూలిన విమానం.. 8 మంది దుర్మరణం..!

టర్కీ అడవుల్లో రష్యా విమానం యాంఫిబియస్‌ బెరివ్‌ బీఈ–200 అగ్నిమాపక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. దక్షిణ టర్కీలోని అదానా ప్రావిన్సు అడువుల్లో మంటలు అర్పేందుకు వెళ్ళిన సంకేతికలోపం కారణంగా ప్రమాదానికి గురైందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ప్రమాదం పట్ల టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుత్‌ కావుసోగ్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సాకేంతిక లోపంతో విమానంతో కమ్యూనికేషన్‌ తెగిపోయిందని.. దీంతో విమానం కూలినట్లు స్థానిక గవర్నర్‌ ఒమర్‌ ఫరూక్‌ కోస్కున్‌ తెలిపారు.ప్రమాద తీవ్రతను పరిశీలించేందుకు దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఘటనా స్థలానికి పంపింది.

పంజరంలో మనిషి తల.. ఎందుకంటే?

ఈ ప్రపంచంలో మన ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం కోసం ఎన్నో వ్యసనాలు ఉంటాయి. అయితే ఈ విధమైనటువంటి చెడు వ్యసనాల వల్ల ఎన్నో ప్రమాదాలను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ చెడు అలవాట్లకు బానిసకావడం ఎక్కువ కాలం పట్టదు. అయితే ఈ చెడు వ్యసనాల నుంచి బయటకు రావాలంటే ఎంతో సమయం పడుతుంది.

ముఖ్యంగా ధూమపానం, మద్యపానం వ్యసనాలను మానేయాలనుకునేవారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.ఈ అలవాట్ల నుంచి బయటపడేందుకు డీఅడిక్షన్ లేదా రీహాబిలిటేషన్ సెంటర్‌లో కూడా చేరుతుంటారు.కానీ ఓ వ్యక్తి మాత్రం ఎంతో భిన్నంగా ఇలాంటి చెడు వ్యసనాల నుంచి బయట పడటం కోసం తనకు తానే శిక్ష విధించుకున్నాడు.

టర్కీలోని కోతహ్యాలో నివసిస్తున్న ఇబ్రహిం యుసెల్‌ 20 ఏళ్ల నుంచి స్మోకింగ్ చేస్తున్నాడు. అది అతడికి వ్యసనంగా మారింది అయితే ఈ అలవాటు నుంచి బయట పడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తన తండ్రి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో చనిపోవడం వల్ల ఎలాగైనా ఈ వ్యసనం నుంచి బయట పడాలని తనకుతానే శిక్ష విధించుకున్నాడు.

ఇబ్రహిం 130 అడుగుల కాపర్ వైర్‌ను తీసుకుని హెల్మెట్ తరహాలో పంజరాన్ని నిర్మించాడు. బండి పై వెళ్లేటప్పుడు మనము హెల్మెట్లు తీసేయొచ్చు. కానీ ఇతను తయారుచేసుకున్న హెల్మెట్ మాత్రం తీయడానికి కుదరదు.హెల్మెట్ ధరించి బయటకు వెళ్ళినప్పుడు తనకు ఏమాత్రం సిగరెట్ తాగడానికి అవకాశం లేకుండా తయారు చేసుకున్నాడు. ఇబ్రహీం హెల్మెట్ ధరించి బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ కు తమ కుటుంబ సభ్యులు తాళం వేసి పంపుతారు. ఈ క్రమంలోనే ఇబ్రహీం బయటకు వెళ్ళినప్పుడు సీక్రెట్ తాగాలనే ఆలోచన వచ్చినా కూడా తాగలేని పరిస్థితి కనుక ఇబ్రహీం ఈ వ్యసనం నుంచి బయటపడటానికి ఈ విధంగా పంజరం తయారుచేసుకుని తనకు తానే శిక్ష విధించుకున్నాడు.ఇబ్రహిం తలకు పంజరాన్ని ధరించిన చిత్రాలను ఈ వీడియోలో చూడవచ్చు.

టర్కీ వీధుల్లో గొర్రెలు కలకలం..!

ఏంటి టర్కీ వీధుల్లో గొర్రెలా? అదెలా అని మీకు సందేహం రావచ్చు.. కానీ నిజంగానే గొర్రెలు టర్కీ వీధుల్లో తిరుగుతున్నాయ్. మీకు ఆశ్చర్యం వేసిన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న అంశం ఇది. ఎప్పుడైనా మనం హైవేపై ప్రయాణం చేస్తున్న సమయంలో కొన్ని గ్రామాల వద్ద రోడ్లపై గొర్రెల గుంపు పోతుంటుంది. అది మనం చూస్తూనే ఉంటాం. కానీ అదే నగరాల్లో అయినా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో రోడ్లపై గొర్రెలను, మేకలను మనం ఎప్పుడు చూసి ఉండం.

అలాంటిది టర్కీ విధుల్లో గొర్రెలు తిరగడమే కాదు మనుషులపై దాడులు కూడా చేశాయి. ఎవరైనా తరమాలని చూస్తే వారిని పరుగులు పెట్టించాయి. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏం జరిగిందో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యానికి గురవుతారు. అలాంటి ఘటన ఆ వీడియోల్లో జరిగింది.

ఎంతో ప్రశాంతంగా ప్రజలంతా తమ పనులతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా ఉన్నట్టుండి ఒక రోడ్డు మీదకు వచ్చింది. అది మరేదో కాదు గొర్రెల గుంపు. సిటీ లైఫ్ కి అలవాటు పడ్డ ప్రజలు గొర్రెలను చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన టర్కీలోని నెవ్ షేహిర్ ప్రాంతంలో గొర్రెల గుంపు రోడ్డుపైకి వచ్చి హల్ చల్ చేసింది. ఎదురుపడిన మనుషులను పొడవడం ప్రారంబించాయ్. సుమారు ఒక అరగంట పాటు ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గానీ రోడ్డుపై అటుగా వెళ్ళే పాదచారులను పరుగులు పెట్టించాయి. అంతేకాకుండా వాటిని ఆపుదామని వెళ్ళిన కొంతమందిని భౌతికంగా గాయపరిచాయి. ఈ సంఘటన చోటు చేసుకొని మూడు రోజులు అవ్వగా ఈ ఘటనను నెవ్ షేహిర్ ప్రాంత మున్సిపాలిటీ అధికారులు వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.