Mystery temple: ఆ గుడిలోకి వెళ్లారంటే... ప్రాణాలతో తిరిగి రాలేరు.. ఎక్కడో తెలుసా..?
Mystery temple:సాధారణంగా ప్రజలు తమ కోరికలు, బాధలను నెరవేర్చాలని దేవుడిని ప్రార్థించేందుకు గుడులకు వెళ్తుంటారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు గుడిలో దేవుడిని దర్శించుకుంటారు. మనకు ఎన్ని బాధలు ఉన్నా.. ఒక్కసారి దేవుడి ఆలయానికి వెళ్లి ఆయనను చూస్తే.. కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మనసు తేలిక అవుతుంది.
కానీ ఎవరైనా చావడానికి గుడికి వెళ్తారా..? అయితే ఓ గుడికి వెళ్తే మాత్రం చావడం ఖాయం. తెలిసి తెలిసి ఆ గుడిలోకి అడుగుపెట్టే సాహసం చేస్తారా.. ఇలాంటి ఆలయం ఎక్కడు ఉందో అని అందరికి ఆసక్తి ఉంటుంది.
ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందంటే.. దక్షిణ టర్కీలోని పాముక్కలే సమీపంలో ఉంది. ఆలయంలో పక్షులు, జంతువులు చనిపోవడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది. స్థానికులు ఈ గుడిని ‘ నరక ద్వారం’గా పిలుస్తారు. అయితే ఆ గుడిలోకి వెళ్లిన జంతువులు ఎందుకు మరణిస్తున్నాయనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు.
తాజాగా ఈ మిస్టరీని సైంటిస్టులు చేధించారు. ఈ ఆలయం దిగువ భాగం నుంచి ప్రమాదకర కార్బన్ డయాక్సైడ్ వాయువు వస్తుందని నిర్థారించారు. సైంటిస్టుల పరిశోధన ప్రకారం.. ఆలయం దిగువభాగాన పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉందని భావిస్తున్నారు. దీంతోనే గుడిలోపలకి వెళ్లిన జంతువులు, పక్షులు మరణిస్తున్నాయమని తేల్చారు. సాధారణంగా.. 10 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉంటేనే.. 30 నిమిషాల్లో ఎవరైనా మత్తులోకి జారుకుంటారు.. తరువాత మరణిస్తారు. అయితే ఈ గుహలో ఈ విషవాయువు 91 శాతం వరకు ఉందని తేల్చారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హారర్…
వరుస పరాజయాలతో కొంత వెనుకబడిన యువ హీరో నితిన్, ఈసారి హిట్ ట్రాక్లోకి రావాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్ట్ను ఎంపిక…
సినిమాల్లో యాంగ్రీమ్యాన్గా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజశేఖర్, నిజ జీవితంలో మాత్రం ఎంతో మానవతా భావంతో కూడిన వైద్యుడని…
ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్కు కష్టకాలంగా మారింది. వరుస ఓటములతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న జట్టుకు, చెన్నై సూపర్…
బాలీవుడ్ నటి కాజోల్ తాజాగా తన కెరీర్కు సంబంధించిన ఒక ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో…
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబం మరోసారి వార్తల్లో…