NTR -Krishan: తెలుగు చిత్ర పరిశ్రమలు సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోలు అందరూ తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా నిలబడ్డారు. ఇలా ఈ హీరోలందరూ ఎలాంటి పాత్రలలోనైనా ఎంతో అవలీలగా నటిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా నిలిచారు. ఇకపోతే ఎన్టీఆర్ ను ప్రేరణగా తీసుకొని కృష్ణ సినిమాలలోకి వచ్చారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇలా అన్నదమ్ములుగా ఎంతో కలిసిమెలిసి ఉన్నటువంటి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా మనస్పర్ధలు వచ్చాయి.
ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది.అల్లూరి సీతారామరాజు సినిమాని ఎన్టీఆర్ చేయాలని భావించారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమాని కృష్ణ ప్రకటించి ఈ సినిమాలో నటించారు ఇలా ఈ సినిమాలో కృష్ణ నటించిన కృష్ణ మధ్య విభేదాలు తలెత్తాయి.
ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమా ప్రకటించగా ఆయనకు పోటీగా కృష్ణ కురుక్షేత్రం సినిమా చేయడంతో ఈ సినిమా సమయంలో కూడా వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.ఇక వీరిద్దరూ తమ వారసులని ఇండస్ట్రీకి పరిచయం చేస్తే సినిమాలను ప్రకటించారు అయితే ఈ రెండు సినిమాలకు ఒకే విధమైనటువంటి టైటిల్ ఉండడంతో ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా గొడవ జరగడం కోర్టు వరకు వెళ్లడం జరిగింది. ఈ విధంగా వీరిద్దరి మధ్య పలు విషయాలలో భేదాభిప్రాయాలు వచ్చి మనస్పర్ధలు రావడంతో ఇద్దరికీ మాటలు లేవు అయితే వీరి మధ్య ఎలాంటి వివాదం వచ్చినా అది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండేది.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందిన అనంతరం ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చారు. రాజకీయాలలోకి వచ్చిన ఎన్టీఆర్ కి కృష్ణ పూర్తి మద్దతు తెలిపారు. అయితే అనూహ్యంగా రాజీవ్ గాంధీ పిలుపుమేరకు కృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలలోకి రావడంతో వీరిద్దరి మధ్య మరోసారి మనస్పర్ధలు వచ్చాయి. రాజీవ్ గాంధీ మరణం తర్వాత కృష్ణ రాజకీయాలకు దూరమయ్యారు తద్వారా తిరిగి వీరిద్దరి మధ్య మరోసారి మంచి స్నేహం ఏర్పడింది. ఇలా ఎంతో చనువుగా ఉన్నటువంటి వీరిద్దరి మధ్య పలు విషయాలలో మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…