Tag Archives: unstoppale talk show

సురేఖను పెళ్లి చేసుకున్నాడు కాబట్టే చిరంజీవి అంత బాగున్నాడు.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య
హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ యన్.బి.కె టాక్ షో దీపావళి పండుగ సందర్భంగా ఆహా ఓటీటీలో ప్రారంభమయ్యింది. ఈ షోకి మొదటి రోజున గెస్ట్ లుగా నటుడు మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నటుడు అల్లు అరవింద్ ఆహా ఓటీటీ క్రమంగా పాపులర్ అవుతోంది. ఇందులో కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు, అలాగే ఒరిజినల్ సినిమాలతో ఆహా ఓటిటి అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ షో తొలి ఎపిసోడ్ కి మోహన్ బాబుని రంగంలోకి దించారు. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న షో కి హన్ బాబు గెస్ట్ రావడంతో అన్ స్టాపబుల్ పై మరింత ఉత్కంఠ కొనసాగింది.

దీపావళి కానుకగా తొలి ఎపిసోడ్ గురువారం విడుదలయింది. మోహన్ బాబుతో పాటుగా మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా ఈ షోలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే బాలయ్య, మోహన్ బాబు మధ్య అనేక విషయాలు గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్బంగా మోహన్ బాబు మాట్లాడుతూ..తన సినీ కెరీర్ లో పడ్డ ఇబ్బందులు, స్వర్గీయ ఎన్టిఆర్ తో తన అనుబంధం గురించి వివరించారు. కెరీర్ మొదట్లో తనుపడ్డ కష్టాలు గురించి కూడా చెప్పుకున్నాడు.

ఆ సమయంలో తన భూములు అమ్మి అప్పులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. అలా ఒకరోజు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ‘అన్నయ్య మీతో సినిమా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పాను. రాజకీయాల్లో విఫలమైన నన్ను సినిమాల్లో ఇంకేం చూస్తారు. అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకు అని అన్నారు. ఆ మాటలతో ఎన్టీఆర్ మరోసారి తన గొప్పతనం చాటుకున్నారు అని మోహన్ బాబు అన్నారు.

బాలయ్య చిరంజీవిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ ఆసక్తికర ప్రశ్న అడగగా దీనికి మోహన్ చిరంజీవి పై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. చిరంజీవి ఒక మంచి నటుడు అద్భుతమైన డాన్సర్. మేమిద్దరం కలసి ఎన్నో చిత్రాల్లో నటించాం. అల్లు రామలింగయ్య గారి అమ్మాయి సురేఖని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. సురేఖ నాకు సోదరి లాంటిది. అంటే మన ఇంటి అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టే అతను బాగున్నాడు అంటూ మోహన్ బాబు చిరంజీవి, అతని పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలయ్య టాక్ షో ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలుసా?

వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే రికార్డులు సృష్టించిన నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా ఆహా యాప్ ద్వారా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖ సినిమా సెలబ్రిటీలను ఆహ్వానించి వారి వ్యక్తిగత విషయాల గురించి ప్రేక్షకులకు తెలియజేయనున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమం దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కానుందని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి సీనియర్ హీరోలను కూడా ఆహ్వానించి ముచ్చటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెగా కుటుంబం, మంచు కుటుంబం ఈ కార్యక్రమానికి అతిధులుగా వస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఇకపోతే 4వ తేదీ ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి ఎవరు వస్తారు అనే విషయం పై ఎంతో ఆతృత నెలకొంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు రానున్నట్లు సమాచారం. బాలకృష్ణ మొదటి ఎపిసోడ్ లో భాగంగా మోహన్ బాబును పలు ప్రశ్నలు అడగడనున్నట్లు తెలుస్తోంది.

ఇక నందమూరి బాలకృష్ణ మోహన్ బాబు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉందని వీరిద్దరూ ఎంతో ఆప్యాయంగా సోదర అంటూ ఒకరినొకరు పరామర్శించకుంటారనే విషయం తెలిసిందే. మరి ఈ ఎపిసోడ్లో వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ కార్యక్రమం ఎలా కొనసాగనుంది అనేది తెలియాలంటే మొదటి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

ఆ టాక్ షో కి బాలకృష్ణ అంత రెమ్యూనరేషన్ తీసుకోనున్నారా..?

నందమూరి బాలయ్య అభిమానులు కొన్ని రోజుల నుంచి మంచి జోష్ లో ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే.. అతడు ఆహాలో త్వరలో ప్రసారం కానున్న అన్‌స్టాపబుల్‌ షో కి హోస్ట్ గా వ్యవహరించునున్నారు. బాలయ్య ఈ అన్‌స్టాపబుల్‌ షోలో ఎలా యాంకరింగ్ చేయనున్నారో చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అల్లుఅరవింద్ ఆ హీరోను ఒప్పించడంలో సఫలం అయ్యారు. ఈ షో నవంబర్ 4 నుంచి ఆహాలో టెలికాస్ట్ కానుంది.

ఈ షో లాంచ్ వేడుకలో బాల‌కృష్ణ‌ మాట్లాడుతూ.. పొట్టివాళ్లు గట్టివాళ్లు అంటూ అల్లు అరవింద్ ను ఆట పట్టించారు. తన తండ్రితో ఇండస్ట్రీలో ఎవరికీ లేని చనువు కేవలం అల్లు రామలింగయ్యకు మాత్రమే ఉండేదని.. ఎన్టీఆర్ ను బండోడు అనే వాడని గుర్తు చేసుకున్నారు.

ఇలా అతడి సంభాషణ అంతా సందడి సందడిగా సాగిపోయింది. ఇదిలా ఉండగా.. బాలకృష్ణ ఈ షోకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనేది అభిమానులు తెలుసుకోవాలని ఉత్సుకతను చూపిస్తున్నారు. అయితే ఈ షోకు అతడు భారీగా పారితోషికమే అందుకోనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఒక్క సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

బాలయ్యతో యాంకరింగ్ అంటే మామూలు విషయం కాదు.. దానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. అల్లు అరవింద్ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అతడు ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు రూ.40 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిలో మొత్తం 12 ఎపిసోడ్లు ఉంటాయి. మొత్తం లెక్కేస్తే.. దాదాపు రూ.6 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకోనున్నారు బాలయ్య.

వ్యాఖ్యతగా మారనున్న బాలకృష్ణ.. అన్‌ స్టాపబుల్‌ షో కర్టెన్‌రైజర్‌లో అలరించిన బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ అనగానే డైలాగ్స్ గుర్తుకువస్తాయి. అతడు చెప్పే డైలాగ్ డెలివరీ తెలుగు సినీ పరిశ్రమలోనే ఎవరికీ సాధ్యం కావు. అలా ఉంటాయి అతడి డైలాగ్స్. అయితే అతడు ఓ సంచలనాలకు తెర లేపుతున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అతడు మొదటి సారి వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్నారు. అన్‌స్టాపబుల్ అనే షో కోసం బాలయ్య వ్యాఖ్యతగా అలరించబోతున్నారు.

ఈ షో నవంబంర్ 4 నుంచి ప్రసారం కానుంది. దీనికి సంబంధించి ఆహా ఓ ప్రోమో ద్వారా ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబుతో పాటు ఇంకెంతో మంది స్టార్ హీరోలను బాలయ్య ఇంటర్వ్యూ చేయనున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ షోకి సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది.

రాయి శిల్పంగా కావాలంటే.. ఉలి దెబ్బలు తినాలి.. ఆ తర్వాతనే దానికి రూపం వచ్చి ప్రతీ ఒక్కరూ అపురూపంగా చూస్తారు. ప్రతీ మనిషి జీవితంలో కూడా ఇలాంటి ఎత్తుపల్లాలు ఉంటాయని.. వాటిని అధిగమించి ముందుకు సాగాలన్నారు. ఈ షో కాన్సెప్ట్ నచ్చడంతో తాను ఒప్పుకున్నట్లు పేర్కొన్నాడు బాలయ్య. అల్లు రామలింగయ్య అంటే.. తన తల్లిదండ్రులకు ఎంతో అనుబంధం ఉందంటూ.. చెప్పుకొచ్చాడు.

ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో మాట్లాడి వాళ్ల భావోద్వేగాలను పంచుకుంటూ.. వాళ్లమాటలను మీ ముందు ఉంచుతానని బాలయ్య అన్నారు. ఇక అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బాలయ్య సినిమాలో హీరో మాత్రమే కానీ.. నిజజీవితంలో కాదు అంటూ చెప్పాడు. ఏవి తనలో దాచుకోరని.. బాధ, ప్రేమ, ఏదైనా బయటకు చూపిస్తాడన్నారు. ఈ కాన్సెప్ట్ గురించి డిస్కషన్ చేస్తున్న సమయంలో బాలయ్య చేస్తే ఎలా ఉంటుందని మా సభ్యులతో చెప్పినప్పుడు.. చాలామంది ఓకె చేశారని.. వెంటనే బాలయ్యకు ఫోన్ చేయగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పుకున్నట్లు చెప్పాడు.