Tag Archives: YS Rajasekhar Reddy

Priyadarshini Ram: వామ్మో ప్రియదర్శిని రామ్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా.. సినిమాకు తీసుకొని లవ్ స్టోరీ!

Priyadarshini Ram: తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రియదర్శిని రామ్ మీడియా రంగంలో కూడా ఎంతో మంచి ఆదరణ పొందారు. అయితే గత కొంతకాలంగా మీడియాకు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు.

రామ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే తాజాగా తన లవ్ స్టోరీ గురించి చెబుతూ పలు విషయాలను తెలియజేశారు. తన మామయ్య ఫారెస్ట్ ఆఫీసర్ అని తెలిపారు.తనకు 24 సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మాయి వయసు 18 సంవత్సరాల అన్ని తెలిపారు. తనని ప్రేమిస్తున్నాను అంటూ ఒకరోజు అమ్మాయికి చెప్పడంతో కుదరదని మొహం మీద చెప్పింది. అయితే తన గురించి తన పరిస్థితి గురించి తన తల్లి గురించి వివరించడంతో ఒక వీక్ మూమెంట్లో ఓకే చెప్పిందని తెలిపారు.

ఈ విధంగా అమ్మాయి తను ప్రేమకు ఒప్పుకున్నప్పటికీ తన తండ్రిని ఒప్పించాలన్న ఉద్దేశంతో తన తండ్రితో స్నేహం చేయడం మొదలు పెట్టానని తెలిపారు. తన తండ్రి పేకాట ఆడుతూ కూర్చునేవారని అయితే వారితో కలిసి తాను కూడా పేకాట నేర్చుకోవడానికి వెళ్ళాను అప్పటివరకు నాకు ఎలాంటి అలవాటు లేకపోయినా తన తండ్రితో స్నేహం కోసమే అక్కడికి వెళ్లే వాడినని తెలిపారు.తన తండ్రితో స్నేహం పెంచుకోవడమే కాకుండా పేకాట కూడా నేర్చుకున్నానని తన తండ్రి కోసం ఎన్నోసార్లు ఓడిపోయానని తెలిపారు.

Priyadarshini Ram: ప్రేమ కోసం పేకాట నేర్చుకున్న…


ఇలా తనతో మంచి స్నేహం ఏర్పడిన తర్వాత తన కుమార్తెను ప్రేమిస్తున్నానని తను కూడా నన్ను ప్రేమిస్తుంది. పెళ్లి చేయమని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటినుంచి తన కూతురిని ఒంటరిగా ఎక్కడికి పంపించేవారు కాదు.అయితే ఒక రోజు కాలేజీ నుంచి తనని తీసుకెళ్లిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నామని మా ప్రేమ విషయం తెలిసి రాజశేఖర్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారని ఆయన స్వయంగా రిజిస్టర్ ఆఫీస్ కి ఇన్ఫామ్ చేసి ముందుగా డాక్యుమెంట్స్ సిద్ధం చేయించారని తెలిపారు. ప్రస్తుతం రామ్ తన లవ్ స్టోరీ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Krishna: సూపర్ స్టార్ కృష్ణ కోసం ఢిల్లీ పెద్దలను ఎదిరించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ఎందుకో తెలుసా?

Krishna: ఒక సాధారణ వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ కృష్ణ అనంతరం సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలను సృష్టించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈయనే మొదటి జేమ్స్ బాండ్ మొదటి కౌబాయ్. తెలుగువారి అల్లూరి ఎవరంటే కృష్ణ గారి పేరు చెబుతారు. సింహాసనంలో రారాజుగా వెలిగినటువంటి కృష్ణ కానరాని లోకాలకు వెళ్ళిపోయారు.

ఇకపోతే చిత్ర పరిశ్రమలో ఈయన సాధించిన ఎన్నో అవార్డులు రివార్డులు మరే హీరోకి సాధ్యం కాలేదని చెప్పాలి. ఇండస్ట్రీలో కొనసాగిన కృష్ణ 350 పైగా సినిమాలలో నటించడమే కాకుండా ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నంది అవార్డులను కూడా అందుకున్నారు.2008వ సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకోవడమే కాకుండా 2009వ సంవత్సరంలో చిత్ర పరిశ్రమకు కృష్ణ అందించిన సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు.

ఈ విధంగా కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం వెనుక ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హస్తం ఉందని తెలుస్తోంది.ఈ విషయాన్ని స్వయంగా తన కూతురు మంజులతో కలిసి చిట్ చాట్ నిర్వహించిన సమయంలో కృష్ణ వెల్లడించారు.ఈ క్రమంలోనే మంజుల మాట్లాడుతూ పద్మభూషణ్ బిరుదు రావడం పై మీ ఫీలింగ్ ఏంటి అని ప్రశ్నించగా పద్మభూషణ్ కోసం తాను ప్రయత్నం చేయలేదని కృష్ణ వెల్లడించారు.

Krishna: వైయస్సార్ ప్రమేయంతోనే పద్మభూషణ్…


ఇకపోతే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనతో మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేసిన మీకు పద్మభూషణ్ రాకపోవడం ఏంటి అని బాధపడి స్వయంగా ఆయనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో మాట్లాడిన అనంతరం తన పేరును పద్మభూషణ్ అవార్డులో చేర్చారని ఆయన వల్లే తనకు ఈ అవార్డు దక్కిందని కృష్ణ వెల్లడించారు. ఇక అప్పట్లో ఈ విషయం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి కృష్ణ కోసం కేంద్రం పెద్దలను వైయస్సార్ ఎదిరించారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.

YS Sharmila: మా నాన్నను కుట్ర చేసి చంపారు.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!

YS Sharmila: వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎంత చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ స్థాపించిన ఆమె వచ్చే ఎన్నికలలో పెద్ద ఎత్తున పోటీకి దిగుతున్నారు.ఈ క్రమంలోనే కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఆమె పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్తున్నారు.

ఈ విధంగా తన పార్టీని ప్రజలలోకి తీసుకెళ్తూ ఈమె ప్రచారం నిర్వహిస్తుండగా తన ప్రచారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఈమె ఆరోపించారు. ఇకపోతే తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి ఈమె కొందరు తనని హత్య చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

YS Sharmila: తనని చంపడానికి కుట్ర చేస్తున్నారు…

తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసే చంపారని అలాగే తనని కూడా చంపడానికి ప్లాన్ చేస్తున్నారంటూ ఈమె చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాపై ఎన్ని కుట్రలు చేసినా తను భయపడనని తను పులిబిడ్డను, తనకు భయం లేదు ఈ సంకెళ్లు నన్ను ఆపలేవు అంటూ ఈమె సంకెళ్లు చూపిస్తూ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడితే టిఆర్ఎస్ నేతలకు వణుకు ఎందుకు అని ఈమె ప్రశ్నించారు. షర్మిల తన తండ్రి మరణం గురించి తనని కుట్ర చేసే హత్య చేశారంటూ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mohan Babu: రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు.. ఆ నియోజకవర్గ నుంచి పోటీ!

Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోయారు. గతంలో దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఈయన అహర్నిశలు కృషి చేస్తూ పార్టీకి తన సేవలను అందించారు.

ఈయన సేవలను గుర్తించిన అధిష్టానం ఈయనని ఏకంగా రాజ్యసభ సభ్యునిగా గెలిపించారు. అన్నగారి మరణం అనంతరం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు తన చేతిలోకి తీసుకోవడంతో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు.ఈ క్రమంలోనే తన పెద్ద కుమారుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు కుమార్తెను పెళ్లి చేసుకోవడంతో ఈయనతో బంధుత్వం ఏర్పడటమే కాకుండా వైయస్సార్ కి మద్దతుగా నిలబడ్డారు.

ఇక ప్రస్తుతం జగన్ స్థాపించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలిపిన మోహన్ బాబు గత కొద్దిరోజులుగా చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా ఉండటం వల్ల ఈయన తిరిగి రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తున్నారని, తిరిగి తెలుగుదేశం పార్టీకి తన మద్దతు తెలిపే సూచనలు ఉన్నాయంటూ పలువురు భావిస్తున్నారు. తిరుపతి సమీపంలో మోహన్ బాబు నిర్మించిన సాయిబాబా ఆలయ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మోహన్ బాబు కలిశారు.

Mohan Babu: జగన్ పై అసంతృప్తి కారణమా…

ఇలా వీరిద్దరి భేటీ కన్నా ముందుగా మోహన్ బాబు టిడిపి నేతలతో కలిసి మంతనాలు చేస్తున్నట్టు సమాచారం.ఇక సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం టిడిపి పార్టీ తరపున మోహన్ బాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై ఈయన వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వైయస్ జగన్ వ్యవహరి శైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి ఈయన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారని వార్తలు వస్తున్నాయి.

Dulquer Salmaan: సీఎం జగన్ బయోపిక్ చేయాలని ఉంది.. నటుడు దుల్కర్ కామెంట్స్ వైరల్?

Dulquer Salmaan: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమయ్యారు. ఇలా మహానటి సినిమా తర్వాత ఈయన నటించిన తదుపరి చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూలలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయనకు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.ఈయన తండ్రి గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ చిత్రంలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైయస్ జగన్ బయోపిక్ చిత్రంలో నటించే అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు దుల్కర్ సమాధానం చెబుతూ.. స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా నటిస్తానని అయితే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు నటించాలి అనే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని దాన్నిబట్టి మనం నిర్ణయించుకోవాలని తెలిపారు.స్క్రిప్ట్ ఎంతవరకు జనాలను ఆకట్టుకుంటుందనే విషయాలను కనుక గ్రహించగలిగితే తప్పకుండా ఇలాంటి సినిమాలలో నటించవచ్చు అంటూ ఈయన తెలిపారు.

Dulquer Salmaan: ఏపీ రాజకీయాల గురించి అవగాహన లేదు…

ఇకపోతే తనకు ఏపీ పాలిటిక్స్ గురించి పెద్దగా అవగాహన లేదని, కాబట్టి ఎవరి సైడ్ తీసుకోకుండా ఆలోచిస్తానని ఈయన పేర్కొన్నారు. ఇకపోతే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర చిత్రం ద్వారా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఈ క్రమంలోనే ఈయనకు సైతం ఈ విధమైనటువంటి ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం జగన్ బయోపిక్ చిత్రం గురించి దుల్కర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.