అప్పుడప్పడు మనం వార్తల్లో వింటూ ఉంటాం.. ఆ ఊరిలో పొలాలు దున్నుతుండగా.. ఇంటికి పునాదులు తవ్వుతుండగా.. మైనింగ్ చేస్తున్నప్పుడు పురాతన విగ్రహాలు , సంపద బయటపడుతుంటాయని. వీటిలో ఎక్కువగా దేవతల విగ్రహాలే బయటపడుతుంటాయి. కానీ ఓ చేపల చెరువులో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి.
దీంతో జనాలు ఆశ్చర్యపోయారు. ఇలాంటి వాటి కోసం కొందరు ఆలయాల్లోనూ, చారిత్రక ప్రదేశాల్లోనూ తవ్వకాలు జరుపుతుంటారు. అలా కాకుండా ఓ చేపల చెరువులో పురాతన విగ్రహాలు బయటపడటంతో జనం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు విష్ణుమూర్తి, శివలింగం ఒకేచోట లభ్యం కావడంతో అద్భుతమంటున్నారు. ఈ అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, పాకాల మండలం పెదగోల్పాడు గ్రామంలోని బావి రాగన్న చెరువులో చేపల కోసం మోటర్ తో నీటిని తోడుతుండగా విగ్రహాలు కనిపించాయి.
ఒకే చోట ఇలా విష్ణుమూర్తి, శివలింగం విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇవి బంగారంతో చేసిన విగ్రహాలు కాదు.. కంచుతో చేసినవి. మూడు అడుగుల విఘ్ణమూర్తి, శివలింగాన్ని సమీపంలోని ఆలయానికి తరలించారు.
విగ్రహాలు స్వతహాగా చెరువులో బయటపడ్డాయా లేక ఎవరైనా దొంగిలించి చెరువులో పడేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ మండల ఎమ్మార్వో సమక్షంలో వివరాలను నమోదు చేశారు పోలీసులు. అనంతరం పరావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించి.. విగ్రహాలను ట్రెజరీకి తరలించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…