Tarakaratana: నందమూరి తారకరత్న అనారోగ్యానికి గురై దాదాపు 20 రోజులు కావస్తున్న ఇప్పటికి తారకరత్న స్పృహలోకి రాలేదు దీంతో అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తారకరత్న ఆరోగ్య విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రలో భాగంగా పాల్గొన్నటువంటి తారకరత్న ఉన్నఫలంగా స్పృహ తప్పి పడిపోయారు. అయితే ఆయనని ప్రథమ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు స్ట్రోక్ వచ్చిందని తెలియగానే మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు.
బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న చికిత్స తీసుకుంటున్నారు అయితే ఈయన ఆసుపత్రిలో చేరి దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా స్పృహలోకి రాకపోవడంతో ఈయన ఆరోగ్యం పరిస్థితి పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అని పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ నిపుణుల సమక్షంలో తారకరత్నకు చికిత్స జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 16వ తేదీ ఈయనకు మరోసారి స్కానింగ్ నిర్వహించగా ఈయన శరీర భాగాలన్నీ కూడా స్పందిస్తున్నాయని అయితే మెదడు పని తీరు మాత్రం ఏమాత్రం స్పందించలేదని తెలుస్తుంది. ఇకపోతే వైద్యులు ఈయనకు స్కానింగ్ నిర్వహించిన తర్వాత త్వరలోనే తన హెల్త్ అప్డేట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇలా తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆ సమయంలో మెదడుకు సరైన స్థాయిలో ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఆయన మెదడు పనితీరుపై తీవ్రమైన ప్రభావం పడిందని, నిపుణులు తెలియజేశారు.అయితే తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…