చాలామందికి మినరల్ వాటర్, రోజ్వాటర్ అంటే తెలుసు కానీ బ్లాక్ వాటర్ అంటే ఏమిటలో తెలియదు. వినడానికి ఈ పేరు కాస్త కొత్తగా ఉంది కదా.. ఎందుకంటే మన దగ్గర ఇలాంటి ఓ వాటర్ ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఇప్పుడు బ్లాక్ వాటర్ అనేది మార్కెట్లోకి వచ్చింది. బాలీవుడ్ సెలబ్రిటీస్ కొందరు ఇదే తాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ శ్రుతిహాసన్ ఎప్పటి నుంచో ఈ నలుపు నీళ్లు తాగుతున్నారు.
తాజాగా బాలీవుడ్ నటి మలైకా ఆరోరా సైతం ఈ బ్లాక్వాటర్నే తాగుతుంది. అసలు ఈ నలుపు వాటర్ ఏంటి అంటూ.. నెటిజన్లు గూగుల్ లో తెగ వెతుకుతున్నారు. దీని వల్ల లాభాలేంటి అనేది వారు తెలుసుకుంటున్నారు. అందులోనూ మలైకా అరోరా లాంటి బడా సెలబ్రిటీ సైతం బ్లాక్ వాటర్ తాగుతుందంటే.. అందులో ఏంటి స్పెషల్ అంటూ ఆరా తీస్తున్నారు. సాధారణంగా మనం తాగే మినరల్ వాటర్ ఖరీదు ఒక లీటర్కు రూ. 20 నుంచి 30 వరకు ఉంటుంది. కానీ దానికి మూడింతలు ధరతో బ్లాక్ వాటర్ లభిస్తుంది.
లీటర్ బ్లాక్ వాటర్ బాటిల్కు దాదాపు రూ. 100 ఉంటుందట. దీనిలో ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో చాలా ఆరోగ్య సూత్రాలు దాగున్నాయి. లీటర్ బ్లాక్ వాటర్లో 70 మినరల్స్ ఉంటాయి. అవి జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. దాంతో పాటు మెటబాలిజం పెంపొందిస్తుంది. ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా లోయర్ అసిడిటి కూడా రాకుండా చూసుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే మలైకా అరోరా ఈ బ్లాక్ వాటర్ తాగేస్తుంది. అంతేకాదు ఈ వాటర్ తాగడం వల్ల వయసు కూడా తక్కువగా కనిపిస్తుందట. అంటే యవ్వనంగా ఉండేలా చేస్తుందన్నమాట. కేవలం మలైకా అరోరా మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీ, శృతి హాసన్, ఊర్వశి రౌతెలా లాంటి సెలబ్రిటీస్ కూడా బ్లాక్ వాటర్ తాగుతున్నారు. సెలబ్రిటీలు వీటిని తాగడంతో వాటి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…