Tag Archives: virat kohli

విరాట్ బయోపిక్ లో అఖిల్.. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ!

అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఏ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా అక్టోబర్ 15 వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో అఖిల్ పాల్గొంటున్నారు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అఖిల్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అఖిల్ నటిస్తున్నటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి మాట్లాడటమే కాకుండా తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తెలిపారు. తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం అన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు క్రీడల బయోపిక్ సినిమాలంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తెలిపారు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో రణవీర్ సింగ్ దీపికా పదుకొనే నటించిన 83 సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, ఈ సినిమా కపిల్ దేవ్ జీవిత ఆధారంగా తెరకెక్కి ఉండడంతో ఈ సినిమాపై ఎంతో ఆతృత ఏర్పడిందని తెలిపారు. ఈక్రమంలోనే తనకి కూడా ఏదైనా క్రీడల బయోపిక్ చిత్రాలలో నటించాలని ఉందన్న విషయాన్ని బయటపెట్టారు.

ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ తనకు ప్రస్తుత ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమాలో నటించాలని ఉందని తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.విరాట్ కోహ్లీ జీవితం క్రికెట్ పై ఫ్యాషన్ తో, చాలా అగ్రెసివ్ గా ఉంటుందని ఈ సందర్భంగా అఖిల్ తెలిపారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాపై అటు అఖిల్,ఇటూ బొమ్మరిల్లు భాస్కర్ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారని చెప్పవచ్చు.

కోహ్లీ డేటింగ్ చేసిన హీరోయిన్లు వీళ్లే..! అందులో మిల్కీ బ్యూటీతో పాటు మరికొంతమంది..

ఇండియాలో ప్రతీ ప్రేక్షకుడు ఎక్కువగా ఇష్టపడే విషయాల్లో క్రికెట్ ఒకటైతే.. మరొకటి సినిమా. ఇక ఇక్కడ క్రికెట్ గురించి చెప్పుకుంటే.. ఆస్ట్రేలియా కంటే వన్డేలో వరల్డ్ కప్ లు గెలుచుకుంది తక్కువే అయినా.. ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా హీరోల కంటే కూడా టీమిండియా క్రికెటర్లకే ఎక్కువ పాపులారిటీ ఉందనడంలో సందేహం లేదు. ఇక విషయానికి వస్తే.. ప్రస్తుతం టీమిండియా రథసారధి విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ఉన్న రికార్టులను త్వరలోనే కోహ్లీ అధిగమించే సత్తా కూడా ఉందని కొందరు మాజీ క్రికెటర్లు కూడా చెప్పిన విషయం తెలిసిందే. అంతలా తన ఆటతో ఆకట్టుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులను కొల్లగొట్టి కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాందించుకున్నాడు విరాట్.

2013 సంవత్సరంలో హెడ్ అండ్ షోల్డర్స్ షాంప్ ప్రకటన కోసం మొదటిసారిగా కలిసిన విరాట్, అనుష్క వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి దాకా వెళ్లింది. వీరిద్దరు 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతక ముందే విరాట్ చాలామందితో ప్రేమాయణం నడిపినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులో పాపులర్ హీరోయిన్లు కూడా ఉన్నట్లు టాక్. విరాట్ కోహ్లీకి మొదటి లవ్ తమిళం, కన్నడంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సాక్షి అగర్వాల్ తో ప్రేమాయాణం నడిపాడు.

ఆర్సీబీకి మద్దతుగా స్డేడియానికి వచ్చినప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడి.. తర్వాత వీళ్లిద్దరు డేటింగ్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఇషా బెల్లాతో రెండు ఏళ్లు లవ్ ఎపైర్ నడిపాడు. ఈమె బ్రెజిల్ కు చెందిన మోడల్. కొన్ని ఇండియన్ మూవీల్లో కూడా నటించింది. అమీర్ ఖాన్ తలాష్ మూవీ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇషా బెల్లా. తెలుగులోని విజయ్ దేవర కొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలోనూ నటించింది. 2013లో విరాట్ కోహ్లీతో ప్రేమాయణం నడిపింది. సింగపూర్ లో వీళ్లిద్దరూ కలిసి షాపింగ్ లాంటివి చేస్తుండగా మీడియాలకు కూడా దొరికిపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరు విడిపోయారు.

విరాట్ కోహ్లీ హీరోయిన్ తమన్నాతో కలిసి 2012 లో ఓ అడ్వైజ్‌మెంట్‌లో నటించాడు. వీరిద్దరి మధ్య కొన్నేళ్ల వరకు ప్రేమాయాణం నడిచినట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎంపీఎల్ యాప్ కోసం ఇద్దరు మరో సారి యాడ్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా కన్నడ నటి సంజన గల్రానీతో కూడా కోహ్లీ లవ్ లో ఉన్నాడట. ఆమె బుజ్జిగాడు సినిమాలో నటించింది. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది సంజన గల్రానీ. పంజా సినిమాలో నటించిన సారా జేన్ దియాస్ తో కూడా విరాట్ కోహ్లీ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

బ్లాక్ వాటర్ తాగుతున్న సెలబ్రిటీలు.. ఎందుకు ఇంత ప్రత్యేకత.. బ్లాక్ వాటర్ లో ఏముంది..?

చాలామందికి మినరల్‌ వాటర్‌, రోజ్‌వాటర్‌ అంటే తెలుసు కానీ బ్లాక్ వాటర్ అంటే ఏమిటలో తెలియదు. వినడానికి ఈ పేరు కాస్త కొత్తగా ఉంది కదా.. ఎందుకంటే మన దగ్గర ఇలాంటి ఓ వాటర్ ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఇప్పుడు బ్లాక్ వాటర్ అనేది మార్కెట్‌లోకి వచ్చింది. బాలీవుడ్ సెలబ్రిటీస్ కొందరు ఇదే తాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ ఎప్పటి నుంచో ఈ నలుపు నీళ్లు తాగుతున్నారు.

తాజాగా బాలీవుడ్ న‌టి మ‌లైకా ఆరోరా సైతం ఈ బ్లాక్‌వాట‌ర్‌నే తాగుతుంది. అసలు ఈ నలుపు వాటర్ ఏంటి అంటూ.. నెటిజన్లు గూగుల్ లో తెగ వెతుకుతున్నారు. దీని వల్ల లాభాలేంటి అనేది వారు తెలుసుకుంటున్నారు. అందులోనూ మలైకా అరోరా లాంటి బడా సెలబ్రిటీ సైతం బ్లాక్ వాటర్ తాగుతుందంటే.. అందులో ఏంటి స్పెషల్ అంటూ ఆరా తీస్తున్నారు. సాధార‌ణంగా మ‌నం తాగే మిన‌ర‌ల్ వాట‌ర్ ఖ‌రీదు ఒక లీట‌ర్‌కు రూ. 20 నుంచి 30 వరకు ఉంటుంది. కానీ దానికి మూడింతలు ధరతో బ్లాక్ వాటర్ ల‌భిస్తుంది.

లీటర్‌ బ్లాక్‌ వాటర్‌ బాటిల్‌కు దాదాపు రూ. 100 ఉంటుందట. దీనిలో ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో చాలా ఆరోగ్య సూత్రాలు దాగున్నాయి. లీట‌ర్ బ్లాక్ వాట‌ర్‌లో 70 మిన‌ర‌ల్స్ ఉంటాయి. అవి జీర్ణ‌శ‌క్తిని పెంపొందిస్తాయి. దాంతో పాటు మెటబాలిజం పెంపొందిస్తుంది. ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా లోయర్ అసిడిటి కూడా రాకుండా చూసుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే మలైకా అరోరా ఈ బ్లాక్ వాటర్ తాగేస్తుంది. అంతేకాదు ఈ వాటర్ తాగడం వల్ల వయసు కూడా తక్కువగా కనిపిస్తుందట. అంటే యవ్వనంగా ఉండేలా చేస్తుందన్నమాట. కేవలం మలైకా అరోరా మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీ, శృతి హాసన్, ఊర్వశి రౌతెలా లాంటి సెలబ్రిటీస్ కూడా బ్లాక్ వాటర్ తాగుతున్నారు. సెలబ్రిటీలు వీటిని తాగడంతో వాటి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.

కూతురి విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్న.. విరుష్క దంపతులు!

సెలబ్రిటీ కపుల్స్ గా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంటకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఎంతోమంది అభిమానులను సంపాదించగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అదేస్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.స్టార్ సెలబ్రిటీ కపుల్స్ గా కొనసాగుతున్న ఈ జంట సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.

ఈ ఏడాది ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తమ గారాలపట్టి ఫోటోలను మాత్రం ఈ జంట అభిమానులతో పంచుకోలేదు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ శనివారం ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ నేపథ్యంలో తన కూతురు వామికా గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

పలువురు అభిమానులు తన కూతురు వామికా పేరుకు అర్థం ఏమిటి అని అడగగా అందుకు కోహ్లీ స్పందిస్తూ… వామికా అంటే దుర్గామాత మరొక పేరు అని వివరించారు. అదేవిధంగా మరికొందరు నెటిజన్లు మీ ముద్దుల తనయ ఫోటోలను మేము చూడవచ్చా? అని ప్రశ్నించగా అందుకు కోహ్లీ..”మా కూతురికి సోషల్ మీడియా అంటే ఏమిటి అనే అవగాహన కలిగే వరకు.. ఆమె కోరికలను వ్యక్తపరిచే గలిగే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని” అనుష్క తను ఇద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ జంట తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల మనం ఇప్పుడప్పుడే వీరి గారాలపట్టిని చూడలేమని అర్థమవుతోంది. ఇకపోతే ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో కరోనా బాధితుల కోసం మీరు ఒక జంట రెండు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటిస్తూ ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపడుతున్నారు.

కరోనా బాధితుల కోసం రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన విరుష్క దంపతులు!

దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమ వంతు సహాయంగా కరోనా బాధితులను ఆదుకున్నారు. కొందరు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయగా, మరికొందరు ఆక్సిజన్ సిలిండర్ ల కోసం సహాయం చేస్తున్నారు. మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి నగదు రూపంలో విరాళాలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ క్రికెటర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కరోనా బాధితుల కోసం తమవంతు సాయంగా రూ.2 కోట్లు ప్రకటించారు.

ఈ క్రమంలోనే కెంటో ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రజల నుంచి దాదాపు రూ.7 కోట్ల నిధులు సమీకరించనున్నారు. బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా, వైద్య సౌకర్యాలు, వైద్య పరికరాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ విధంగా దేశంలో నెలకొన్న ఈ కష్ట సమయంలో ఈ జంట
యాక్ట్‌ గ్రాంట్స్‌ అనే సంస్థతో చేతులు కలిపారు.

ఈ సంస్థ ద్వారా ఏడు రోజులపాటు విరాళాలను సేకరించి ఆ డబ్బు ద్వారా దేశంలో వీలైనంత మందికి సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అందరం కలిసికట్టుగా ఉండి సహాయం చేసుకోవడం వల్ల వీలైనంత మంది ప్రాణాలను కాపాడుకోవచ్చనీ ఈ జంట ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదుకావడమే కాకుండా, వేల సంఖ్యలో మరణాలు సంభవించడం తమనెంతో కలచివేసిందని అందుకోసమే ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉంటూ వీలైనంత మందికి సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మరెంతో మంది దాతలు వారికి తోచిన విధంగా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు.

ఆ పనులు చేస్తున్న విరాట్ కోహ్లీ.. ఫోటోలు వైరల్!

ఇండియన్ టాప్ సెలబ్రిటీస్ లో ఒకరైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరు. టీమిండియా క్రికెట్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ, బాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్ అనుష్క శర్మ వీరిద్దరు ఏం చేసినా అది సెన్సేషనల్ గా మారుతుంది. వీరు చేస్తున్న పనులు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటారు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే వీరు తాజాగా కోహ్లీ తన షూస్ శుభ్రం చేసుకుంటున్న ఫోటోను అనుష్క షేర్ చేశారు.

త్వరలో ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతున్న విరాట్ కోహ్లీ ఎంతోశ్రద్ధగా తనషూస్ ని శుభ్రపరచుకుంటూ ఆ ఫోటోలో మనకు కనిపిస్తాడు.”మట్టి తో ఉన్న తన షూస్ ని విరాట్ ఎంతో శ్రద్ధగా క్లీన్ చేస్తున్నాడు”అని క్యాప్షన్ తో ఆ ఫోటోను అనుష్క శర్మ తన ఇన్‌స్ట్రా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన సదరు నెటిజన్లు ఏంటి! కోహ్లీ ఇలాంటి పనులు కూడా చేస్తాడా…. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం దుబాయ్ హోటల్ లో ఉన్న ఈ జంట ఎంతో సరదాగా గడుపుతున్నారు. దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లిన కోహ్లీ టూర్ చివరిలోనే ఇండియాకు తిరిగి రానున్నట్లు తెలిపారు.

తన భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతిగా ఉన్న నేపథ్యంలో తన డెలివరీ జనవరిలో ఉండగా అనుష్కకు డెలివరీ సమయంలో తోడుగా ఉండాలని భావించిన విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్ చివరిలో తిరిగి ఇండియాకు రావడానికి నిర్ణయం తీసుకున్నారు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయానికి బీసీసీఐ కూడా అంగీకారం తెలిపింది.

కోహ్లీ తీసుకున్న ఈ సెలవులపై నెటిజన్లు పలురకాలుగా స్పందించి కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ తన ఆనందకరమైన క్షణాలను గడపడం కోసం ఇండియాకు తిరిగి రావడం ఎంతో మంచి నిర్ణయం అని, కోహ్లీ తన వృత్తిపరంగా కంటే వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ తీసుకున్న ఈ సెలవులతో ఆస్ట్రేలియాతో జరిగే మొదటి టెస్టు తర్వాత ఇండియాకి రావడంతో భారత జట్టుకు కొంతవరకు కఠినతరం కావచ్చని మరి కొందరు భావిస్తున్నారు.