Tarakaratna Friend Suresh : కుప్పంలో జరిగిన లోకేష్ పాదయాత్రలో పాల్గొని అక్కడే గుండె పోటు రావడంతో 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందుకుంటూ చివరికి మరణించిన నందమూరి తారకరత్న మరణించి ఆయన కుటుంబానికి తీరని బాధను మిగిల్చారు. ముఖ్యంగా ముగ్గురు పిల్లలను ఆయన భార్య అలేఖ్య రెడ్డి ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఇక ఆయన వ్యక్తగత జీవితం, కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత గురించి ఆయన స్నేహితుడు సురేష్ తన జ్ఞాపకాలను పంచుకున్నారు.
ప్రేమ పెళ్ళికి ఒప్పుకోలేదు… అప్పులు ఎన్ని ఉన్నాయాంటే…
తారకరత్న కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న సురేష్ గారు అయన మరణం గురించి మాట్లాడుతూ కోలుకుని తిరిగి వస్తాడనే అనుకున్నాం కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు. అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తారకరత్న సంఘీ టెంపుల్ లో కొంత మంది స్నేహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లిని అలేఖ్య కుటుంబం ఒప్పుకున్నా తారకరత్న తండ్రి ఒప్పుకోలేదంటూ చెప్పారు సురేష్, అందువల్లే మాటలు లేవంటూ చెప్పారు.
అయితే బాలకృష్ణ కలిపే బాధ్యత తీసుకున్నారంటూ ఇంతలో ఇలా జరిగిందని తెలిపారు. ఇక పెళ్లి తరువాత తానే సొంతంగా ఉండేవాడు, ఆర్థికంగా కూడా పెద్దగా ఇబ్బందులేవి లేవు అంటూ సురేష్ చెప్పారు. తనకు బాబాయ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ నుండి సపోర్ట్ ఉందంటూ చెప్పారు. నిజానికి తారకరత్నకు అప్పులు ఉండేంత ఆర్థిక ఇబ్బందిలేమి లేవని ఇల్లు కూడా కట్టించుకున్నడంటూ సురేష్ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…