Movie News

Krishna: సూపర్ స్టార్ కృష్ణ కోసం ఢిల్లీ పెద్దలను ఎదిరించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ఎందుకో తెలుసా?

Krishna: ఒక సాధారణ వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ కృష్ణ అనంతరం సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలను సృష్టించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈయనే మొదటి జేమ్స్ బాండ్ మొదటి కౌబాయ్. తెలుగువారి అల్లూరి ఎవరంటే కృష్ణ గారి పేరు చెబుతారు. సింహాసనంలో రారాజుగా వెలిగినటువంటి కృష్ణ కానరాని లోకాలకు వెళ్ళిపోయారు.

ఇకపోతే చిత్ర పరిశ్రమలో ఈయన సాధించిన ఎన్నో అవార్డులు రివార్డులు మరే హీరోకి సాధ్యం కాలేదని చెప్పాలి. ఇండస్ట్రీలో కొనసాగిన కృష్ణ 350 పైగా సినిమాలలో నటించడమే కాకుండా ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నంది అవార్డులను కూడా అందుకున్నారు.2008వ సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకోవడమే కాకుండా 2009వ సంవత్సరంలో చిత్ర పరిశ్రమకు కృష్ణ అందించిన సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు.

ఈ విధంగా కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం వెనుక ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హస్తం ఉందని తెలుస్తోంది.ఈ విషయాన్ని స్వయంగా తన కూతురు మంజులతో కలిసి చిట్ చాట్ నిర్వహించిన సమయంలో కృష్ణ వెల్లడించారు.ఈ క్రమంలోనే మంజుల మాట్లాడుతూ పద్మభూషణ్ బిరుదు రావడం పై మీ ఫీలింగ్ ఏంటి అని ప్రశ్నించగా పద్మభూషణ్ కోసం తాను ప్రయత్నం చేయలేదని కృష్ణ వెల్లడించారు.

Krishna: వైయస్సార్ ప్రమేయంతోనే పద్మభూషణ్…


ఇకపోతే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనతో మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేసిన మీకు పద్మభూషణ్ రాకపోవడం ఏంటి అని బాధపడి స్వయంగా ఆయనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో మాట్లాడిన అనంతరం తన పేరును పద్మభూషణ్ అవార్డులో చేర్చారని ఆయన వల్లే తనకు ఈ అవార్డు దక్కిందని కృష్ణ వెల్లడించారు. ఇక అప్పట్లో ఈ విషయం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి కృష్ణ కోసం కేంద్రం పెద్దలను వైయస్సార్ ఎదిరించారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago