Tag Archives: viral photos

Ashu Reddy: సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ అందాల జాతర చేసిన అషు రెడ్డి.. అమ్మడి అందాల జాతర మామూలుగా లేదుగా?

Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో అషు రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.ఈమె టిక్ టాక్ వీడియోలు డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఎంతో పాపులారీటీ సంపాదించుకున్నారు.ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కాస్త సమంత పోలికలతో ఉండడంతో అందరూ ఈమెను జూనియర్ సమంతగా పాపులర్ చేశారు.

ఈ క్రమంలోనే ఇదే అవకాశంగా భావించిన అషు రెడ్డి రోజురోజుకు విపరీతమైన సాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు. ఇదే పాపులారిటీతో ఈమె ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకుంది. మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ చాలా తక్కువ సమయంలోనే వెనతిరిగి వచ్చింది. బిగ్ బాస్ తర్వాత సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.

 

ఇకపోతే తాజాగా మరోసారి బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి బిగ్ బాస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సందడి చేశారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె వరస బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

అందంతో మతిపోగోడుతున్న బిగ్ బాస్ బ్యూటీ…

తాజాగా అషు రెడ్డి సోషల్ మీడియా వేదిక కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇందులో ఈమె పొట్టి నిక్కరు స్లీవ్ లెస్ టైట్ టీ షర్ట్ ధరించి అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. సముద్రంలో పడవపై ప్రయాణం చేస్తూ ఒకవైపు సముద్ర అందాలను ఆస్వాదిస్తూనే మరోవైపు తన అందాలతో అభిమానులకు విందు వడ్డించారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్ లు యధావిధిగా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

చెత్త సేకరణతో రూ. కోట్లు సంపాదించింది ఆ యువతి.. అదేలా అంటే..!

కొన్ని సంఘటనలు తెలిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. చెత్త వేరుకునే వ్యక్తి.. భిక్షాటన చేసే వ్యక్తి కోటీశ్వరులు అయ్యారని వింటూ ఉంటాం. అవి మనం నమ్మడానికి అంత స్కోప్ లేకున్నా.. నిజం కాబట్టి నమ్మి తీరాల్సిందే. అలాంటిదే ఓ ఘటన నమ్మశక్యం కాకుండా ఉంది.

అది ఏంటంటే.. టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉంటున్న 32 ఏళ్ల టిప్పానీ.. ఓ కేఫ్ లో ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉంది. అక్కడ వచ్చే జీతం సరిపోకనో.. లేదా మరేదైనా కారణం వల్లనో ఏమో కానీ.. ఆమె జాబ్ కు రిజైన్ చేసింది. తర్వాత ఆమె చెత్త ఏరడం మొదలు పెట్టింది. చెత్త అంటే తిని పారేసిన విస్తారాకులు, గ్లాస్ లు కాకుండా.. రీ-సైక్లింగ్ చేయగలిగేవి.. కొద్దిగా వాడి పారేసిన చాలా వస్తువులను మాత్రమే సేకరించింది.

ఎలక్ట్రానిక్ వస్తువులు, వీడియో గేమ్‌లు, కలర్స్ స్కెచ్చెస్, డెలివరీ అట్టపెట్టెలు, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, వాటర్ బాటిల్స్, మేకప్ ఐటెమ్స్ వంటి వాటిని సేకరించి విక్రయించడం కూడా మొదలు పెట్టింది. అలా ఆమె వాటిని తక్కువ ధరకు అమ్ముతూ మొదటి నెల రూ. 88 వేలు సంపాదించింది.

ఇలా ఆమె గత ఐదు సంత్సరాలుగా ఇలానే విక్రయిస్తూ నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తూ.. రూ. కోట్లల్లో కూడబెట్టింది. మొదట్లో భర్త ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తర్వాత ఆమె చేసే పని చూసి గర్వంగా ఫీలయ్యాడు. తర్వాత ఆమె టిక్ టాక్ లో అకౌంట్ తెరిచి తాను ఏం పని చేస్తుందో అంతా వివరంగా చెప్పడం మొదలు పెట్టింది. దీంతో ఆమె టిక్ టాక్ పాలోయింగ్ కూడా ఎక్కువ అయింది. దీనిని చూసి ఆమె చేస్తున్న పనికి ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు.

అతడి కళాఖండాలు అద్భుతం.. వణికే వ్యాధి ఉన్నా ప్రతిభ అమోఘం..

ఏ పని చేయాలన్నా మనం ఆరోగ్యంగా ఉంటేనే చేయగలం. అలాంటిది వణికే వ్యాధి ఉంటే..చేసే పని చేయడంలో ఉపయోగం ఉండదు. ఇలా ఓ వ్యక్తి వణికే వ్యాధి ఉంది. అయినా అతడు చేసే పని అందరు మెచ్చుకునే విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. అతడి పేరు షిజి. అతడికి మొదటి నుంచి వణికే వ్యాధి ఉంది.

అప్పటి నుంచి అతడి కాళ్లు, చేతులు వణుకుతుండటంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. అయినా అతడి ధృఢసంకల్పం కింద ఆ వ్యాధి పటాపంచలైంది. అతడి చేసే కళాఖండాలతో అందని మన్ననలు పొందుతున్నాడు. ఇంతకు అతడు చేస్తున్న పనేంటంటే.. కేరళలో నివసిస్తున్న అతడు మీనియేచర్ ఆర్ట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. వివిధ రకాల వాహనాల బొమ్మలను తయారు చేస్తున్నాడు.

డబుల్ డెక్కర్ బస్సులు, వార్ ప్లేన్స్, హెలికాప్టర్స్, ఆటో రిక్షాలు లాంటివి తయారు చేస్తున్నాడు. చూడటానికి అవి నిజంగా ఫ్యాక్టరీలో తయారైన వస్తువులా కనిపించడం అతడి ప్రతిభకు నిదర్శనం. తాను తిన్నా, తాగినా చేతులు వణుకుతాయని ఆయన చెప్పుకొచ్చాడు. ఒక్కో సమయంలో తింటున్న సమయంలో అన్నం తన ముఖంపై కూడా పడేదని షిజి చెప్పుకొచ్చాడు.

అంతటి సమస్య ఉన్న అతడు ఎంత కష్టంగా బొమ్మలను తయారు చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సోదరుల దగ్గర ఈ మీనియేచర్ ఆర్ట్ నేర్చుకున్నారు. ఇదే ఇప్పుడు ఆయనకు జీవనాధారంగా మారింది. చిన్న పైపులు, చిన్న బాటిల్స్, హ్యాట్ , ప్యాకింగ్ బాక్సులు వంటి వాటితోనే షిజీ ఈ బొమ్మలను చేస్తుండటం విశేషం. ఈయన ప్రతిభను తెలుసుకున్న ప్రతీ ఒక్కరు అతడిని మెచ్చుకుంటున్నారు.

ఈ సెలబ్రిటీ ఎవరో గుర్తుపట్టారా.. చూడటానికి ‘చందమామ’లా ఉంది కదా..?

సెలబ్రిటీల చిన్న నాటి ఫొటలు చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్ల ఆసక్తికి అనుగుణంగా కొన్నిసార్లు సెలబ్రిటీలు కూడా తమ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్త కొన్ని నిమిషాల వ్యవధిలోనే వైరల్ అవుతూ ఉంటాయి. లక్షల కొద్ది షేర్ లు, లైక్ లు పడుతుంటాయి.

అంతేకాకుండా ఆ ఫొటోలను చూసి అభిమానులు రకరకాలుగా ముచ్చటిస్తుంటారు. అయితే ఇక్కడ ఓ సెలబ్రిటీ తన చిన్ననాటి ఫొటో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన చైల్డ్‌హుడ్ పిక్ ఇది. ముసి ముసిగా నవ్వుతూ.. అందమైన డ్రెస్‌లో చందమామలా కెమెరాకు ఫోజిచ్చింది ఈ చిన్నారి.

ఆమె టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు మాత్రమే కాదు యువ హీరోలతో సైతం జత కట్టింది. తమిళ, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇంతకూ ఆ హీరోయిన్ పేరు ఏంటంటే.. కాజల్ అగర్వాల్. చందమామ సినిమాలో నటించి ఎంతో ఫేమ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇలా చూడచక్కటి డ్రస్ లో ఫోజిచ్చింది. ఈ పిక్ సోషల్ మీడియాలో తెలగ వైరల్ అవుతోంది. కొంతమంది ఆ ఫొటోను తన స్నేహితులకు షేర్ చేస్తూ ఎవరో గుర్తుపట్టండంటూ ఫజిల్ కూడా పెట్టేస్తున్నారు. ప్రస్తుతం కాజల్.. తెలుగులో ఆచార్యలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా పలు భాషల్లో ఆరు నుంచి ఏడు సినిమాల్లో నటిస్తోంది. ఉమా, ప్యారిస్ ప్యారిస్, హే సినామికా, కరునగాపియం, ఘోస్టీ మరియు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2(ఇండియన్ 2) సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.

ఒంటిపై నూలుపోగు లేకుండా నెట్టింట్లో రచ్చ చేస్తున్న.. ప్రభాస్ హీరోయిన్!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అకౌంట్ ఓపెన్ చేసి తమ అందాలను ఆరబోస్తూ కుర్రకారుల మతిపోగొడుతున్నారు. ఈ విధంగా తమ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నెట్టింట్లో తెగ రచ్చ చేస్తున్నారు. ఈ విధంగా అభిమానులకు టచ్లో ఉంటూ వారిని సందడి చేసే వారిలో బాలీవుడ్ బామ జాక్వెలిన్ ముందు వరుసలో ఉంటారు.

ఈ క్రమంలోనే ఈ బ్యూటీ కొన్నిసార్లు హద్దులు మీరి ఫోటో షూట్లను జరుపుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫోటోషూట్ జరుపుకున్న ఈమె ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజానికి శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ పేరున్న మోడల్ గా ఇండియాలో కూడా సరైన గుర్తింపును సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అలాదిన్’తో బాలీవుడ్ లోకి ఎంటర్ అయి ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. కేవలం బాలీవుడ్ హీరోలతో మాత్రమే కాకుండా టాలీవుడ్ హీరోలతో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన సాహో సినిమాలో
‘బ్యాడ్ బాయ్’అనే స్పెషల్ సాంగ్ లో ప్రభాస్ తో సందడి చేసింది. అదేవిధంగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న “హర హర వీరమల్లు” చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒంటిపై ఒక్క నూలుపోగు కూడా లేకుండా కేవలం ఒక టవల్ అడ్డుగా పెట్టుకుని తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలను ఈ బ్యూటీ షేర్ చేయడంతో ప్రస్తుతం అవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఆ ఊరు మొత్తం బొమ్మలే.. కానీ బొమ్మలని ఎవరూ నమ్మలేరు?

పల్లెల్లో జీవన విధానం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ పట్టణాలలో నివసించే వారు ఇలాంటి జీవితాన్ని అనుభవించలేరు. ఎక్కడ చూసిన రద్దీగా జనాలు, ఆకాశాన్ని తాకే మేడలు తప్ప పట్నం వాసులకు మరేమీ కన్పించవు. ఈ క్రమంలోనే పట్నం వాసులను కొంతమేర ఆనంద పరచడానికి హైదరాబాద్లో శిల్పారామంలో పల్లె వాతావరణానికి సంబంధించిన సెట్ వేసి పట్నం వాసులకు కొంతమేర ఆనందాన్ని కలిగిస్తున్నారు. అచ్చం శిల్పారామం మాదిరిగానే అంతకన్నా పెద్ద విలేజ్ సెట్టింగ్ మనం కర్ణాటక వెళ్తే చూడవచ్చు.

కర్ణాటక రాష్ట్రానికి మీరు పర్యాటక ప్రాంతాలను చూడటానికి వెళితే ఈ రాష్ట్రంలో హవెరి జిల్లా… గొటగొడికి వెళ్లండి.అక్కడి ఉత్సవ్ రాక్ గార్డెన్‌ను మాత్రం ఎలాంటి పరిస్థితులలో చూడకుండా వెనుక తిరగకండి. ఆ తరువాత ఇంత అందమైన ప్రదేశాన్ని ఎలా మిస్ అయ్యామని బాధపడక మానరు. ఈ గ్రామంలో అంత ప్రత్యేకత ఉంది. మరి ఆ గ్రామంలో ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉత్సవ్ రాక్ గార్డెన్ లోకి మనం వెళ్లి చూస్తే… అక్కడ అన్ని బొమ్మలు ఉంటాయి. కానీ అవి బొమ్మలు అని మాత్రం అనిపించవు అంత అందంగా సహజసిద్ధంగా అచ్చం మనుషుల మాదిరే పోలిఉన్న ఆ బొమ్మలను చూస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.అచ్చం పల్లె వాతావరణాన్ని తలపించే విధంగా ఈ గార్డెన్లో బొమ్మలను ఏర్పాటు చేసి ఉన్నారు

ఈ గార్డెన్ లో బొమ్మలతోనే కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్లు, పశువుల సంత, ఇలా ఏది చూసి నా మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించే విధంగా ఈ గార్డెన్ ఉంటుంది.ప్రస్తుతం పట్టణంలో పెరిగే పిల్లలకు పల్లె వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు కనుక అలాంటి వారి కోసమే కళాకారుడైన డాక్టర్‌ టి.బి సొలబక్కనవర్‌ ఈ ఉత్సవ్ గార్డెన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్డెన్ లో సుమారు అన్ని రకాల వృత్తులకు చెందిన కళాకారులకు సంబంధించి సుమారు వెయ్యి బొమ్మల వరకు కొలువై ఉన్నాయి. మరెందుకాలస్యం ఈసారి కర్ణాటక టూర్ ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ గార్డెన్ చూడకుండా మాత్రం రాకండి.

వధువును అత్తింటికి హెలికాప్టర్లో తీసుకువచ్చిన వరుడు… కారణం ఏమిటంటే?

మన దేశం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ చాలామందిలో లింగ వివక్షత అనేది ఎక్కువగా ఉంది. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే తల్లిదండ్రులు ఎంతో భారంగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆడ పిల్లలని ఈ భూమిపైకి రాకముందే చిదిమేస్తున్నారు. అయితే ఇలాంటి ఆలోచన ధోరణి మారాలని అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఇద్దరూ సమానమేనని చెబుతూ.. ఆడపిల్లల పట్ల వివక్ష చూపే వారికి సరైన గుణ పాఠాలు చెబుతున్నారు హర్యానాకు చెందిన మనీష్ సైనీ.

మనీష్ సైనీ జింద్‌లోని నర్వానాకు చెందిన మోనికా సైనీని అతడు పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి తర్వాత వధువును తన ఇంటికి తీసుకు రావడానికి మనిష్ ఏకంగా హెలికాఫ్టర్ అద్దెకు తీసుకొని అత్తవారింటికి ఎంతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా తీసుకువచ్చారు. ఇలా తీసుకు రావడానికి గల కారణాలను కూడా ఈ సందర్భంగా మనీష్ తెలిపారు.

మనీష్ తండ్రి మాజీ కౌన్సిలర్ రామ్ కుమార్ సైనీ తల్లి రంకాలీ. వీరిద్దరికీ ముగ్గురు కొడుకులు ఒక కూతురు సంతానం కలదు. వీరిద్దరి కొడుకులు పెళ్లికి కూడా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా తన కూతురికి కూడా కట్నం ఇవ్వకుండా పెళ్లి చేశారు.ఈ సమాజంలో కూతురు కొడుకు ఇద్దరూ సమానమేనని భావించివారి కొడుకులకు కట్నం తీసుకోకుండా వారి కూతురికి కట్నం ఇవ్వకుండా ఎంతో ఘనంగా వివాహాలు జరిపించారు.

ఈ సమాజానికి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ సమానమేననే విషయాన్ని చాటి చెప్పాలని భావించిన మనీష్ తల్లి రంకాలీపైసా కట్నం తీసుకోకుండా తన చిన్న కోడలిని హెలికాప్టర్లో అత్తవారి ఇంటికి తీసుకు రావాలని కోరింది. ఈ క్రమంలోనే మనీష్ తన భార్యను అత్తింటికి హెలికాప్టర్లో తీసుకురావడంతో ఈ వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా..ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు.

సెగలు పుట్టిస్తున్న బాలయ్య భామ.. మరి ఇంత హాటుగానా?

టాలీవుడ్ హీరోయిన్ హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. తన అందంతో కుర్రాళ్ళ మనసులు దోచుకున్న ఈ బ్యూటీ..మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కంచె, సైరా వంటి పలు సినిమాలలో నటించింది. తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషలలో కూడా నటించింది. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తన ఎద అందాలతో సెగ పుట్టిస్తు మరింత హాట్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

టాలీవుడ్ హీరోయిన్ హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.

తన అందంతో కుర్రాళ్ళ మనసులు దోచుకున్న ఈ బ్యూటీ..

మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత కంచె, సైరా వంటి పలు సినిమాలలో నటించింది.

తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషలలో కూడా నటించింది.

ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ లో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తన ఎద అందాలతో సెగ పుట్టిస్తు మరింత హాట్ గా కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

కుక్కతో ఒంటరిగా బోటింగ్‌కు వెళ్లిన రెజీనా.. వైరల్ ఫోటోలు!

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గురించి అందరికీ తెలిసిందే. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది. అంతే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. ఇక ఈ మధ్య అవకాశాలు కూడా చాలా తగ్గాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్ లతో బాగా బిజీగా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో సముద్రం మధ్యలో తన కుక్కతో ఒంటరిగా బోటింగ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గురించి అందరికీ తెలిసిందే.

తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..

శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.

ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది.

అంతేకాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.

ఇక ఈ మధ్య అవకాశాలు కూడా చాలా తగ్గాయి.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్ లతో బాగా బిజీగా ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో సముద్రం మధ్యలో తన కుక్కతో ఒంటరిగా బోటింగ్ చేస్తూ కనిపించింది.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.