నందమూరి బాలయ్య అభిమానులు కొన్ని రోజుల నుంచి మంచి జోష్ లో ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే.. అతడు ఆహాలో త్వరలో ప్రసారం కానున్న అన్స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరించునున్నారు. బాలయ్య ఈ అన్స్టాపబుల్ షోలో ఎలా యాంకరింగ్ చేయనున్నారో చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అల్లుఅరవింద్ ఆ హీరోను ఒప్పించడంలో సఫలం అయ్యారు. ఈ షో నవంబర్ 4 నుంచి ఆహాలో టెలికాస్ట్ కానుంది.
ఈ షో లాంచ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ.. పొట్టివాళ్లు గట్టివాళ్లు అంటూ అల్లు అరవింద్ ను ఆట పట్టించారు. తన తండ్రితో ఇండస్ట్రీలో ఎవరికీ లేని చనువు కేవలం అల్లు రామలింగయ్యకు మాత్రమే ఉండేదని.. ఎన్టీఆర్ ను బండోడు అనే వాడని గుర్తు చేసుకున్నారు.
ఇలా అతడి సంభాషణ అంతా సందడి సందడిగా సాగిపోయింది. ఇదిలా ఉండగా.. బాలకృష్ణ ఈ షోకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనేది అభిమానులు తెలుసుకోవాలని ఉత్సుకతను చూపిస్తున్నారు. అయితే ఈ షోకు అతడు భారీగా పారితోషికమే అందుకోనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఒక్క సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బాలయ్యతో యాంకరింగ్ అంటే మామూలు విషయం కాదు.. దానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. అల్లు అరవింద్ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అతడు ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు రూ.40 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిలో మొత్తం 12 ఎపిసోడ్లు ఉంటాయి. మొత్తం లెక్కేస్తే.. దాదాపు రూ.6 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకోనున్నారు బాలయ్య.
రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…