Mystery temple:సాధారణంగా ప్రజలు తమ కోరికలు, బాధలను నెరవేర్చాలని దేవుడిని ప్రార్థించేందుకు గుడులకు వెళ్తుంటారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు గుడిలో దేవుడిని దర్శించుకుంటారు. మనకు ఎన్ని బాధలు ఉన్నా.. ఒక్కసారి దేవుడి ఆలయానికి వెళ్లి ఆయనను చూస్తే.. కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మనసు తేలిక అవుతుంది.

కానీ ఎవరైనా చావడానికి గుడికి వెళ్తారా..? అయితే ఓ గుడికి వెళ్తే మాత్రం చావడం ఖాయం. తెలిసి తెలిసి ఆ గుడిలోకి అడుగుపెట్టే సాహసం చేస్తారా.. ఇలాంటి ఆలయం ఎక్కడు ఉందో అని అందరికి ఆసక్తి ఉంటుంది.

ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందంటే.. దక్షిణ టర్కీలోని పాముక్కలే సమీపంలో ఉంది. ఆలయంలో పక్షులు, జంతువులు చనిపోవడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది. స్థానికులు ఈ గుడిని ‘ నరక ద్వారం’గా పిలుస్తారు. అయితే ఆ గుడిలోకి వెళ్లిన జంతువులు ఎందుకు మరణిస్తున్నాయనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు.
మరణాలుకు ఈ వాయువే కారణం:
తాజాగా ఈ మిస్టరీని సైంటిస్టులు చేధించారు. ఈ ఆలయం దిగువ భాగం నుంచి ప్రమాదకర కార్బన్ డయాక్సైడ్ వాయువు వస్తుందని నిర్థారించారు. సైంటిస్టుల పరిశోధన ప్రకారం.. ఆలయం దిగువభాగాన పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉందని భావిస్తున్నారు. దీంతోనే గుడిలోపలకి వెళ్లిన జంతువులు, పక్షులు మరణిస్తున్నాయమని తేల్చారు. సాధారణంగా.. 10 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉంటేనే.. 30 నిమిషాల్లో ఎవరైనా మత్తులోకి జారుకుంటారు.. తరువాత మరణిస్తారు. అయితే ఈ గుహలో ఈ విషవాయువు 91 శాతం వరకు ఉందని తేల్చారు.































