Tarakratna: నందమూరి తారకరత్న హీరోగా ఇండస్ట్రీలోకి ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మించారు. ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన తారకరత్న పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.
ఇలా హీరోగా పలు సినిమాలలో నటించి అనంతరం విలన్ పాత్రలలో కూడా తారకరత్న నటించారు. ఇలా ఎంతో ఫ్యామిలీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఈయన నటనలో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. అయితే ఈ మధ్యకాలంలో తారకరత్న తిరిగి వెబ్ సిరీస్ సినిమాలలో కూడా నటిస్తున్నారు.
ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలోకి కూడా రావాలని తారకరత్న భావించారు. అయితే ఈయన అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం ఇండస్ట్రీలో తీవ్రవిషధాన్ని నింపింది. ఇక తారకరత్న మరణించడంతో తారకరత్న గొప్పతనం గురించి పలువురు మాట్లాడుతున్నారు. అలాగే తారకరత్న కోసం తమ సినిమాలో ఒక పాత్ర డిజైన్ చేశామంటూ దర్శకనిర్మాతలు చెప్పడం అందరిని కాస్త దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో తారకరత్న కోసం ఒక స్పెషల్ రోల్ డిజైన్ చేయమని బాలకృష్ణ తనకు ఫోన్ చేసే స్వయంగా చెప్పారంటూ అనిల్ రావిపూడి తారకరత్న మరణించిన రోజు తెలియచేశారు. ఇక నిర్మాత అశ్విని దత్ సైతం తారకరత్న గురించి మాట్లాడుతూ.. ఆయనది ఎంతో మంచి మనసు అని తన నవ్వు అంటే చాలా ఇష్టం అంటూ తెలిపారు. ఇక తారకరత్న కోసం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలో ఒక పాత్ర డిజైన్ చేశారని ఈయన తెలియజేశారు ఇలా తారకరత్న చనిపోయిన తర్వాత దర్శకనిర్మాతలు ఇలా చెప్పడంతో నందమూరి అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…